Rss Feed

విశ్వనాథ్ బాబు

హనుమప్ప విశ్వనాథ్ బాబు (1903-1968) 1930వ దశకములో ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. సరస్వతి టాకీస్ అనే చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక తెలుగు సినిమాలు నిర్మించాడు. విశ్వనాథ్ బాబు మార్చి 27, 1903న బెంగుళూరులో జన్మించాడు. ఈయన బావ హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన తొలి తమిళ టాకీ సినిమా కాళిదాసులో నటించాడు. చిత్ర సమాహారం * దేవసుందరి * ఆదర్శం (1952 సినిమా) * ధర్మాంగద * కృష్ణప్రేమ * భోజ కాళిదాసు * ద్రౌపదీ వస్త్రాపహరణం * కనకతార (1937 సినిమా)

హెచ్.ఎమ్.రెడ్డి

తొలి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’, తొలి తమిళ టాకీ చిత్రం కాళిదాసు తీసినవారు హెచ్‌.ఎమ్‌.రెడ్డి. ఆయన పూర్తిపేరు హనుమప్ప మునియప్ప రెడ్డి. హెచ్.ఎమ్.రెడ్డి బెంగుళూరులో పుట్టి పెరిగి, అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నాడు. బెంగుళూరులో పోలీసుగా పనిచేశాడు.[1] ఆయన హైదరాబాదు జాగీర్దార్‌ కాలేజీలో ఇంగ్లీషు టీచరుగా పనిచేసేవారు. 1927లో ప్లేగువ్యాధి ప్రబలినపుడు చాలా కుటుంబాల వలెనే వూరువిడచి బొంబాయి వెళ్ళారు. తన బావమరిది హెచ్‌.వి.బాబు అండలో సినిమా రంగంలో ప్రవేశించారు. అక్కడక్కడా వేషాలు వేస్తూ సినిమా టెక్నిక్‌ను కొంతవరకూ అర్థం చేసుకున్నారు. 1930లో ఇంపీరియల్‌ కంపెనీకి ‘విజయకుమార్‌’, 1931లో ‘ఎ వేజర్‌ ఇన్‌ లవ్‌’ అన్న రెండు మూకీలను హెచ్.ఎమ్.రెడ్డి డైరెక్ట్‌ చేశారు. రెండు చిత్రాల్లోనూ పృథ్వీరాజ్‌ కపూర్‌ ముఖ్యపాత్రధారి. అలా - శబ్దరహిత చిత్రాలు తీసి హెచ్‌.ఎమ్‌.రెడ్డి, 1931లో శబ్దసహిత చిత్రాలు తీశారు. హిందీలో తొలి టాకీ ‘ఆలం ఆరా’ అర్దేషిర్‌ ఇరానీ తీశాడు. ఆయనకి తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు తియ్యాలనిపించింది. హెచ్‌.ఎమ్‌.రెడ్డి తెలుగువాడు గనక ‘భక్తప్రహ్లాద’ని ఆయనకు అప్పజెప్పారు. అలాగే ‘కాళిదాసు’ కూడా తమిళంలో తీశారు రెడ్డి. హిందీ, తెలుగు, తమిళం మూడు భాషల చిత్రాలూ 1931 లోనే విడుదలైనాయి. ‘ఆలం ఆరా’ మార్చి 14న విడుదలైంది. ‘భక్త ప్రహ్లాద’ సెప్టెంబరు 15న విడుదలయ్యింది. అలా హెచ్‌.ఎమ్‌.రెడ్డి టాకీయుగానికి నాంది పలికి, ‘పితామహుడు’అనిపించుకున్నారు. రెడ్డిగారిని ‘టైగర్‌’ అనేవారు. మీసం మీద చెయ్యి వేసి ఈ పక్కా ఆ పక్కా దువ్వి ‘ఇది తమిళం ఇది తెలుగు’ అని దర్జాగా, గర్వంగా చెప్పుకోగల ఘనుడు హెచ్‌.ఎమ్‌.రెడ్డి. తర్వాత ‘సీతాస్వయంవరం’ (1933) చిత్రం హిందీలో తీశారు. రెడ్డి కొల్హాపూర్‌లో వున్నప్పుడు పారుపల్లి శేషయ్య, కూరుకూరు సుబ్బారావు ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ (1936) తియ్యాలని, ఆయన సహాయం కోరారు. హెచ్‌.వి. బాబు చేత ఆయన దర్శకత్వం చేయించి - తాను పర్యవేక్షణ చేసి పూర్తి చేయించారు. ఆ చిత్రం విజయవంతమైంది. గూడవల్లి రామబ్రహ్మం ఈ సినిమాకి ప్రొడక్షన్‌ మేనేజరుగా సినిమా రంగప్రవేశం చేశారు. అంతకుముందు రెడ్డిగారు తీసిన ‘ప్రహ్లాద’ నుంచి కొన్ని చిత్రాల వరకు ఎల్.వి.ప్రసాద్ సహాయకుడుగా పని చేశారు. రోహిణి పిక్చర్స్‌ పేరిట బి.ఎన్.రెడ్డి లాంటి వారిని కలుపుకుని ‘గృహలక్ష్మి’ (1938) తీసి ‘సాంఘిక పతాకం’ ఎగరవేశారు రెడ్డి. రోహిణి స్థిరపడింది, భాగస్వాములు విడిపోయి ‘వాహిని పిక్చర్స్’ స్థాపిస్తే అదీ స్థిరపడింది. రెడ్డిగారు ‘నిర్దోషి’ (1951) తీసిన తర్వాత రోహిణి స్టూడియో కట్టారు మద్రాసులో. ప్రయోగాలు చెయ్యడంలో కూడా హెచ్‌.ఎమ్‌.దిట్ట. అంతవరకూ విలన్‌ వేషాలే వేస్తున్న ముక్కామలని ‘నిర్దోషి’లో హీరోని చేశారు. వాంప్‌ వేషాలు ఎక్కువగా వేసిన అంజలీదేవిని నిర్దోషి (1951) తో హీరోయిన్‌ని చేశారు. ‘నిర్దోషి’ లో ఓ చిన్నవేషంలో కనిపించిన కాంతారావుని ‘ప్రతిజ్ఞ’తో హీరోని చేశారు. అలాగే ‘ప్రతిజ్ఞ’ లో విలన్‌ రాజనాలకు అదే తొలిచిత్రం. కమలాకర కామేశ్వరరావు, సదాశివబ్రహ్మం, కొండముది గోపాలరాయశర్మ, మల్లాది వెంకటకృష్ణశర్మ, కొవ్వలి, భమిడిపాటి కామేశ్వరరావు, శ్రీశ్రీ - ఇలా ఎందరో మహామహులను వెండితెరకు పరిచయంచేసిన ఘనులు హెచ్.ఎమ్.రెడ్డి.

సుకుమార్

సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుడు. దర్శకుడు కాక ముందు గణితం భోధించే అధ్యాపకులు. ఇతని మొదటి చిత్రం ఆర్య సంచలన విజయం సాధించి అల్లు అర్జున్ ను స్టార్ గా నిలబెట్టింది. రెండవ చిత్రం జగడం టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. మూడవ చిత్రం ఆర్య2

ఎస్.బాలచందర్

గా ప్రసిద్ధిచెందిన సుందరం బాలచందర్ (జ: 18 జనవరి 1927 – మ: 15 ఏప్రిల్ 1990) సుప్రసిద్ధ వీణా విద్వాంసులు మరియు దక్షిణ భారత సినిమా దర్శకుడు మరియు నటుడు. ఇతడు తెలుగులో దర్శకత్వం వహించిన ఏది నిజం (1956) సినిమాకు రాష్ట్రపతి ప్రశంసా పత్రం లభించింది.

సింగీతం శ్రీనివాసరావు

సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కధాభరితమైనవీ - ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. మయూరి,పుష్పక విమానం,ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు కధ వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించాడు. ఇంకా ఆయన మంచి సంగీత దర్శకుడు,కథకుడు కూడా. జననం సెప్టెంబరు 21, 1931 ఉదయగిరి, నెల్లూరు జిల్లా ప్రాముఖ్యత సినిమా దర్శకుడు వృత్తి సినిమా దర్శకుడు, రచయిత తండ్రి రామచంద్రరావు తల్లి శకుంతలాబాయి జీవిత విశేషాలు సింగీతం శ్రీనివాసరావు 1931 సెప్టెంబరు 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించాడు. తండ్రి ఒక హెడ్‌మాస్టరు. తల్లి వయొలిన్ వాయిద్య నిపుణురాలు. చెన్నై ప్రెసిడెన్సీ కాలేజీలో చదివేప్పుడు శ్రీనివాసరావుకు హరీంద్రనాద ఛటోపాధ్యాయ పర్వేక్షణలో నాటకరంగంలో ప్రవేశం ఏర్పడింది. డిగ్రీ వచ్చిన తరువాత సూళ్ళూరుపేటలో ఉపాధ్యాయవృత్తి సాగించాడు. స్వయంగా రచించిన నాటకాలు (బ్రహ్మ, అంత్యఘట్టం) తన విద్యార్ధులతో ప్రదర్శింపజేశాడు. రవీంద్రనాధ టాగూరు నాటకం "చిత్ర"ను "చిత్రార్జున" అనే సంగీతనాటకంగా రూపొందించి ప్రదర్శించి ప్రశంసలు అందుకొన్నాడు. ఈ నాటకాన్ని ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ చూశాడు. 'టామ్ బుచాన్' అనే స్కాటిష్ నాటకకారుడు ఈ నాటకాన్ని ఆంగ్లంలోకి అనువదించి ఒక అమెరికన్ టెలివిజన్ ఛానల్‌లో ప్రసారం చేశాడు. కొంతకాలం శ్రీనివాసరావు "తెలుగు స్వతంత్ర" పత్రికలో రచనలు (ప్రధానంగా ఇంటర్వ్యూలు) చేశాడు. సినిమా రంగం కానీ చలనచిత్ర రంగం శ్రీనివాసరావుకు ప్రధాన ధ్యేయం. పట్టు వదలకుండా సుప్రసిద్ధ దర్శకుడు కె.వి.రెడ్డి వెంటబడి ఆయనకు అనుచరునిగా పనిచేయడం మొదలుపెట్టాడు. మాయాబజార్ చిత్రంతో మొదలుపెట్టి చాలా చిత్రాలలో కె.వి.రెడ్డి చేతిక్రింద పనిచేశాడు. పట్టాభి రామిరెడ్డి కన్నడంలో యు.ఆర్.అనంతమూర్తి నవల ఆధారంగా సంస్కార సినిమా తీయ సంకల్పించినపుడు శ్రీనివాసరావును ఎక్సిక్యూటివ్ డైరెక్టరుగా తీసుకొన్నాడు. ఈ సినిమాకు రాష్ట్రపతి బంగారు పతకం లభించింది. 1972లో సింగీతం పూర్తి దర్శకత్వం వహించిన నీతి నిజాయితీ సినిమాను విమర్శకులు ప్రశంసించారుగాని ఆర్ధికంగా విఫలమయ్యింది. 1975లో తీసిన 'జమీందారుగారి అమ్మాయి' ఆయన మొదటి విజయవంతమైన చిత్రం. కాని 1976లో వచ్చిన అమెరికా అమ్మాయి అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పిచడమే గాక సంగీత పరంగా మంచి విజయం సాధించింది. ఆ కోవలోనే పంతులమ్మ విజయవంతమైంది. ఆ తరువాత సింగీతం విజయ పరంపర, ప్రయోగ పరంపర సమాంతరంగా సాగాయి. ముఖ్యంగా కమల్ హాసన్‌తో సింగీతం సొమ్మొకడిది సోకొకడిది సినిమాతో ఆరంభించి పలు చిత్రాలను విజయవంతంగా తీశాడు. వాటిలో మైఖేల్ మదన కామరాజు కధ, అమావాస్య చంద్రుడు, అపూర్వ సహోదరులు ముఖ్యమైనవి. సందేశాత్మకంగా తీసిన చిత్రాలలో తరం మారింది ముఖ్యమైంది. డైలాగులు లేకుండా తీసిన పుష్పక విమానం అన్ని "భాషలలో" ప్రదర్శించారు. మయూరి సినిమాలో "సుధా చంద్రన్" చరిత్రను సున్నితంగా తెరకెక్కించాడు. తెలుగులో వచ్చిన కొద్ది సైన్స్ ఫిక్షన్ సినిమాలలో ఆదిత్య 369 ఒకటి. భైరవద్వీపం సినిమాతో ప్రేక్షకులు మరచిపోతున్న జానపదచిత్రాలను గుర్తు చేశాడు. కన్నడంలో రాజకుమార్ ప్రధాన చిత్రాలలో 'శ్రావణబంతు' ఒకటి. సంగీత దర్శకునిగా సింగీతం శ్రీనివాసరావు ప్రసిద్ధ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుకు శిష్యుడు. 'భాగ్యద లక్ష్మి బారమ్మ', 'సంయుక్త' అనే రెండు విజయవంతమైన కన్నడ చిత్రాలకు శ్రీనివాసరావు సంగీత దర్శకుడు. ప్రవాస భారతీయుల పిల్ల సౌకర్యార్ధం 30 శ్లోకాలను ఆంగ్లంలో సంగీతపరంగా కూర్చాడు. సినిమాల జాబితా * ముంబై ఎక్స్‌ప్రెస్ (2005) * Son of Alladin (2003)- 3D యానిమేషన్ చిత్రం. * Little John (2002) * ఆకాశ వీధిలో (2001) * శ్రీకృష్ణార్జున యుద్ధం (1996) * చిన్న వతియార్ (1995) * భైరవద్వీపం(1994) * ఆడవాళ్ళకు మాత్రమే (1994) * మేడమ్(1993) * ఫూల్ (1993) * బృందావనం(1992) * క్షీరసాగర (1992) * ఆదిత్య 369 (1991) * మైకేల్ మదన కామరాజు కధ(1991) * అపూర్వ సహోదరులు (1989) ( తమిళం: అపూర్వ సహోదరగళ్, హిందీ: అప్పూరాజా) * చిరంజీవి సుధాకర (1988) * దేవతా మనుష్య (1988) * పుష్పక విమానం (1988) - డైలాగులు లేని సినిమా, కనుక అన్ని భాషలలోనూ విడుదలయ్యింది * అమెరికా అబ్బాయి (1987) * ఆనంద(1986) * మయూరి (1984) * శ్రావణ బంతు(1984) * చెలిసువ మొదగళు(1982) * Nancy (1981) * అమావాస్య చంద్రుడు (తమిళం: రాజా పారవై) (1981) * త్రిలోక సుందరి * మంగళ తోరణాలు(1979) * గమ్మత్తు గూఢచారులు (1978) * రామచిలుక (1978) * సొమ్మొకడిది సోకొకడిది (1978) * అందమె ఆనందం (1977) * నిరపరయుమ్ నిలవిక్కుమ్ (1977) * పంతులమ్మ (1977) * తరం మారింది (1977) * అమెరికా అమ్మాయి (1976) * ఒక దీపం వెలిగింది(1976) * జమీందారు గారి అమ్మాయి (1975) * దిక్కట్ర పార్వతి (1973) * నీతి నిజాయితి (1972)

సి.పుల్లయ్య

చిత్తజలు పుల్లయ్య మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు. ఇతను 1898లో కాకినాడలో జన్మించాడు. 1967 అక్టోబర్ 6న మద్రాసులో మరణించాడు. రఘుపతి వెంకయ్య, అతని కుమారుడు రఘుపతి ప్రకాష్ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'స్టార్ ఆఫ్ ది ఈస్ట్' ను స్థాపించారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక "మొదటి తెలుగువాడి సినిమా" అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో' (De Castello) అనే ఆంగ్ల యువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, వై.వి.రావులూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ] దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలు * భువన సుందరి కథ (1967) * భామావిజయం (1967) * పరమానందయ్య శిష్యుల కథ (1966) * లవకుశ (1963) కొంత భాగం తీసిన తరువాత పుల్లయ్య ఆరోగ్యం క్షీణించింది. సుందర్ లాల్ నహతా, బి.ఎన్.రెడ్డి ల ప్రోత్సాహంతో సి.పుల్లయ్య కుమారుడైన సి.యస్.రావు దర్శకత్వబాధ్యత చేపట్టి మిగిలిన భాగం పూర్తి చేశాడు.. * దేవాంతకుడు (1960) * పక్కింటి అమ్మాయి (1953) * సంక్రాంతి (1952) * అపూర్వ సహోదరులు (1950) * వింధ్యరాణి (1948) * గొల్లభామ (1947) * నారద నారది (1946) * బాలనాగమ్మ (1942) * మాలతీ మాధవం (1940) * వరవిక్రయం (1939) * మోహినీ భస్మాసుర (1938) * సత్యనారాయణ వ్రతం (1938) * చల్ మోహనరంగ (1937) * దశావతారములు (1937) * కాసుల పేరు (1937) * అనసూయ (1936) * ధ్రువ (1936) * శ్రీకృష్ణ తులాభారం (1935) * లవకుశ (1934 సినిమా) (1963) * రామదాసు (1933) * సావిత్రి (1933)

కొమ్మారెడ్డి సావిత్రి

తెలుగు సినీ ప్రపంచం లో మహానటి కొమ్మారెడ్డి సావిత్రి (1936 జనవరి 4 - 1981 డిసెంబర్ 26) . తెలుగు తమిళ సినిమాల్లో కూడా నటించి, మహానటి అనిపించుకుని, తరాల తరువాత కూడా ఆరాధింపబడుతూంది. ఈమె కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి నిర్మించింది. తొలి జీవితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో 1936 జనవరి 4 న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. వారికి సావిత్రి రెండవ సంతానం, 1934లో ఆడపిల్ల పుట్టగా మారుతి అని నామకరణం చేశారు. సావిత్రికి ఆరు నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించాడు. గురవయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకాం మార్చింది. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య చౌదరి, సావిత్రికి వరుసకు పెద్దనాన్న. మారుతి, సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ స్కూలులో చెరారు. పాఠశాలకు వెళ్ళే దారిలో నృత్యవిద్యాలయం ఉండేది. రోజూ ఇతరులు నాట్యం చేయటం చూసి శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం మరియూ శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి, అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది. చలనచిత్ర జీవితం పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని అభినేత్రి గా విరాజిల్లింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్ర పొంది, ఆనక ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులోనుండి తొలగింపబడింది. ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రలో నటించింది. పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానికి ఆమె, నృత్యరూపకుడు మరియూ దర్శకుడూ అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకూ ఆగవలసి వచింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మ లో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది. ఆ తరువాత వచ్చిన దొంగరాముడు, అర్థాంగి, చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరచాయి.1957 లో వచ్చిన తెలుగు చిత్ర చరిత్ర లోనే అజరామరం అనదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం. అది మొదలు యెన్నో వైవిధ్యమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణ ప్రతిష్ట చేసింది. ఆమె తమిళ చిత్రాలలోనూ నటించి పేరుతెచ్చుకుంది. తమిళంలోనూ మహానటి (నడిగెయర్ తిలగం) బిరుదు పొందింది. 1968 లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమా కు ఒక ప్రత్యేకత వుంది. బహుశా దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మింపబడిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకున్నది . అయితే అది అంత విజయం సాధించలేదు. ఆ తరువాత చిరంజీవి,మాతృదేవత, వింత సంసారం మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించింది. 1956లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ ను పెళ్ళిచేసుకుంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు - విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్ళి విఫలమైంది. ఆస్తిపాస్తులు కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై, 1981 డిసెంబర్ 26 న మరణించింది. ఇతర విశేషాలు అభిమానులు, ప్రచారసాధనాలు సావిత్రి జన్మదినాన్ని డిసెంబరు 6 గా జరుపుకుంటాయి. మల్లెపూలు, వర్షం సావిత్రికి ఇష్టమైనవి. ఆమెది ఎడమ చేతివాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు "గ్యారీ సోబర్స్" కు సావిత్రి అభిమాని. ఆ రోజుల్లోనే శివాజీగణేశన్ తోపాటు తారల క్రికెట్లో పాల్గొనేది. ఆమె వద్ద ఏనుగు దంతంతో చేసిన చదరంగం బల్లకూడా ఉండేది. సావిత్రి మంచి చమత్కారి, అంతే కాదు ఇతరులను అనుకరించటంలో కూడా దిట్ట. ఆమె తన భర్త జెమినీ గణేశన్ను, రేలంగిని, బి.సరోజాదేవిని, ఎస్వీ రంగారావుని, ఇంకా అనేకమందిని తరుచూ అనుకరించేది. దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది. నటిగా 1. సంసారం (1950) 2. అగ్నిపరీక్ష (1951) 3. పాతాళభైరవి (1951)లో నృత్యకారిణి 4. పెళ్ళిచేసి చూడు (1952)లో సావిత్రి 5. పల్లెటూరు (1952)లో సుగుణ 6. ప్రతిజ్ఞ (1953) 7. దేవదాసు (1953)లో పార్వతి 8. బ్రతుకుతెరువు (1953)లో జమీందారుగారి కూతురు 9. మేనరికం (1954) 10. చంద్రహారం (1954)లో చంచల 11. బహుత్ దిన్ హుయే (1954) (హిందీ సినిమా) 12. పరివర్తన (1954)లో సుందరమ్మ 13. వదిన (1955) 14. మిస్సియమ్మ (1955) (తమిళ సినిమా) 15. మిస్సమ్మ (1955)లో మేరీ/మహాలక్ష్మి 16. అర్ధాంగి (1955) 17. సంతానం (1955)లో శారద 18. కన్యాశుల్కం (1955)లో మధురవాణి 19. దొంగరాముడు (1955)లో సీత 20. చరణదాసి (1956)లో లక్ష్మి 21. భలేరాముడు (1956) 22. అమరదీపం (1956)లో అరుణ 23. వినాయకచవితి (1957)లో సత్యభామ/భూదేవి 24. తోడికోడళ్ళు (1957)లో సుశీల 25. ఎమ్మెల్యే (M.L.A.) (1957)లో నిర్మల 26. మాయాబజార్ (1957)లో శశిరేఖ 27. మాయాబజార్ (1957) (తమిళ సినిమా)లో శశిరేఖ 28. కర్పూరకరసి (1957) (తమిళ సినిమా)లో మంజుల 29. మాంగల్యబలం (1958) 30. అప్పుచేసి పప్పుకూడు (1958)లో మంజరి 31. నమ్మిన బంటు (1959) 32. విమల (1960) 33. శ్రీవెంకటేశ్వరమహత్యం (1960)లో పద్మావతి 34. శాంతినివాసం (1960) 35. దీపావళి (1960) 36. చివరకు మిగిలేది (1960)లో పద్మ 37. పాపపరిహారం (1961) 38. పసమలార్ (1961) (తమిళ సినిమా)లో రాధ 39. పాండవవనవాసం (1961)లో ద్రౌపది 40. కలసివుంటే కలదుసుఖం (1961) 41. సిరిసంపదలు (1962) 42. పవిత్రప్రేమ (1962) 43. మనితన్ మరవిల్లై (1962) (తమిళ సినిమా) 44. మంచిమనసులు (1962) 45. ఆరాధన (1962)లో అనూరాధ 46. గుండమ్మ కథ (1962)లో లక్ష్మి 47. రక్తసంబంధం (1962) 48. ఆత్మబంధువు (1962) 49. రక్తతిలకం (1963)లో కమల 50. మూగ మనసులు (1963)లో రాధ 51. కర్ణలో (1963) భానుమతి 52. కర్ణన్ (1963) (తమిళ సినిమా)లో భానుమతి 53. ఘర్ బసాకే దేఖో (1963) (హిందీ సినిమా) 54. చదువుకున్న అమ్మాయిలు (1963)లో సుజాత 55. నర్తనశాల (1963)లో ద్రౌపది 56. వెలుగునీడలు (1964)లో సుగుణ 57. పూజాఫలం (1964)లో సీత 58. నవరాత్రి (1964) 59. కైకొడుత్తదైవం (1964) (తమిళ సినిమా) 60. గంగా కీ లెహరే (1964) (హిందీ సినిమా) 61. డాక్టర్ చక్రవర్తి (1964)లో మాధవీ దేవి 62. దేవత (1964) 63. సుమంగళి (1965) 64. తిరువిలయాదల్(1965) (తమిళ సినిమా)లో పార్వతి యొక్క వివిధ రూపాల్లో నటించింది. 65. నాదీ ఆడజన్మే (1965) 66. మనుషులు మమతలు (1965) 67. నవరాత్రి (1966) 68. భక్తపోతన (1966)లో సరస్వతీదేవి 69. ప్రాణమిత్రులు (1967) 70. వరకట్నం (1968) 71. తల్లితండ్రులు (1970)లో కౌసల్య 72. మరోప్రపంచం (1970) 73. అశ్వథ్థామ (1970)లో కుంజుని భార్య 74. జగన్మోహిని (1978) 75. అందరికంటే మొనగాడు (1985) 76. దేవదాసు మళ్లీ పుట్టాడు 77. గోరింటాకు (చివరి సినిమా) నిర్మాతగా 1. ఏక్ చిట్టీ ప్యార్ భరీ(1985) (హిందీ సినిమా) దర్శకురాలిగా 1. మాతృదేవత (1970) 1. నవరాత్రి (1966) సినిమాలో నేపథ్య గాయని

సముద్రాల

సముద్రాల రాఘవాచార్య(1902 - 1968) తెలుగు సినిమా పరిశ్రమలో సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు. ఈయన కుమారుడు సముద్రాల రామానుజాచార్య సముద్రాల జూనియర్ గా తెలుగు చిత్ర పరిశ్రమ పరిచయము. రాఘవాచార్య 1902లో గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించాడు. పి.వి.దాసు నిర్మించిన శశిరేఖా పరిణయం సినిమాకు కొన్ని సన్నివేశాలు వ్రాయడంతో సినీ వ్యాసంగాన్ని ప్రారంభించిన సముద్రాల వందకు పైగా సినిమాలకు స్క్రిప్టులను వ్రాశాడు. అనేక పాటలు కూడా వ్రాశాడు. ఈయన వినాయకచవితి (1957), భక్త రఘునాథ్ (1960), బభృవాహన (1964) సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. రచయితగా 1. భక్త ప్రహ్లాద (1967 సినిమా) 2. శ్రీకృష్ణ పాండవీయం (1966) 3. బభ్రువాహన (1964) (మాటలు) (కథ) 4. నర్తనశాల (1963) (మాటలు) 5. లవకుశ (1963) 6. సీతారామ కళ్యాణం (1961) (మాటలు) 7. బాటసారి (1961) (మాటలు) 8. పాండవ వనవాసం (1965) 9. భూకైలాస్ (1958) 10. సారంగధర (1957)(మాటలు) 11. వినాయక చవితి (1957) 12. జయం మనదే (1956) (మాటలు) (కథ) 13. జయసింహ (1955) (మాటలు) (కథ) 14. బ్రతుకు తెరువు (1953) (మాటలు) (కథ) 15. దేవదాసు (1953)(మాటలు) 16. నవ్వితే నవరత్నాలు (1951) 17. స్వప్న సుందరి (1950) 18. షావుకారు (1950) 19. మన దేశం (1949) (మాటలు) 20. లైలా మజ్ను (1949) (మాటలు) 21. పల్నాటి యుద్ధం (1947) (మాటలు) 22. రత్నమాల (1947) 23. యోగి వేమన (1947) 24. గరుడ గర్వభంగం (1943) (మాటలు) 25. భక్త పోతన (1942 సినిమా) (కథ మరియు మాటలు) 26. దేవత (1941) (మాటలు) 27. సుమంగళి (1940) (మాటలు) 28. వందేమాతరం (1939) (మాటలు) 29. గృహలక్ష్మి (1938) దర్శకత్వం 1. బభృవాహన (1964) 2. భక్త రఘునాథ్ (1960) 3. వినాయక చవితి (1957) నిర్మాత 1. దేవదాసు (1953) (నిర్మాత) (uncredited) 2. శాంతి (1952) (నిర్మాత) (uncredited) 3. స్త్రీసాహసం (1951) (నిర్మాత) (uncredited) నేపధ్య గాయకుడు 1. భక్త రఘునాథ్ (1960) (playback singe

శ్రీను వైట్ల

ను వైట్ల తెలుగు సినిమా దర్శకుడు. ఇతని మొదటి సినిమా నీ కోసం. కానీ 2001 సంవత్సరంలో విడుదలైన ఆనందం చిత్రం ద్వారా మంచి పేరు సంపాదించాడు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా కందుల పాళెం అనే గ్రామం. సినిమాలు 1. నీ కోసం (1999) 2. ఆనందం (2001) 3. సొంతం 4. వెంకీ 5. అందరివాడు (2005) 6. ఢీ (2007) 7. దుబాయ్ శీను (2007) 8. రెడీ (2008) 9. కింగ్ (2008)

శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల ప్రముఖ తెలుగు సినీదర్శకుడు, నిర్మాత మరియు సినీ రచయిత. శేఖర్ నల్గొండ జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన వాడు. సికిందరాబాద్ లోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్ లో హైస్కూలు విద్య పూర్తి చేశాడు. సెయింట్ అల్ఫోన్సా కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తరువాత చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తరువాత అమెరికాలోని న్యూజెర్సీ లో కంప్యూటర్ సైన్సు లో పీజీ కోసం వెళ్ళాడు. కొద్ది కాలం సమాచార సాంకేతిక రంగంలో పని చేసిన తర్వాత వాషింగ్టన్ లోని హోవార్డ్ యూనివర్శిటీ లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరాడు. కెరీర్ దర్శకుడిగా ఆయన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్. ఈ సినిమాకు ఆయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారము లభించింది. [1]. తరువాత ఆయన దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమా ఆయనకు మంచి కమర్షియల్ విజయాన్నిచ్చింది. సినిమాల్లో సాధారణంగా కనిపించే హింస, అశ్లీలత మొదలైనవి శేఖర్ సినిమాల్లో తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉంటాయి. చిత్రాలు 1. డాలర్ డ్రీమ్స్ (2000) 2. ఆనంద్ (2004) 3. గోదావరి (2006) 4. హ్యాపీ డేస్ (2007) 5. లీడర్ (2009)

వై.వి.రావు

యెర్రగుడిపాటి వరదరావు (వై.వి.రావు) (జ: మే 30, 1903 - మ: ఫిబ్రవరి 14, 1973) తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు. వై.వి.రావు 1903 మే 30న నెల్లూరులో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయములో వైద్యవిద్యను వదిలి సినిమాలలో నటించాలనే కోరికతో బొంబాయి వెళ్లాడు. బొంబాయిలో మణీలాల్ జోషీని కలిసి, మెప్పించి మూకీ చిత్రాలలో నటించే అవకాశము పొందాడు. ఈయన కొన్ని రోజులు అర్దేషిర్ ఇరానీ యొక్క రాయల్ ఆర్ట్ స్టూడియోలో కూడా పనిచేశాడు. ఆ తరువాత మద్రాసులోని జనరల్ పిక్చర్స్ లో కళాదర్శకునిగా, నటునిగా చేరాడు. ఈయన ఆర్.ఎస్.ప్రకాష్ యొక్క కొన్ని మూకీ చిత్రాలలో కూడా నటించాడు. వై.వి.రావు 1939 లో తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన చింతామణి పిక్చర్స్ ను స్థాపించాడు. 1950లో శ్రీవరుణ ఫిలంస్ అనే సంస్థను కూడా ప్రారంభించాడు. అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని (ఏడు) భాషల చిత్రాలలో పనిచేసిన ఘనత ఈయనకే దక్కినది. వై.వి.రావు పశ్చిమ మరియు దక్షిణ భారత దేశములలోని ప్రముఖ చిత్రనిర్మాణ కేంద్రాలైన బొంబాయి, కొల్హాపూర్, మద్రాసు మరియు మైసూరులలో పనిచేశాడు. తొలి కన్నడ టాకీ చలనచిత్రము, ఎం.వి.సుబ్బయ్య నాయుడు మరియు ఆర్.నాగేంద్రరావు నటించిన సతీ సులోచన ఈయనే నిర్మించాడు. 1946లో వై.వి.రావు, నర్తకి నుంగంబాక్కం జానకి కుమార్తె మరియు తమిళ సినిమా నటీమణి అయిన కుమారి రుక్మిణిని వివాహమాడినాడు. తెలుగు సినీనటి లక్ష్మి (జీన్స్ చిత్రములో బామ్మ) ఈయన కూతురే. * Hennina Balu Kanneru (1963) * Nagarjuna (1961/I) * శ్రీకృష్ణ గారడి (1958/I and II) * మంజరి (1953) * మానవతి (1952) * లవంగి (1946) (1950) * Ramadas (1948) * తాసీల్దార్ (1944) (నటుడు, కథా రచయిత, నిర్మాత మరియు దర్శకుడు) * సత్యభామ (1942) (నటుడు, నిర్మాత మరియు దర్శకుడు) * సావిత్రి (1941) * విశ్వమోహిని (1940) (నటుడు, కథా రచయిత మరియు దర్శకుడు) * మళ్ళీ పెళ్ళి (1939) (నటుడు, కథా రచయిత మరియు దర్శకుడు) * భక్త మీరా (1938) * స్వర్ణలత (1938) * Naganand (1935/I and II) * సతీ సులోచన (1934/II) (నటుడు మరియు దర్శకుడు) * Hari Maya (1932) * Pandava Agyathavas (1930) * సారంగధర (1930) * Shri Subramanyam (1930)

వేదాంతం రాఘవయ్య

వేదాంతం రాఘవయ్య (Vedantam Raghavaiah) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా. [మార్చు] తొలి జీవితం వేదాంతం రాఘవయ్య కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో 1919 సంవత్సరంలో జన్మించారు. రాఘవగా పిలవబడే రాఘవయ్య వేదాంతం రత్తయ్య శర్మ మరియు రాజ్యలక్ష్మి గార్ల ప్రథమ సంతానం. వీరి తాతగారు వేదాంతం రామయ్య గారు ప్రఖ్యాత కూచిపూడి యక్ష గాన ప్రయోక్తలు. వీరికి తమ ఇంటివిద్యపై మక్కువ వలన చిన్నతనంలోనే తన తండ్రిగారి వద్ద ఈ నాట్యవిద్యకు శ్రీకారం చుట్టారు. తరువాత పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారివద్ద తన విద్యకు మెరుగులు దిద్దుకున్నారు. పాఠశాల విద్యానంతరము ఉన్నత విద్యలకై హైదరాబాదు వెళ్లి అక్కడ మేనమామగారైన నాట్యకళాధర పసుమర్తి రామలింగశాస్త్రి గారివద్ద ఉంటూ ఈ నాట్యకళల మెళకువలను, తాళప్రకరణము , నట్టువాంగమును అభ్యసించడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కూచిపూడి నాట్యంలో బి.ఎ. మరియు ఎం.ఎ. డిగ్రీలను పొందారు. [మార్చు] పని చేసిన సినిమాలు దర్శకత్వం వహించినవి * శాంతి (1952) * అన్నదాత (1952) * దేవదాసు (1953) * అనార్కలి (1955) * భలే అమ్మాయిలు (1957) * సువర్ణసుందరి (1957) * రహస్యం (1967) నటించినవి * రైతుబిడ్డ (1939) * గరుడ గర్వభంగం (1943) నృత్య దర్శకత్వం చేసినవి * పల్నాటి యుద్ధం (1947) చిత్రానువాదం అందించినవి * అనార్కలి (1955) * సువర్ణసుందరి (1957)
వేదాంతం రాఘవయ్య (Vedantam Raghavaiah) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా. [మార్చు] తొలి జీవితం వేదాంతం రాఘవయ్య కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో 1919 సంవత్సరంలో జన్మించారు. రాఘవగా పిలవబడే రాఘవయ్య వేదాంతం రత్తయ్య శర్మ మరియు రాజ్యలక్ష్మి గార్ల ప్రథమ సంతానం. వీరి తాతగారు వేదాంతం రామయ్య గారు ప్రఖ్యాత కూచిపూడి యక్ష గాన ప్రయోక్తలు. వీరికి తమ ఇంటివిద్యపై మక్కువ వలన చిన్నతనంలోనే తన తండ్రిగారి వద్ద ఈ నాట్యవిద్యకు శ్రీకారం చుట్టారు. తరువాత పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారివద్ద తన విద్యకు మెరుగులు దిద్దుకున్నారు. పాఠశాల విద్యానంతరము ఉన్నత విద్యలకై హైదరాబాదు వెళ్లి అక్కడ మేనమామగారైన నాట్యకళాధర పసుమర్తి రామలింగశాస్త్రి గారివద్ద ఉంటూ ఈ నాట్యకళల మెళకువలను, తాళప్రకరణము , నట్టువాంగమును అభ్యసించడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కూచిపూడి నాట్యంలో బి.ఎ. మరియు ఎం.ఎ. డిగ్రీలను పొందారు. [మార్చు] పని చేసిన సినిమాలు దర్శకత్వం వహించినవి * శాంతి (1952) * అన్నదాత (1952) * దేవదాసు (1953) * అనార్కలి (1955) * భలే అమ్మాయిలు (1957) * సువర్ణసుందరి (1957) * రహస్యం (1967) నటించినవి * రైతుబిడ్డ (1939) * గరుడ గర్వభంగం (1943) నృత్య దర్శకత్వం చేసినవి * పల్నాటి యుద్ధం (1947) చిత్రానువాదం అందించినవి * అనార్కలి (1955) * సువర్ణసుందరి (1957)

వి.మధుసుదనరావు

వి.మధుసుదనరావు లేదా వీరమాచనేని మధుసూదనరావు తెలుగు సినిమా దర్శకులు. ఇతడు కె.ఎస్.ప్రకాశరావు వద్ద చలనచిత్రీకరణ పాఠాలు నేర్చుకొని మొదటిసారిగా సతీ తులసి పౌరాణిక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇతడు రాజధాని నగరంలో ఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నటుల్ని తీర్చిదిద్దారు. సినిమాలు * సతీ తులసి (1959) * వీరాభిమన్యు (1965) * ఆరాధన (1962) * అంతస్థులు (1965) * అదృష్టవంతులు (1968) * పదండి ముందుకు (1962) * రక్తసంబంధం (1962) * భక్త తుకారాం (1973)

విజయనిర్మల

విజయనిర్మల (1946) తెలుగు సినిమా నటి, దర్శకురాలు మరియు ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్య. ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియో కు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి (ఇప్పటి నిర్మలమ్మ) ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము. ఈమె మొదటి పెళ్లి ద్వారా సినీ నటుడు నరేష్ కి తల్లి. మరో ప్రముఖ సినిమా నటి జయసుధకు ఈమె పిన్నమ్మ. 2002 లో ప్రపంచములోనే అతిఎక్కువ సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ ప్రపంచ రికార్డులు[1] లోకెక్కినది. నటి అయిన ఈమె 1971లో దర్శకత్వము వహించడము ప్రారంభించినది. ఈమె నటించిన అధిక చిత్రాలలో కధానాయకుడు కృష్ణ కావటం విశేషం. వీరిద్దరూ జంటగా సుమారు యాభై వరకూ చిత్రాలలో నటించారు. విజయనిర్మల, కృష్ణ జంటగా నటించిన తెలుగు చిత్రాలు * సాక్షి * మంచి కుటుంబం * సర్కార్ ఎక్స్ ప్రెస్ * అత్తగారు కొత్తకోడలు * లవ్ ఇన్ ఆంధ్రా * టక్కరి దొంగ చక్కని చుక్క * విచిత్ర కుటుంబం * బందిపోటు భీమన్న * అక్కా చెల్లెలు * మా నాన్న నిర్దోషి * మళ్లీపెళ్లి * విధివిలాసం * అమ్మకోసం * తాళిబొట్టు * పెళ్లి సంబంధం * పెళ్లికూతురు * పగ సాధిస్తా * అగ్నిపరీక్ష * రెండు కుటుంబాల కధ * అల్లుడే మేనల్లుడు * మాస్టర్ కిలాడి * అనురాధ * మోసగాళ్లకు మోసగాడు * భలే మోసగాడు * పండంటి కాపురం * ప్రజా నాయకుడు * మంచివాళ్లకు మంచివాడు * దేవుడు చేసిన మనుషులు * మీనా * గాలిపటాలు * అల్లూరి సీతారామరాజు * ధనవంతుడు గుణవంతుడు * దేవదాసు * సంతానం-సౌభాగ్యం * పాడిపంటలు * రామరాజ్యంలో రక్త పాతం * దేవుడే గెలిచాడు * పంచాయితీ * పట్నవాసం * మూడు పువ్వులు ఆరు కాయలు * హేమాహేమీలు * అంతం కాదిది ఆరంభం * రక్తసంబంధం * సాహసమే నా ఊపిరి * ప్రజల మనిషి * బొబ్బిలి దొర * శ్రావణమాసం

వంశీ

వంశీ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. అసలు పేరు జె.వి.కె నారయణ రాజు ఈయన సినిమాలకధలు సహజంగా ఉంటూ పల్లెఅందాలను ఆవిష్కరిస్తుంటాయి. బాల్యం వంశీ తూర్పు గోదావరి జిల్లా, అనపర్తికి దగ్గరలో ఉన్న పసలపూడి అనే గ్రామంలో పుట్టి పెరిగాడు. కెరీర్ తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యమైన శంకరాభరణం సినిమాకు వంశీ సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు. దర్శకుడిగా ఆయన మొదటి సినిమా 1982 లో చిరంజీవి, సుహాసిని,రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా నటించిన మంచు పల్లకి అనే సినిమా. ఈ సినిమాకు యండమూరి వీరేంద్రనాథ్ రచయిత. యండమూరి, చిరంజీవి కలయికలో వచ్చిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. 1984 లో ఆయన రూపొందించిన సితార సినిమా విమర్శకుల మన్ననలనందుకుంది. ఇదే సినిమాతో భానుప్రియ తెలుగు సినిమాకు కథానాయిక గా పరిచయమైంది. ఆయన రూపొందించిన చాలా వరకు సినిమాలకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. వంశీ దర్శకత్వం వహించిన అనేక తెలుగు సినిమాలలో ప్రస్పుటంగా కనిపించే అంశములు కామెడీ మరియు తెలుగువారి వ్యావహారిక పద్దతులు. గోదావరి పట్ల వంశికి వున్నప్రేమ అంత ఇంతా కానిది. ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్ర శ్రుష్టించి అది గోదావరి జిల్లాలో పరిబ్రమించెలాగా చెయ్యటం వంశికి వెన్న తో పెట్టిన విద్య. ] అవార్డుల సినిమాలు * సితార * మంచుపల్లకి వంశీ సినిమాల జాబితా 1. మంచు పల్లకి 2. ఆలాపన 3. అన్వేషణ 4. సితార 5. లాయర్ భారతి 6. చెట్టు క్రింద ప్లీడర్ 7. స్వర కల్పన 8. లేడీస్ టైలర్ 9. లింగబాబు లవ్ స్ఝ్తోరి 10. జోకర్ 11. ప్రేమ ‍‍& కో 12. డిటెక్టివ్ నారద 13. ఏప్రిల్ 1 విడుదల 14. దొంగ రాముడు అండ్ పార్టి 15. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు 16. కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను 17. అనుమానాస్పదం 18. గోపి గోపిక గోదావరి 19. [[ఫ్యాషన్ డిసైనర్ S/O లేడీస్ టైలర్(నిర్మాణంలో ఉంది?)

రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ (జ. ఏప్రిల్ 7, 1962) ఒక ప్రముఖ తెలుగు, భారతీయ సినిమా దర్శకుడు మరియు నిర్మాత. అతను సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియా మరియు హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్దహస్తుడు. చలనచిత్ర ప్రవేశం తెలుగులో జరిగినా తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డాడు. అతనికి పేరు తెచ్చిన చిత్రాలలో ముఖ్యమైనవి శివ (తెలుగు), క్షణ క్షణం (తెలుగు), రంగీలా (హిందీ), సత్య (హిందీ), కంపెనీ (హిందీ) మరియు భూత్ (హిందీ). ఫాక్టరీగా సుపరిచితం అయిన అతని నిర్మాణ సంస్థ "వర్మ కార్పొరేషన్" పలు చిత్రాలు నిర్మించింది. విషయ సూచిక రామ్ గోపాల్ వర్మ 1962లో విజయవాడ నగరంలో కృష్ణంరాజు మరియు సూర్యమ్మ దంపతులకు జన్మించాడు. నగరంలోని సిధ్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించాడు. అయితే అతనికి చదువుకన్నా చిత్రరంగం మీదే ఎక్కువ శ్రద్ధ ఉండేది. విద్యార్థిగా ఉన్నప్పుడు విడుదలైన ప్రతి చిత్రము, ఏ భాషలోనైనా, వదలకుండా చూసేవాడినని ఆయన చెబుతూ ఉంటారు. తన స్నేహితులతో ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ, అందులోని తప్పొప్పుల గురించి వాదనలు జరిపేవాడు. ఇంజినీరింగ్ పట్టా పొందిన తర్వాత చిత్ర పరిశ్రమలో అవకాశం కోసం ఎదురుచూస్తూ బ్రతుకుతెరువు కోసం కొంతకాలం ఒక వీడియో దుకాణం నడిపాడు. తరువాత రావుగారి ఇల్లు అనే తెలుగు చిత్రానికి సహాయక నిర్దేశకునిగా అవకాశం వచ్చింది. ఆ చిత్రం ద్వారా వర్ధమాన తెలుగు నటుడు అక్కినేని నాగార్జునను కలిసే అవకాశం వచ్చింది. ఆయనకి, ఆయన మేనమామకి సినిమాలు అంటే తగని మక్కువ. క్లాసులను ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసి వాళ్ళ అమ్మతో దెబ్బలు తినేవారట. సినిమా పేర్లలో దర్శకుడి పేరు,"ఫిల్మ్ బై" అని వేసే పేర్లను చూసి చాలా ఉత్తేజం చెందేవాడట. షోలే సినిమాలో "ఫిల్మ్ బై రమేష్ సిప్పీ" పేరు చూసి ఉత్తేజం చెందిన ఆయన, తన పేరుని కూడా అలా సినిమా టైటిల్స్ లో మొదటిసారి ఉదయం సినిమాలో చూసుకుని మురిసిపోయారట. ఆయనకు తన కుటుంబం నుండి ఎలాంటి సహకారం లేదు. తన మేనమామ కూడా పిచ్చితనం అనే అనుకునేవాడు. దక్షిణ భారతంలో చెన్నై లాంటి నగరాల్లో నిర్మించే చిత్రాల్లోకంటే ముంబైలో నిర్మితమయ్యే చిత్రాల్లో ప్రతిభ కొరవడింది అని ఆయన భావించేవాడు. ఆయన తనకి ఎటువంటి దురలవాట్లు లేవు అని చెప్తాడు. మద్యం సేవించడం ఒక వ్యసనంగా ఆయన ఒప్పుకోడు. వర్మకి నచ్చిన దర్శకులు స్టీవెన్ స్పీల్‌బర్గ్, శేఖర్ కపూర్, గోవింద్ నిహ్‌లానీ మొదలగు వారు. కానీ ఆయన పైన ఎవరి ప్రభావం లేదు. ఆయనది సొంత శైలి. సినీ విశ్లేషణల గురించి ఆయన పెద్దగా పట్టించుకోరు. ఎవరో అపరిచితులు నా సినిమా గురించి రాసే విశ్లేషణల గురించి నేనెందుకు బాధపడాలి? ఎవరికో నచ్చకపోతే నేనేం చేయగలను? అని ప్రశ్నిస్తారు. వృత్తి రామ్ గోపాల్ వర్మ తన సినీ జీవితాన్ని ఎస్.ఎస్. క్రియేషన్స్ నిర్మించిన రావుగారిల్లు, కలెక్టర్ గారి అబ్బాయి చిత్రాలకి సహాయ నిర్దేశకునిగా మొదలు పెట్టారు. తెలుగు మరియు భారతీయ సినీ ప్రపంచంలో శివ సినిమా ద్వారా తన ఉనికిని ప్రపంచానికి చాటారు. ఈ చిత్రం కాలేజీ నేపథ్యంలో హింసాత్మక కథను చొప్పించి నిర్మించారు. ఎటువంటి ఆధారం, శిక్షణ, సహాయ సహకారాలు లేకుండా, 28 ఏళ్ల వయసులో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడైన అక్కినేని నాగార్జునను చిత్ర నిర్మాణానికి ఒప్పించగలిగారు. ఆయన కథ చెప్పిన విధానం నచ్చి నాగార్జున స్వయంగా చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు. శివ చిత్రం తెలుగు చిత్ర ప్రపంచంలో ఒక చెరగని ముద్రని వేసుకుంది. హిందీ భాషలో కూడా ఈ చిత్రాన్ని అదే పేరుతో పునర్నిర్మించారు కానీ తెలుగులో సాధించినంత విజయాన్ని హిందీలో సాధించలేదు. తను దర్శకత్వం వహించిన తరువాతి సినిమాలు క్షణక్షణం (వెంకటేష్, శ్రీదేవి నాయికానాయికలు) హాలీవుడ్ లో నిర్మించిన ఆధారము మరియు ఇది తన కాలేజి మనసు దోచిన సత్య(తరువాత రోజులలో ఇదే పేరుతో ఒక సినిమా కూడా నిర్మించాడు) తో సంబంధానికి ఒక జ్ఞాపకం, రాత్రి(రేవతి ప్రధాన పాత్రధారిగా నిర్మించిన ద్విభాషా హారర్ చిత్రం), అంతం(నాగార్జున, ఊర్మిలా మటోండ్కర్ నాయికానాయికలుగా అపరాధి - పోలీస్ కథతో నిర్మించిన మరో ద్విభాషాచిత్రం) కానీ ఇది వాణిజ్యపరంగా శివలా విజయం సాధించలేదు. తరువాత గోవిందా గోవిందా (నాగార్జున,శ్రీదేవి నాయికానాయికలు) దీనిలో విలన్లు వేంకటేశ్వరస్వామి వజ్రపు కిరీటాన్ని దొంగిలించటానికి స్వామి అరచేతులమీద కాళ్ళు పెట్టటంతో వివాదాస్పదం అయ్యింది. భారతీయ సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఈ దృశ్యాన్ని తొలగించాలని కోరారు. అనవసరమైన ప్రచారం కలిగినా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ కలిగించింది. తను దర్శకత్వం వహించిన తరువాతి సినిమా జగపతిబాబు, ఊర్మిలా మటోండ్కర్ నాయికానాయికలుగా నిర్మించిన గాయం కూడా నేరప్రపంచపు చీకటిసామ్రాజ్యం నేపథ్యంలో వచ్చిన మరొక హింసాత్మక కథ. దీనికి తమిళ సినిమా దర్శకుడు 'మణి రత్నం' స్క్రీన్ ప్లే అందించాడు. ఇది నగరాలలో బాగానే ఆడింది. తరచుగా తన సినిమాలలో ఊర్మిలా మటోండ్కర్ నే హీరోయిన్ గా తీసుకోవడం వారిద్దరి మధ్య ఉన్న సంబంధంపై వచ్చిన పుకార్లకు ఆజ్యం పోసింది. వర్మ తన సొంత సినిమా నిర్మాణసంస్థ వర్మ కార్పోరేషన్ లిమిటెడ్ని స్థాపించి మనీ, మనీ మనీ, గులాబి, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, అనగనగా ఒక రోజు, దెయ్యం(చివరి రెండు సినిమాలకు తనే దర్శకత్వం వహించాడు) అనే తెలుగు సినిమాలను నిర్మించాడు. వర్మ దగ్గర సహాయ దర్శకులుగా పనిచేసిన కృష్ణ్ఝ వంశీ, శివనాగేశ్వరరావు మరియు సినిమాటోగ్రాఫర్గా పని చేసిన తేజ తరువాత టాలీవుడ్ లో మంచి దర్శకులుగా పేరు సంపాదించారు. హిందీ సినిమా పరిశ్రమను ప్రేమకథా చిత్రాలు మరియు యాక్షన్ చిత్రాలు రాజ్యమేలుతున్న రోజుల్లో వర్మ సినిమాలు నిజ జీవితానికి దగ్గరగా ఉండేవి మరియు విషయాన్ని లోతుగా అన్వేషించేవి. భారతీయ సినిమా ఇలాంటి నిజానికి దగ్గరగా ఉండే సినిమాలు తీసినప్పటికీ, వర్మ తనదైన శైలిలో ముందుకు సాగి పోయాడు. వర్మ హిందీ సినిమాల దండయాత్ర (బాలీవుడ్ లో సాధారణంగా అనుకొనే మాట) రంగీలా చిత్ర ఘనవిజయంతో ఆరంభమైంది. ఈ సినిమాతో ఊర్మిళ మాటోండ్కర్ మంచి పేరు సంపాదించుకుంది. ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఈ సినిమాతోనే బాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేశాడు. రంగీలా తర్వాత వచ్చిన సినిమా "దౌడ్". సత్యా సినిమా వర్మకు ఒక ప్రతిష్ఠాత్మక చిత్రం. అతి తక్కువ బడ్జెటుతో తారలెవరూ లేకుండా తీసిన ఈ సినిమా అనేకమంది నటులు, సాంకేతికులకు ప్రాణం పోసింది. అందులో ముఖ్యమైన వారు మనోజ్ బాజ్‌పాయి, చక్రవర్తి, మకరంద్ దేశ్‌పాండే, అనురాగ్ కశ్యప్ (చిత్రానికి కథ, సంభాషణలు సమకూర్చాడు) మరియు సందీప్ చౌతా (నేపథ్య సంగీతం సమకూర్చాడు). విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఆ తరువాత బాలీవుడ్లో అనేక అనుకరణలకు మాతృక అయ్యింది. కొందరు విమర్శకులు ఈ హింసాత్మక చిత్రంలో వర్మ మాఫియాను glorify చేశాడని విమర్శించారు. కౌన్, భూత్ మరియు కంపెనీ వంటి చిత్రాలలో కథాగమనానికి అడ్డుతగలకుండా ఉండేందుకు భారతీయ చిత్రాలలో సర్వసాధారణమైన పాటలను కత్తరించివేశాడు. నేపథ్య సంగీత విషయములో వర్మ చాలా శ్రద్ధ చూపుతాడు. చాలాకాలం తన సినిమాలలో సంగీత దర్శకుడు సందీప్ చౌతాతో కలిసి పనిచేశాడు. రామ్ గోపాల్ వర్మ తన అన్ని సినిమాలలోనూ ప్రధాన స్రవంతిలోని బాలీవుడ్ చిత్రాలను నిర్మించే వ్యక్తులను వారి శైలిని తన వ్యంగ్య చతురతతో విమర్శిస్తూనే ఉన్నాడు. ఈయన సినిమాలు దాదాపు అన్నీ సమకాలీన సమాజానికి అద్దంపడతాయి . నేపథ్యం సాధారణంగా ఎపుడూ ముంబాయి నగరములోనే ప్రారంభమౌతుంది కానీ కథానుసారముగా విస్తరణకు అవకాశముంటుంది. విమర్శకులు, వర్మ సినిమాలు కేవలం స్థూలదృష్టికోణాన్ని చిత్రీకరించకుండా, కథానాయికనాయకుల అంతరంగములోకి లోతుగా చొచ్చుకుపోయి వాళ్ళ ప్రేరేపణలను వెలికితీసే ప్రయత్నం చేస్తాయి అని అంటారు. ఇటీవల విడుదలైన వర్మ చిత్రం నాఛ్ ఇప్పటివరకు తన అత్యుత్తమ సినిమా అని చాటుకున్నాడు (తన అన్ని సినిమాల నిర్మాణం తర్వాత ఈయన ఇలానే చాటుకొంటూ ఉంటాడు). నాఛ్ సినిమా ప్రపంచముపై తనదైన ముద్ర వేయాలనుకునే ఒక నృత్యదర్శకురాలికి, సినిమాలలో గొప్పస్థాయికి ఎదగాలగుకుంటున్న ఒక వర్ధమాన నటునికి మధ్య సంబంధాన్ని చిత్రీకరిస్తుంది. నాఛ్ వ్యాపారపరంగా అంత విజయవంతము కాలేదు. ఇటీవల ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ "నేను నాఛ్ లో మున్సిపల్ స్కూలుకు ఐన్ రాండ్ ఇవ్వటానికి చాలా శ్రమపడ్డాను." అని ప్రేక్షకుల అవగాహానా స్థాయికి అందని సినిమా తీసానని చెప్పుకున్నాడు. వర్మ తరువాతి సినిమా సర్కార్ జూన్,2005లో విడుదలయింది. నిజ జీవితంలో తండ్రి-కొడుకులయిన అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ సినిమాలో కూడా తండ్రి-కొడుకుల పాత్రలు పోషించారు. ఇది ద గాడ్ ఫాదర్ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా నిర్మించింది అని చెప్పాడు. ఈ సినిమా మౌళికంగా పితృస్వామ్యము మరియు స్వాభిమానము గురించి అని వర్మ అభిప్రాయం. భారతీయ రాజకీయాల నేపథ్యములో తీసిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తనదే ధర్మం అనుకునే రాజకీయనాయకుడు సర్కార్ పాత్రను పోషించాడు. ఈ చిత్రం భారీ విజయం సాధించింది. వర్మ భారతీయ చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ లేనంతగా చాలా వేగంగా సినిమాలను నిర్మిస్తున్నారు. తన ఆఫీస్ పేరు The Factory(ద ఫ్యాక్టరీ). తను ఎంపిక చేసిన దర్శకులతో తన నిర్మాణ సంస్థ ద్వారా చాలా సినిమాలను నిర్మిస్తున్నారు. తన సినిమాలకు ప్రతిభ వున్న క్రొత్త వారిని ఎంపిక చేయటం వర్మ అలవాటు. తను పరిచయం చేసిన వారందరి కెరీర్ బాగా వుండటంతో కావలసిన వాళ్ళు కింగ్ మేకర్ అని అంటారు. మనోజ్ బాజ్ పాయ్, ఆఫ్తాబ్ శివదాసాని, వివేక్ ఒబెరాయ్, రాజ్ పాల్ యాదవ్ వీళ్ళంతా సినిమా తెరకు వర్మ ద్వారా పరిచయం అయిన వాళ్ళే. తను వుదార స్వభావుడు కానని, తన స్వార్థం కోసమే క్రొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నానని వర్మ ఇంటర్వ్యూలలో చెబుతుంటాడు. సినిమా పత్రికలు వారు 'స్పాన్సర్' చేసే అవార్డులంటే వర్మకు ఇష్టముండదు, తను ఎప్పుడూ బహుమతి ప్రధానోత్సవాలకు హాజరు కాలేదు. అవార్డులు మరియు నామినేషన్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ యేటా ఇచ్చే నంది అవార్డు ను రామ్ గోపాల్ వర్మ రెండుసార్లు ఆయన దర్శకత్వం వహించిన శివ మరియు క్షణ క్షణం చిత్రాలకు గెలుచుకున్నారు. సత్య' చిత్రానికి ఫిల్మ్ ఫేర్ వాళ్ళు ఇచ్చే ఉత్తమ దర్శకుడి అవార్డును గెల్చుకున్నారు. వ్యక్తిగత జీవితం వర్మకు తన సినిమాలలో పనిచేసిన అనేక నటీమణులతో ముఖ్యంగా ఊర్మిళ మాటోండ్కర్, అంతర మాలి, సమీరా రెడ్డి, రుఖ్‌సార్, ఇటివల నిషా కొఠారిలతో సంబంధం ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. వర్మ తన సినిమాల్లో పనిచేసిన హీరోయిన్లందరు తనకు చెల్లెళ్ళ వంటివారని ఆ పుకార్లను కొట్టిపారేశాడు. వర్మ ఒక ఇంటర్వూలో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, పిల్లలను పెంచడం, చదివించడం, ఆడించడం అనేవి తన జీవితంలో మచ్చుకైన ఉహించని విషయాలని అన్నారు. [మార్చు] చిత్ర సంకలనము చిత్రము విడుదల తేది, సంవత్సరము భాష బాధ్యతలు మిస్టర్. య మిస్. డిసెంబర్ 2, 2005 హిందీ నిర్మాత జెమ్స్ సెప్టెంబర్ 16, 2005 హిందీ నిర్మాత మై వైఫ్'స్ మర్దర్ ఆగస్ట్ 19, 2005 హిందీ నిర్మాత సర్కార్ జులై 1, 2005 హిందీ దర్శకత్వం & నిర్మాత డి జూన్ 3, 2005 హిందీ నిర్మాత నాచ్ నవంబర్ 12, 2004 హిందీ నిర్మాత వాస్తు శాస్త్ర 2004 హిందీ నిర్మాత మధ్యాహ్నం హత్య 2004 తెలుగు నిర్మాత గాయబ్ జులై 16, 2004 హిందీ నిర్మాత అబ్ తక్ చప్పన్ ఫిబ్రవరి 27, 2004 హిందీ నిర్మాత ఏక్ హసీనా థి జనవరి 16, 2004 హిందీ నిర్మాత మై మాధురి ధిక్షిత్ బననా చహ తా హు అక్టోబర్ 10, 2003 హిందీ నిర్మాత డర్న మనా హై జులై 25, 2003 హిందీ నిర్మాత భూత్ మే 30, 2003 హిందీ దర్శకత్వం & నిర్మాత రోడ్ సెప్టెంబర్ 27, 2002 హిందీ నిర్మాత కంపెనీ ఏప్రిల్ 12, 2002 హిందీ దర్శకత్వం & నిర్మాత లవ్ కెలియె కుచ్ భి కరేగ జూన్ 29, 2001 హిందీ నిర్మాత ప్యార్ తూనె క్యా కియ ఏప్రిల్ 27, 2001 హిందీ నిర్మాత జంగిల్ జులై14, 2000 హిందీ దర్శకత్వం & నిర్మాత మస్త్ అక్టోబర్ 15, 1999 హిందీ దర్శకత్వం & నిర్మాత శూల్ 1999 హిందీ కధ,నిర్మాత ప్రేమ కథ 1999 తెలుగు దర్శకత్వం కౌన్ February 26, 1999 హిందీ దర్శకత్వం & నిర్మాత దిల్ సె 1998 హిందీ నిర్మాత సత్య జులై 3, 1998 హిందీ దర్శకత్వం & నిర్మాత దౌడ్ జులై 13, 1997 హిందీ కధ, స్క్రీన్ ప్లే,కూర్పు, దర్శకత్వం & నిర్మాత W/O వర ప్రసాద్ 1997 తెలుగు నిర్మాత దెయ్యం 1996 తెలుగు దర్శకత్వం & నిర్మాత గులాబి 1996 తెలుగు నిర్మాత అనగనగా ఒక రోజు 1995 తెలుగు దర్శకత్వం & నిర్మాత రంగీలా సెప్టెంబర్ 8, 1995 హిందీ కధ, దర్శకత్వం & నిర్మాత మని మనీ 1994 తెలుగు నిర్మాత మని 1993 తెలుగు నిర్మాత తిరుడ తిరుడ 1994 తమిళం స్క్రీన్ ప్లే గాయం , దేశం 1993 తెలుగు, తమిళం దర్శకత్వం గోవిందా గోవిందా 1993 తెలుగు దర్శకత్వం అంతం, ద్రోహి అక్టోబర్ 25, 1992 తెలుగు,హిందీ దర్శకత్వం క్షణ క్షణం 1991 తెలుగు దర్శకత్వం రాత్రి, రాత్ 1991 తెలుగు, హిందీ దర్శకత్వం శివ, ఉదయం,షివ డిసెంబర్ 7, 1990 తెలుగు, తమిళం, హిందీ కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం

ఎస్. ఎస్. రాజమౌళి

ఎస్. ఎస్. రాజమౌళి తెలుగు చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ కధారచయిత విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ సీరియళ్ళకు పనిచేసాడు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ యువ దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత. ఎన్.టి.ఆర్ (జూనియర్) తో ఇతను తీసిన మూడు చిత్రాలూ అఖండ విజయాన్ని సాధించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇతనికి బాబాయి. రాజమౌళి చిత్రాలు * మగధీర (2009) * యమదొంగ (2007) * విక్రమార్కుడు (2006) * ఛత్రపతి (2005) * సై (2004) * సింహాద్రి (2003) * స్టూడెంట్ నెం.1 (2001)

మణిరత్నం

మణిరత్నం ప్రముఖ తమిళ చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితం అయిన ప్రముఖ కధానాయక సుహాసిని మణిరత్నం భార్య. తెలుగులో ఈయన దర్శకత్వం వహించిన ఒకే ఒక సినిమా గీతాంజలి. కానీ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అన్ని తమిళ చిత్రాలూ తెలుగులోకి అనువదించబడ్డాయి. నాయకుడు, రోజా, బొంబాయి, గీతాంజలి మొదలయినవి మణిరత్నం ఆణిముత్యాల్లో కొన్ని మాత్రమే.

బి.విఠల ఆచార్య

బి.విఠల ఆచార్య లేదా బి.విఠలాచార్య 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు మరియు నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ బాషలలో 70 చిత్రాలను రూపొందించిన ఈయన 1920 జనవరి 28న కర్ణాటకలో ఉడిపిలో జన్మించారు. కొంతకాలం సర్కస్ కంపెనీలో జంతువుల ఆలనా పాలనా చూశారు. ఆయన ఎన్నో జానపద చిత్రాలకు అద్భుతమైన దర్శకత్వం వహించారు. అప్పటి పరిమితమైన సాంకేతిక పరిజ్ఙానముతో ఆయన చూపించిన ప్రతిభ అసామాన్యమైనది. చాలా కొద్ది ఖర్చుతో ఆయన కనులకింపైన జానపద కళా ఖండాలను రూపొందించారు. 1942 లో చిత్రరంగ ప్రవేశము చేసిన ఈయన నిర్మాతగా డి.శంకర్ సింగ్ తో కలిసి దాదాపు 18 చిత్రాలను తమ మహాత్మా పిక్చర్స్ పతాకముపై నిర్మించారు. వీటిలో సాంఘీక చిత్రాలే అధికము. ఆ తరువాత తొలిసారిగా తెలుగులో 1953లో షావుకారు జానకి ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికి దర్శకత్వము వహించాడు. క్రమంగా తెలుగులో నిర్మాతగా, దర్శకునిగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలను తీశాడు. ఈయన దర్శకత్వము వహించిన చిత్రాలలో 15 చిత్రాలు నందమూరి తారక రామారావు నటించినవే అందులో 5 చిత్రాలను విఠలాచార్యే స్వయంగా నిర్మించాడు. జానపదబ్రహ్మ 1999 మే 28 న 80 యేళ్ల వయసులో మద్రాసులోని తన స్వగృహములో కన్నుమూశారు. ఈయనకు ఒక భార్య, నలుగురు కుమారులు మరియు నలుగురు కుమార్తెలు కలరు. విషయ సూచిక [ ఆయన దర్శకత్వము వహించిన కొన్ని సినిమాలు * కనకదుర్గ పూజా మహిమ * ఆలీబాబా 40 దొంగలు * నిన్నే పెళ్ళాడుతా * కన్యాదానం * భలే మొనగాడు * అగ్గిబరాటా * లక్ష్మీ కటాక్షం * చిక్కడు దొరకడు * విజయం మనదే * బందిపోటు * జగన్మోహిని * రాజకోట రహస్యం కొన్ని విశేషాలు [1] ఎన్‌.టి.రామారావు, కాంతారావు‌లిద్దరికీ ‘మాస్‌ ఫాలోయింగ్‌’ తెచ్చింది విఠలాచార్య చిత్రాలే. వీటిలో నటీనటులే కాకుండా, పక్షులూ, జంతువులూ కూడా పాత్రధారులు. ‘ట్రిక్‌వర్క్‌’కి ఆయన చిత్రాలు ప్రాధాన్యం కల్పించేవి. ‘లాజిక్‌’ అక్కర్లేదు, ‘అదెందుకు జరిగింది?’ అని అడగడానికి లేదు. ‘ఏమీ అక్కర్లేదు. ప్రేక్షకుల్ని ఆహ్లాదపరచడమే ముఖ్యం. ఇది ‘కమర్షియల్‌ ఆర్ట్‌’ అనబడే సినిమా. మన ప్రేక్షకులు క్లాస్‌ సినిమాలు చూడరు. మాస్‌ చిత్రాలు అనబడేవాడినే ఎక్కువగా చూస్తారు. అందుకే అవే ఎక్కువగా తీశాను. ‘తక్కువ ఖర్చు పెట్టి, ఎక్కువ లాభం పొందాలి’ అన్న సూత్రం కూడా నమ్ముకున్నాను’ అని విఠాలాచార్య చెప్పేవారు. సినిమా నిర్మాణంలో ‘పొదుపు’ ఎలా చెయ్యాలి? అన్న దారి చూపించిన వ్యక్తి కూడా ఆయనే. ఒకే పెద్ద మందిరం సెట్టు వేస్తే, దాన్నే రకరకాల సెట్లుగా మార్చేవారు ఆయన. అంత:పురం రాజుగారి రహస్యమందిరం, విలన్‌ ఇల్లూ, ఇంకొక రాజుగారి ఇల్లూ - అన్నీ ఒకే ఒక సెట్లో ఇమిడిపోయేవి. సామాన్య జనానికీ, సినిమా చూట్టంలో లీనమైపోయే ప్రేక్షకులకీ ఈ తేడాలు అక్కర్లేదని విఠలాచార్య విశ్వసించేవారు. అలాగే కాస్ట్యూమ్స్‌, ఆభరణాలూ, ప్రతి సినిమాకీ మార్చవలసిన అవసరం లేదు ముఖ్యపాత్రకి తప్ప. ‘నటీనటుల కాల్‌ షీట్లు గల్లంతైతే, వాళ్లని చిలకలుగానో, కోతులుగానో మార్చడం ఆయనకే చెల్లింది’ అని ఒక సందర్భంలో కాంతారావు చెప్పారు. విఠలాచార్య ఎంతో దక్షతా, బాధ్యతా గల నిర్మాత. నటీనటులకీ, టెక్లీషియన్లకీ తాను ఇస్తానన్న మొత్తాన్ని విభజించి ప్రతినెలా ఒకటో తేదీకల్లా - చిన్నా, పెద్దా అందరికీ చెక్కులు పంపించేసేవారు. ఏది వచ్చినా రాకపోయినా విఠలాచార్య గారి చెక్కు వచ్చేస్తుందన్న నమ్మకం అందరికీ వుండేది. ఈ విధానం అరుదు! అలాగే నటీనటులకి కాల్‌ షీట్స్‌ అడ్జస్ట్‌ చెయ్యడంలో కూడా ఆయన ‘నంబర్‌వన్‌’ అనిపించుకునేవారు. ముందుగా చెబుతే, ఒప్పుకున్న డేట్స్‌ని అటూ, ఇటూగా మార్చి చిన్న, పెద్ద నటీనులందిరికీ, సహాయపడేవారు. వేషాలకోసం ఆఫీసులకి వెళ్తే సాధారణంగా డైరెక్టర్లు, నిర్మాతలూ వాళ్లని చూసేవారు కాదు. మేనేజర్‌ అడ్రస్‌ తీసుకుని పంపేస్తాడు. విఠలాచార్య అలా కాదు. వచ్చిన ప్రతీవాళ్లనీ తన గదిలోకి పిలిచి, కూచోబెట్టి కాఫీ ఇచ్చి మాట్లాడి పంపించేవారు. ఈ విధానం కూడా అరుదే. స్క్రిప్టు ముందు రాయించుకుని, షెడ్యూల్సు వేసుకుని టైముకి ముందుగానే షూటింగ్‌ పూర్తిచేసి, అనుకున్న తేదీకి సినిమా విడుదల చెయ్యడం ఆయనకే చెల్లింది. సినిమా ఆరంభించకముందే - విడుదల తేదీ ఇవ్వడం ఎంతమందికి సాధ్యం? సినిమా పరిశ్రమలో ఇదికూడా అరుదే! ఇలాంటి అరుదైన వాటిని అమలుపరిచిన విఠలాచార్య జానపద చిత్రాలకి ఆదరణ తగ్గుతోందన్న ఆలోచనలో అక్కినేని నాగేశ్వరరావుతో ‘బీదల పాట్లు’ తీశారు. తన టెక్నీషియన్లందరినీ మార్చి, నటీనటుల్నీ మార్చి మంచి క్వాలిటీతో చిత్రం రావాలని - కృషి చేసి తీశారు. తన విధానానికి భిన్నంగా తీశారు. ‘చిత్రం ఉత్తమంగా వుంది’ అని అందరూ ప్రశంసించారు. కాని డబ్బు రాలేదు. ‘విఠలాచార్య సినిమా ఇలావుందేమిటి?’ అన్నారంతా. ‘నా పేరు కాకుండా ఇంకొకరి పేరు వేసివుంటే బాగా నడిచేదేమో!’ అని వ్యాఖ్యానించారు విఠలాచార్య. ‘ఏది అలవాటు చేస్తే ఆ ధోరణిలో వెళ్లడమేశ్రేయస్కరం’ అన్నది ఆయన చెప్పిన నీతి.

బాలు మహేంద్ర

బాలు మహేంద్ర (Balu Mahendra) (జ: జనవరి 1, 1946) దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు మరియు దర్శకుడు. దర్శకుడిగా * Athu Oru Kanaa Kaalam (2005) * Julie Ganapathy (2003) * Aur Ek Prem Kahani (1996) * సతీ లీలావతి (1995) * Marupadiyam (1993) * చక్రవ్యూహం (1992) * Poonthenaruvi Chuvannu (1991) * Vanna Vanna Pookkal (1991) * సంధ్యారాగం (1989) * Veedu (1988) * Irattaival Kuruvi (1987) * Rendu Thokala Titta (1987) * Yaathra (1985) * Unn Kannil Neer Vazhindal (1985) * Neengal Kettavai (1984) * Oomai Kuyil (1983) * Sadma (1983) * Moondram Pirai (1982) * నిరీక్షణ (1982) * Olangal (1982) * Manju Moodal Manju (1980) * Moodupani (1980) * Azhiyatha Kolangal (1979) * కోకిల (1977) * Motor Sundaram Pillai (1966) ఛాయాగ్రహకుడిగా * Yaathra (1985) * Pallavi Anu Pallavi (1983) * Sadma (1983) * Moondram Pirai (1982) * Olangal (1982) * సీతాకోకచిలుక (1981) * Moodupani (1980) * శంకరాభరణం (1979) * మనవూరి పాండవులు (1978) * లంబాడోళ్ళ రామదాసు (1978) * సొమ్మొకడిది సోకొకడిది (1978) * Ulkatal (1978) * తరం మారింది (1977) * Nellu (1974)

బాపు

బాపు జన్మ నామం సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ జననం డిసెంబర్ 15,1933 స్వస్థలం నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా,ఆంధ్రప్రదేశ్ నివాసం చెన్నై, తమిళనాడు ఇతర పేర్లు బాపు వృత్తి చిత్రకారుడు, కార్టూనిస్ట్ మరియు సినిమా దర్శకుడు మతం హిందూ భార్య/భర్త భాగ్యవతి తండ్రి వేణు గోపాల రావు తల్లి సూర్యకాంతమ్మ వెబ్‌సైటు http://www.bapubomma.com/ బాపు తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం. 'బాపు బొమ్మ' అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు.బాపు బొమ్మల గురించి ప్రసిద్ది గాంచిన కవి ఆరుద్ర పద్య రూపంలో తన కవితల పుస్తకములో హ్రుద్యంగా వర్ణించిన తీరు చిరస్మరణీయమైనది ఒకటుంది. కొంటెబొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయలలూపు ఓ కూనలమ్మా! ఇలా కూనలమ్మ పదం రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతొ ఏకీబవించని వారు లేరు.బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఈయన చేతిరాతకూడ బాపు ఫాంటుగా అలరిస్తోంది. అందమయిన చేతిరాతకి అందరికి గుర్తొచ్చే ఫాంటు ఇదే అవటం అతిశయోక్తి కాదు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు,హిందీ సినిమాలు అవార్డులు, రివార్డులు పొందటముతొ పాటు అచ్చ తెలుగు సినిమాకి ఉదాహరణలుగా చరిత్రలొ నిలిచిపొయాయనటం పొగడ్త కాదు. క్లుప్తంగా ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపొయిన,తీసిన సినిమాలొ దర్శకుడిగా ఈయన పేరు చూడక పొయినా చప్పున ఎవరయినా ఇది గీసింది,తీసింది బాపూ అని గుర్తించగలిగేటంత విలక్షణమయిన శైలి ఈ ప్రతిభావంతుడి సొత్తు. విషయ సూచిక * 1 జీవితం * 2 చిత్రకళ * 3 బాపు చిత్రమాలిక * 4 చలన చిత్రకళ o 4.1 బాపు దర్శకత్వం వహించిన సినిమాలు * 5 ప్రదర్శనలు * 6 ప్రముఖుల అభిప్రాయాలు * 7 పురస్కారాలు * 8 మూలాలు * 9 బయటి లింకులు జీవితం బాపు తల్లి తండ్రులు బాల్యంలో బాపు బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబర్ 15, 1933 వ సంవత్సరం లో పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం లో వేణు గోపాల రావు,సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు.[1] 1955 వ సంవత్సరం లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి లాయర్ పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్ర పత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు. చిత్రకళ బాపుబొమ్మ బాపు స్వీయ రేఖాచిత్రం బాపు చిత్రకళ ఒక విషయానికి పరమితంకాలేదు. 1945 నుండీ బాపు చిత్రాలనూ, వ్యంగ్యచిత్రాలనూ, పుస్తకాల ముఖచిత్రాలనూ, పత్రికల ముఖచిత్రాలనూ, కధలకు బొమ్మలనూ, విషయానుగుణ చిత్రాలనూ పుంఖాను పుంఖాలుగా సృష్టిస్తున్నారు. కొత్త రచయితలూ, ప్రసిద్ధ రచయితలూ, పురాణాలూ, జీవితమూ, సంస్కృతీ, రాజకీయాలూ, భక్తీ, సినిమాలూ - అన్ని రంగాలలో ఆయన గీతలు వాసికెక్కాయి. ఆయన చిత్రాలతో ఉన్న శుభాకాంక్ష పత్రికలు (గ్రీటింగ్ కార్డులు), పెళ్ళి శుభలేఖలూ కళాప్రియులు కోరి ఏరుకుంటారు. బాపు రాత కూడా అంతే. ఇంతవరకూ తెలుగునాట ఎవరి చేతి వ్రాతకూ ఆ ప్రాముఖ్యత అందలేదు. తెలుగులో బాపు అక్షరమాల (ఫాంట్) ఎన్నో డి.టి.పి సంస్థలూ, ప్రచురణా సంస్థలూ వాడుతుంటాయి. నవరసాలు, అష్టవిధనాయికలు, జనార్దనాష్టకము, అన్నమయ్య పాటలు, రామాయణము, భారతీయ నృత్యాలు, తిరుప్పావై - ఇలా ఎన్నో విషయాలపై బాపు ప్రత్యేక చిత్రావళిని అందించారు. ఆయన చిత్రాలలో కొన్ని ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. * పొదుపుగా గీతలు వాడటం. * ప్రవహించినట్లుండే ఒరవడి * సందర్భానికి తగిన భావము * తెలుగుదనము బుడుగు బాపు కొతకాలం జె.వాల్టర్ థామ్సన్ సంస్థలోనూ, ఎఫిషియెంట్ పబ్లికేషన్స్ లోనూ, ఎఫ్.డి.స్టీవార్ట్స్ సంస్థలోనూ పని చేశారు. బాపు కృషిలో సహచరుడైన ముళ్ళపూడి వెంకటరమణ తో కలిసి రూపొందించిన బుడుగు పుస్తకం తెలుగు సాహిత్యంలో ఒక క్లాసిక్. ఇందులో బుడుగు తో పాటు సిగానపెసూనంబ తెలుగువారి హృదయంలో చిరకాలస్థానం సంపాదించుకొన్నారు. ఆయన చిత్రాలు దేశదేశాలలో ఎన్నో ప్రదర్శనలలో కళాభిమానుల మన్నలందుకొన్నాయి. బాపు చిత్రమాలిక అసంఖ్యాకంగ ఈయన గీసిన అందమయిన, అద్భుతమయిన చిత్రాలలొనుండి మచ్చుకు కొన్ని... బాల కృష్ణుడు గంగావతారం సీతారాముల పట్టాభిషేకం సరస్వతీదేవి రామాయణం క్లుప్తంగా దారి విడుము కృష్ణా... కూచిపూడి... నమస్కారం చలన చిత్రకళ 1967లో సాక్షి (సినిమా) చిత్రదర్శకునిగా సినిమారంగంలో అడుగుపెట్టిన బాపు మొదటి చిత్రంతోనే ప్రసంసలు అందుకొన్నారు. అయన మొత్తం 41 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1976లొ వెలువడిన 'సీతాకల్యాణం' సినిమా చూసెవారికి కన్నుల పండుగ. ముఖ్యంగా అందులో గంగావతరణం సన్నివేశం మరువరానిది. బాపు తను తీయబోయే చలన చిత్రపు సన్నివేశాలని సచిత్రంగా ( స్టోరీబోర్డు ) తయారు చేసుకుని తెరమీదకి ఎక్కిస్తారు.ఈ విదానం వలన తను మనసులో అనుకున్నది కాగితం మీద ఎంత అందంగా చిత్రీకరించుకుంటారో అంతే అందంగా తెరమీద గందరగోళం లేకుండా చిత్రీకరించగలుగుతారు. ఉదాహరణకి...రాధాగోపాళం తెలుగు సినిమాకి ఈయన గీసుకున్న సన్నివేశపు చిత్రం. రాధాగోళం సినిమాకు స్టోరీబోర్డు చిత్రాలు - ముందుగా గీసిన చిత్రాలతోబాటు సినిమా తీసిన తరువాతి షాట్లను కూడా చూడవచ్చును. బాపు దర్శకత్వం వహించిన సినిమాలు చిత్రం పేరు విడుదల సంవత్సరం బాష తెలుగు సుందరకాండ 2008 తెలుగు రాధా గోపాళం 2005 తెలుగు రాంబంటు 1996 తెలుగు పెళ్ళికొడుకు 1994 తెలుగు పరమాత్మా 1994 హిందీ శ్రీనాథ కవిసార్వభౌమ 1993 తెలుగు మిష్టర్ పెళ్ళాం 1993 తెలుగు పెళ్ళి పుస్తకం 1991 తెలుగు ప్రేమ్ ప్రతిగ్యా 1989 హిందీ దిల్ జలా 1987 హిందీ ప్యార్ కా సిందూర్ 1986 హిందీ కళ్యాణ తాంబూలం 1986 తెలుగు మేరా ధరమ్ 1986 హిందీ ప్యారీ బెహనా 1985 హిందీ బుల్లెట్ 1985 తెలుగు జాకీ 1985 తెలుగు మోహబ్బత్ 1985 హిందీ సీతమ్మ సేత 1984 తెలుగు మంత్రిగారి వియ్యంకుడు 1983 తెలుగు వోహ్ సాత్ దిన్ 1983 హిందీ ఏది ధర్మం ఏది న్యాయం 1982 తెలుగు కృష్ణావతారం 1982 తెలుగు నీతిదేవన్ మయగుగిరన్ 1982 తమిళం పెళ్ళీడు పిల్లలు 1982 తెలుగు బేజుబాన్ 1981 హిందీ రాధా కళ్యాణం 1981 తెలుగు త్యాగయ్య 1981 తెలుగు హమ్ పాంచ్ 1980 హిందీ వంశవృక్షం 1980 తెలుగు కలియుగ రావణాసురుడు 1980 తెలుగు పండంటి జీవితం 1980 తెలుగు రాజాధిరాజు 1980 తెలుగు తూర్పు వెళ్ళే రైలు 1979 తెలుగు మనవూరి పాండవులు 1978 తెలుగు అనోఖా శివభక్త్ 1978 హిందీ గోరంత దీపం 1978 తెలుగు స్నేహం 1977 తెలుగు భక్త కన్నప్ప 1976 తెలుగు సీతాస్వయంవర్ 1976 హిందీ శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీక్లబ్ 1976 తెలుగు సీతాకల్యాణం 1976 తెలుగు ముత్యాల ముగ్గు 1975 తెలుగు శ్రీ రామాంజనేయ యుద్ధం 1974 తెలుగు అందాల రాముడు 1973 తెలుగు సంపూర్ణ రామాయణం 1971 తెలుగు బాలరాజు కధ 1970 తెలుగు ఇంటి గౌరవం 1970 తెలుగు బుద్ధిమంతుడు 1969 తెలుగు బంగారు పిచ్చుక 1968 తెలుగు సాక్షి 1967 తెలుగు ప్రదర్శనలు ] ప్రముఖుల అభిప్రాయాలు * శివలెంక రాధాకృష్ణ-ఆంధ్ర పత్రిక సంపాదకులు-చక్కటి గీత, నొప్పించని హేళన, మొత్తం మీద అందంగా కనిపించే బొమ్మ-తెలుగు కార్టూన్‌లలో ఈ లక్షణాలు ఉన్న సంప్రదాయాన్ని శ్రీ బాపు గారు మొదలు పెట్టారు. పురస్కారాలు ముగ్దమనోహరమయిన ఒక స్రీ హొయలు... బాపు గారికి స్వదేశీ, విదేశీ పురస్కారాలు ఎన్నో లభించాయి. అందులో ముఖ్యమయినవి కొన్ని. * బాపు గారి దర్శకత్వం వహించిన ముత్యాల ముగ్గు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా (1975 వ సంవత్సరం) భారత ప్రభుత్వ పురస్కారం తో పాటు సినిమాటోగ్రాఫర్ ఇషాన్ అర్యాకి చాయగ్రాకుడిగా పురస్కారం. * 1986 వ సంవత్సరంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఎ.పి కళా వేదిక ద్వారా రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారం మదర్ థెరిస్సా బహుకరించగా తన స్నేహితుడు ముళ్ళపూడి వెంకట రమణ తో కలసి స్వీకారం.[2] * చెన్నై(తమిళనాడు)లో స్థాపించిన శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ వారి ప్రతిస్టాత్మకమయిన రాజ్యలక్ష్మి పురస్కారం 1982 వ సంవత్సరంలో ఇవ్వబడింది. * 1991 వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ బహుకరణ. * 1992 వ సంవత్సరంలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) వారిచే శిరోమణి పురస్కారం అమెరికాలో స్వీకరణ. * మిస్టర్ పెళ్ళాం సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ పురస్కారం.(1993 వ సంవత్సరం) * 1995 వ సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా(TANA) వారిచే తెలుగు చిత్ర కళా,సాహిత్య,సాంస్కృతిక,సినిమా రంగాలకి తన ఏభై సంవత్సరాల(గోల్డెన్ జూబ్లీ సెలేబ్రషన్) సేవకి గాను ఘన సన్మానం. * బాపు గారిమీద ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు వంశీ తీసిన డాక్యుమెంటరీ చిత్రానికి 1996 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు.[3] * 9 జూన్,2001 వ సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్టుస్ (IIC) వారిచే జీవిత సాఫల్య పురస్కారం తో సన్మానం. * 2 జూన్,2001 వ సంవత్సరంలో డిసెంబర్ న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారిచే విశిష్ట పురస్కారంతో గౌరవం. * అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్, తిరుపతి వారిచే ప్రెసిడెంట్ అఫ్ ఇండియా అవార్డు భాహుకరణ.[4] * బాలరాజు కథ (1970), అందాల రాముడు (1973), ముత్యాల ముగ్గు (1975),పెళ్లి పుస్తకం (1991), మిస్టర్ పెళ్ళాం (1993) సినిమాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది పురస్కారాలు.

పూరీ జగన్నాద్

పూరీ జగన్నాద్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. బద్రి ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. 2006వ సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన పోకిరి చిత్రం తెలుగు సినీ చరిత్రలో అతి పెద్ద హిట్ గా నిలిచింది.కాని ఆ తరువాత 2009వ సంవత్సరంలో విడుదలైన మగధీర ఆ రికార్డ్ ను అధిగమించింది.2009వ సంవత్సరంలో పూరి జగన్నాద్ కు ఉత్తమ మాటల రచయితగా( నేనింతే) నంది అవార్డ్ ప్రకటించారు. ] చిత్రాలు 1. బద్రి (2000) 2. బాచి (2001) 3. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం (2001) 4. అప్పు (2002) 5. ఇడియట్ (2002) 6. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి (2003) 7. శివమణి (2003) 8. ఆంధ్రవాలా (2004) 9. 143 (2004) 10. సూపర్ (2005) 11. పోకిరి (2006) 12. దేశముదురు (2007) 13. హలో ప్రేమిస్తారా (2007) 14. చిరుత (2007) 15. బుజ్జిగాడు (2008) 16. నేనింతే (2009) 17. ఏక్ నిరంజన్ (2009)

పి.పుల్లయ్య

పి.పుల్లయ్య (1911 - 1985) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. వీరి సినీ నిర్మాణం పద్మశ్రీ పిక్చర్స్ పతాకం పై చేపట్టారు. విషయ సూచిక దర్శకత్వం * అందరూ బాగుండాలి (1975) * కొడుకు కోడలు (1972) * అల్లుడే మేనల్లుడు (1970) * ప్రాణ మిత్రులు (1967) * Thaye Unakkaga (1966) * Asai Mukham (1965) * ప్రేమించి చూడు (1965) * మురళీకృష్ణ (1964) * సిరి సంపదలు (1962) * శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం (1960) * జయభేరి (1959) * Adisaya Thirudan (1959) * బండ రాముడు (1959) * Kalaivanan (1959) * Illarame Nallaram (1958) * Vanagamudi (1957) * Pennin Perumai (1956) * Umasundari (1956) * కన్యాశుల్కం (1955) * అర్ధాంగి (1955) * రేచుక్క (1954) * Manampole Mangalyam (1953) * ధర్మదేవత (1952/I) * Macha Rekai (1950) * తిరుగుబాటు (1950) * Veetukari (1950) * Bhakthajana (1948) * మాయా మచ్చీంద్ర (1945) * భాగ్యలక్ష్మి (1943) * ధర్మపత్ని (1941/I) * Premabandhan (1941) * Subhadra (1941) * Balaji (1939) * సారంగధర (1937/I) * హరిశ్చంద్ర (1935) నిర్మాత * కొడుకు కోడలు (1972) * అల్లుడే మేనల్లుడు (1970) * ప్రాణమిత్రులు (1967) * ప్రేమించి చూడు (1965) * సిరి సంపదలు (1962) * శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం (1960) * అర్థాంగి (1955) * ధర్మపత్ని (1941)

పి.యస్.రామకృష్ణారావు

పి.యస్.రామకృష్ణారావు (1918 - 1986) తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు దర్శకులు. వీరు భరణి పిక్చర్స్ అధిపతి. వీరు ప్రముఖ నటి భానుమతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. దర్శకునిగా * గృహలక్ష్మి (1967) * వివాహ బంధం (1964) * అనుబంధాలు (1963) * ఆత్మబంధువు (1962) * బాటసారి (1961) * Kanal Neer (1961) * శభాష్ రాజా (1961) * Manamagal Thevai (1957) * వరుడు కావాలి (1957) * చింతామణి (1956) * విప్రనారాయణ (1954) * చక్రపాణి (1954) * బ్రతుకు తెరువు (1953) * Kathal (1952) * ప్రేమ (1952) * లైలా మజ్ఞు (1949) * రత్నమాల (1947) నిర్మాతగా * గృహలక్ష్మి (1967) * వివాహబంధం (1964) * బాటసారి (1961) * వరుడు కావాలి (1957) * చింతామణి (1956) * విప్రనారాయణ (1954) * చక్రపాణి (1954) * చండీరాణి (1953) * ప్రేమ (1952) * లైలా మజ్ఞు (1949) * రత్నమాల (1947) రచయితగా * గృహలక్ష్మి (1967)

పాలడుగు దుర్గా ప్రసాద్

పాలడుగు దుర్గా ప్రసాద్ (Paladugu Durga Prasad) తెలుగు సినిమా దర్శకుడు. వీరి ప్రసిద్ధమైన సినిమాలలో వెంకటేశ్వర వైభవం, పెద్దన్నయ్య, జీవిత చదరంగం మొదలైనవి .

పరిటాల ఓంకార్

పరిటాల ఓంకార్ ప్రముఖ రచయిత, టీవీ నటుడు. రేడియోలో వార్తలు చదవడంతో మొదలుపెట్టి, తరువాత పత్రికలలో శీర్షికా రచయితగా, టీవీ సీరియళ్ళకు రచయితగా, సినిమా నటుడిగా, టీవీ సీరియళ్ళలో నటుడిగా పనిచేసాడు. ఒక సినిమాకు దర్శకత్వం కూడా చేసాడు. టీవీ సీరియళ్ళ రచయితగా, నటుడిగా ఓంకార్ విశేషమైన పేరు సంపాదించాడు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను తన సీరియళ్ళలో చొప్పించి, ప్రజాదరణ పొందాడు. నటుడిగా తన విలక్షణమైన వాచికంతో ఆకట్టుకున్నాడు. ఓంకార్ పోలీసుభార్య, పందిరిమంచం వంటి చిత్రాలలో నటించాడు. స్వాతి వారపత్రికలో ఓంకారం పేరుతో వారం వారం శీర్షిక నిర్వహిస్తూ ఉంటాడు

డా. దాసరి నారాయణరావు

డా. దాసరి నారాయణరావు 1947, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించాడు. దాసరి, రాజకీయనాయకుడు, సినిమా దర్శకుడు మరియు సినీ నిర్మాత. కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడి గా, నాటక రచయిత గా చిత్ర దర్శకుడి గా గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. దాసరి తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదానికి తెలుగుసినీరంగంలో ఉదాహరణగా ఈయన గురించి చెబుతారు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది. దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మరియు మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి తిసిన బొబ్బిలి పులి మరియు సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి. మామగారు, సూరిగాడు మరియు ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు. రాజకీయాలలో హైదరాబాదునందు కేంద్ర మంత్రిగా దాసరి తెలుగు ఫాంట్స్ రిలీజ్ ఫంక్సన్ నందు ఉపన్యసిస్తున్న దృశ్యం రాజీవ్ గాంధీ పాలనాకాలములో, దాసరి కాంగ్రేసు పార్టీ తరఫున ఉత్సాహవంతముగా ఎన్నికల ప్రచారము సాగించాడు. రాజీవ్ హత్యానంతరం పార్టీ కి కాస్త దూరంగా జరిగారు. 1990 దశకం చివరిలో ఆయన తెలుగు తల్లి అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని కాపు వర్గాల నుండి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత మాత్రం ఆయన కాంగ్రేస్ పార్టీ తరపున రాజ్య సభ కు ఎన్నిక అయ్యారు. బొగ్గు మరియు గనుల శాఖకు కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించారు. ఈయన కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కి సన్నిహితుడు. కాంగ్రేస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అవార్డులు * 1974లో తాతా మనవడు సినిమాకి నంది అవార్డు అందుకున్నారు. * స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రం గా బంగారు నంది బహుమతిని పొందారు. * 1983లో మేఘ సందేశం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందారు. * 1992లో మామగారు చిత్రానికి గాను ఉత్తమ నటుడు నంది అవార్డును పొందారు. * 1986లో తెలుగు సంస్కృతి మరియు తెలుగు చిత్ర రంగం నకు ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్రా విశ్వవిధ్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ను పొందారు. * ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి అనేక అవార్డ్ లను పొందారు. వాటిలో కొన్ని వంశీ బెర్క్లే, కళా సాగర్, శిరోమణి ఇన్స్టిట్యుట్ మొదలైనవి. ఫిల్మ్ ఫేర్ అవార్డును 6 సార్లు, మద్రాసు ఫిల్మ్ ఫాన్స్ అవార్డ్ ను 5 సార్లు, సినీ హెరాల్డ్ అవార్డ్ ను 10 సంవత్సరాలు వరసగాను గెల్చుకున్నారు. * జ్యోతి చిత్ర నుండి సూపర్ డైరెక్టర్ అవార్డ్ ను 3 సార్లు పొందారు. * పాత కాలం నాటి ఆంధ్రపత్రిక నుండి ఉత్తమ దర్శకుడిగా 6 సార్లు ఎంపిక అయ్యారు. * ఇవి కాక ఆయన నిర్మించిన చిత్రాలలో అనేకం అవార్డ్ లను గెలుచుకున్నాయి.

త్రిపురనేని గోపీచంద్

త్రిపురనేని గోపీచంద్ ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది నాస్తికుడు , సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు . గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు.అనేక వాదాలతో వివాదపడుతూ, తత్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం,ఆస్తి,శక్తి ఎందుకు? అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. ఎందుకు? అన్న ప్రశ్ననే అతన్ని ఒక జిజ్ఞాసువు గా,తత్వవేత్త గా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది. గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన రాసిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. 1963లో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. [1] విషయ సూచిక [దాచు] * 1 జీవిత క్రమం * 2 రచనలు o 2.1 నవలలు o 2.2 వాస్తవిక రచనలు * 3 తెలుగు సినిమాలు * 4 బయటి లింకులు * 5 మూలములు జీవిత క్రమం * 8-సెప్టెంబర్-1910 నాడు గోపీచంద్ జన్మించాడు. సుప్రసిద్ధ రచయిత, హేతువాది, సంస్కరణవాది అయిన త్రిపురనేని రామస్వామి చౌదరి ఆయన తండ్రి, తల్లి పున్నమాంబ. * హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో పెరిగిన గోపీచంద్ పై వాటి ప్రభావం సహజంగానే పడింది. * 1932 లో వివాహం;1933లో బి,ఏ పట్టా ఆ తర్వాత లా డిగ్రీ. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో యిమడలేక పోయాడు. ఈ దశలో ఆయన కమ్యూనిజం(మార్క్సిజం)పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అందులోని అరాచకత్వం ఆయనకు నచ్చలేదు. * ఆ తర్వాత ఎమ్.ఎన్.రాయ్ 'మానవతావాదం' వారిపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేసాడు. * 1928లోనే శంబుక వధ కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో పట్టాభి గారి సోషలిజం అన్న పుస్తకాన్ని వెలువరించాడు. * తొలుత కథా సాహిత్యంలో స్థిరపడ్డ గోపీచంద్ ఆ తర్వాత నవలా సాహిత్యరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన తొలి నవల పరివర్తనం(1943). * 1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయాడు. * 1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసాడు. * 1957-62 వరకు ఆకాశవాణిలో పనిచేసాడు. ఈ దశలో అరవిందు ని భావాల పట్ల విశ్వాసం ఏర్పడడంతో ఆధ్యాత్మికవాదం వైపుకి పయనించాడు. * 1962 నవంబర్ 2 నాడు గోపీచంద్ మరణించాడు. నవలలు * అసమర్థుని జీవయాత్ర * గడియపడని తలుపులు * చీకటి గదులు * పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా * ప్రేమోపహతుల * పరివర్తన * యమపాశం * శిధిలాలయం వాస్తవిక రచనలు * తత్వవేత్తలు * పోస్టు చేయని ఉత్తరాలు * మాకూ ఉన్నాయి సొగతాలు తెలుగు సినిమాలు * చదువుకున్న అమ్మాయిలు (1963) (మాటల రచయిత) * ధర్మదేవత (1952) (మాటల రచయిత) * ప్రియురాలు (1952) (కథ, మాటల రచయిత మరియు దర్శకుడు) * పేరంటాలు (1951) (దర్శకుడు) * లక్ష్మమ్మ (1950) (దర్శకుడు) * గృహప్రవేశం (1946) (కథా రచయిత) * రైతుబిడ్డ (1939) (మాటల రచయిత)

తాతినేని రామారావు

తాతినేని రామారావు (Tatineni Ramarao) తెలుగు, హిందీ సినిమాల దర్శకుడు. ఎన్.టి.రామారావు నటించిన యమగోల చిత్రానికి ఈయనే దర్శకుడు. రామారావు 1938లో కృష్ణా జిల్లా, కపిలేశ్వరంలో జన్మించాడు.

టి.ప్రకాశరావు

లేదా తాతినేని ప్రకాశరావు (1924-1992) సుప్రసిద్ధ తెలుగు, తమిళ మరియు హిందీ సినిమా దర్శకులు. వీరు కృష్ణా జిల్లా కపిలేశ్వరంలో జన్మించారు. సినిమా రంగంలో యల్.వి.ప్రసాద్ షావుకారు సినిమాకు మరియు కె.వి.రెడ్డి గారి వద్ద పాతాళ భైరవి సినిమాకు అసిస్టెంటుగా పనిచేశారు. తర్వాత పరివర్తన, పల్లెటూరు, జయం మనదేరా మొదలైన ఎన్నో తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, యం.జి.ఆర్. మొదలైన అగ్రనటులతో ఎన్నో తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీలో దాదాపు పెద్ద నటులందరితోనూ 25 పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. మొత్తంగా సుమారు 60 పైగా దర్శకత్వం వహించినవాటిలో కొన్ని చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. వీరు తాష్కెంట్ చలన చిత్రోత్సవంలోను, ఉజ్ బెకిస్థాన్ లోను రెండు సార్లు డెలిగేషన్ లో పాల్గొన్నారు. సినిమాలు * Kab Tak Chup Rahungi (1988) * Engalalum Mudiyum (1982) * Asha Jyoti (1981) * Ganga Bhavani (1979) * Hamara Sansar (1978) * Chiranjeevi Rambabu (1977) * పొగరుబోతు (1976) * సంసారం (1975) * Gali Patalu (1974) * మైనరు బాబు (1973) * Rivaaj (1972) * Ghar Ghar Ki Kahani (1970) * Nanha Farishta (1969) * Duniya (1968) * Izzat (1968) * Vaasna (1968) * Suraj (1966) * Bahu Beti (1965) * Padakottai (1964) * Bahurani (1963) * Hamrahi (1963) * Kaathiruntha Kangal (1962) * Anbu Magan (1961) * Sasural (1961) * College Girl (1960) * Ellorum Innattu Mannar (1960) * Maa Babu (1960) * ఇల్లరికం (1959) * Kanniraindha Kanavan (1959) * Nalla Theerpu (1959) * Amar Deep (1958) * Sitamgar (1958) * Uttama Puthiran (1958) * అమరదీపం (1956) * చరణదాసి (1956) * జయం మనదేరా (1956) * Matharkula Manikkam (1956) * పరివర్తన (1954) * నిరుపేదలు (1954) * పిచ్చి పుల్లయ్య (1953) * పల్లెటూరు (1952)

తమ్మారెడ్డి భరద్వాజ

తమ్మారెడ్డి భరద్వాజ ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకులు. దర్శకునిగా, నిర్మాతగా * పోతే పోనీ (2006) * వన్ బై టూ (2003) * సంచలనం (2000) * స్వర్ణముఖి (1998) * అత్తా నీకొడుకు జాగ్రత్త (1997) * కూతురు (1996) * వేటగాడు (1995) * రౌడీ అన్నయ్య (1993) * ఊర్మిళ (1993) * పచ్చని సంసారం (1992) * శివశక్తి (1991) * నేటి దౌర్జన్యం (1990) * అలజడి (1990) * మన్మధ సామ్రాజ్యం (1988) * స్వర్ణక్క (1998) * ఇద్దరు కిలాడీలు (1983) * మరో కురుక్షేత్రం (1981) * మొగుడు కావాలి (1980) * కోతల రాయుడు (1979)

డూండీ

డూండీ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు. ఆయన అసలు పేరు పోతిన డూండీశ్వరరావు. డూండీగా ఆయన సుప్రసిద్ధుడు. 70 కి పైగా సినిమాలు నిర్మించాడు. అభిమానవతి అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించాడు. తెలుగు తెరపై అనేక ప్రయోగాలు చేసిన నిర్మాతగా డూండీకి పేరుంది. ఈయన తండ్రి పోతిన శ్రీనివాసరావు మన రాష్ట్రంలో మొట్టమొదటి సినిమా హాల్‌ (విజయవాడ మారుతీ టాకీస్‌)ను నిర్మించాడు. 1956లో తన తొలి చిత్రంతో తెలుగు సినీ రంగంలో నిర్మాతగా అడుగిడిన డూండీ 'బందిపోటు', 'రక్తసంబంధం', 'శాంతినివాసం', 'గూఢచారి 116', 'మరపురాని కథ' లాంటి చిత్రాలు నిర్మించారు. తెలుగు సినిమాలలో కృష్ణను జేమ్స్‌ బాండ్‌ రూపంలో చూపించిన నిర్మాత డూండీనే. 2005 నంది అవార్డుల ఎంపిక కమిటీకి సారథ్యం వహించిన డూండీ 2007 జనవరి 1 న మరణించాడు.

జంపన చంద్రశేఖరరావు

జంపన చంద్రశేఖరరావు ప్రముఖ ప్రజా రచయిత, తెలుగు సినిమా రచయిత, దర్శకుడు మరియు నిర్మాత. వీరు ఏలూరులో జన్మించి, విద్యాభ్యాసం చేసి, తెలుగులో ఎం.ఎ. పట్టా పొందారు. అక్కడి సి.ఆర్.రెడ్డి కళాశాలలో కొంతకాలం తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. వీరు చెన్నైకి మకాం మార్చి నవలా రచలను చేశారు. కొవ్వలి లక్ష్మీనరసింహారావు నవలలు రైళ్ళలో విపరీతంగా ఖర్చవడం చూసి వీరి పద్ధతిలో తానూ అలాంటి నవలలను ఎక్కువగా రాశారు. ఆరోజుల్లో కొవ్వలి, జంపన నవలలను చదవని వారు అరుదు. వీరు రాసిన నవలలలో ఎవరి పెళ్లాం? (1940), నల్లకళ్ల అమ్మాయి (1947), వెంకటేశ్వర మహాత్మ్యం, ఊర్వశి అనే నాటకం (1948), ఆకలి అనే ఖండకావ్య సంపుటి ముఖ్యమైనవి. వీరు అపరాధ పరిశోధన నవలలు అనేకం రాశారు. స్త్రీ పురుష సంబంధాలు, వివాహ సమస్యలు వీరి రచనలలో ప్రాధాన్యం వహించిన అంశాలు. సరళమైన భాష, ఉత్కంఠభరితమైన కథాకథన విధానం వీరి రచనలకు ప్రజాదరణ చేకూర్చాయి. వీరు 1953లో చెన్నైలో హృద్రోగంతో పరమపదించారు. చిత్రాలు * భట్టి విక్రమార్క (1960) (దర్శకుడు) * హరిశ్చంద్ర (1960) (దర్శకుడు) * కృష్ణలీల (1959) (దర్శకుడు) * మేనరికం (1954) (నిర్మాత మరియు దర్శకుడు) * వాలి సుగ్రీవ (1950) (దర్శకుడు)

జంధ్యాల

జంధ్యాల తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. జంధ్యాల అని ఇంటిపేరుతోటే సుప్రసిద్ధుడైన ఇతని అసలుపేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో ఇతనిది అందె వేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం - నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం విషయ సూచిక * 1 జీవిత విశేషాలు * 2 సినిమా ప్రస్థానం * 3 జంధ్యాల చెణుకులు * 4 అవార్డులు * 5 జంధ్యాల పరిచయం చేసిన నటీనటులు * 6 జంధ్యాల వ్రాసిన కొన్ని సినీ సంభాషణలు * 7 జంధ్యాల సినిమాలు * 8 బయటి లింకులు జీవిత విశేషాలు జంధ్యాల 1951 జనవరి 14 న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. బి.కామ్ వరకు చదువుకున్నారు. చిన్నతనం నుండీ నాటకాల పట్ల ఆసక్తిగా ఉండేవారు. స్వయంగా నాటకాలు రచించారు కూడాను. ఆయన రాసిన నాటకాల్లో ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును ప్రముఖమైనవి. ఆయన నాటకాలు అనేక బహుమతులు అందుకున్నాయి. 1974 లో జంధ్యాల సినిమా రంగ ప్రవేశం చేసాడు. శంకరాభరణం, సాగరసంగమం, అడవిరాముడు, వేటగాడు వంటి అనేక విజయవంతమైన సినిమాలకు మాటలు రాసారు. ముద్దమందారం సినిమాతో దర్శకుడిగా మారి, శ్రీవారికి ప్రేమలేఖ వంటి చిరస్మరణీయ చిత్రాన్ని సృజించారు. జంధ్యాల 2001 జూన్ 19 న హైదరాబాదులో గుండె పోటుతో మరణించారు. ] సినిమా ప్రస్థానం మాటల రచయితగా తన సినిమా జీవితం మొదలుపెట్టిన జంధ్యాల, మంచి రచయితగా పేరు తెచ్చుకున్నాడు. తరువాతి కాలంలో దర్శకుడిగా అవతారమెత్తి, అనేక హాస్యచిత్రాలను రూపొందించాడు. ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల పేరుగాంచాడు. హాస్యబ్రహ్మ అని పేరుపొందాడు. జంధ్యాల చెణుకులు * ఇంటిపేరుతోటే ప్రసిద్ధుడైన జంధ్యాలను మీ అసలు పేరు ఏమిటి అని అడిగితే ఆయన ఇలా అనేవాడు: "నేను రామానాయుడి గారి సినిమాకు పనిచేసేటపుడు నాపేరు జంధ్యాల రామానాయుడు, విశ్వనాథ్ గారి సినిమాకు పనిచేసేటపుడు నా పేరు జంధ్యాల విశ్వనాథ్..." అలా అనేవాడు తప్ప, తన అసలుపేరు ఎక్కడా చెప్పుకోలేదు. * హాస్యం గురించి ఆయన ఇలా అనేవాడు: "నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం" అవార్డులు జంధ్యాలకు లభించిన కొన్ని అవార్డులు: - 1983, "ఆనంద భైరవి" చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం దర్శకుడు జాతీయ అవార్డు - 1983, "ఆనంద భైరవి" చిత్రానికి ఉత్తమ దర్శకుడు నంది అవార్డు - 1987, "పడమటి సంధ్యారాగం" చిత్రానికి ఉత్తమ కధారచయిత అవార్డు - 1992, "ఆపద్బాంధవుడు" చిత్రానికి ఉత్తమ మాటల రచయిత అవార్డు జంధ్యాల పరిచయం చేసిన నటీనటులు జంధ్యాల తన సినిమాల ద్వారా అనేకమంది నటులను సినిమా రంగానికి పరిచయం చేసాడు. వారిలో కొందరు: * బ్రహ్మానందం * నరేష్ * ప్రదీప్ * సుత్తి వీరభద్రరావు * సుత్తి వేలు జంధ్యాల వ్రాసిన కొన్ని సినీ సంభాషణలు వివాహ భోజనంబు చిత్రం నుంచి మట్టి పూసుకొని ఉన్నపుడు బ్రహ్మానందం సంభాషణ--(ఏడుపు గొంతుతో) ఈ చెమ్మంతా ఇగిరేలోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాఏమో మహాప్రభో. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే . జూవాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళి పోతారు. జనమెవరయినా చూస్తే ఇతర గ్రహాలనుండి వచ్చారనుకొని రాళ్ళుచ్చుక్కొడతారు... (ఆశగా ) ఇంక ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభో. కధ చెప్పమని--ఈ కథ సినెమాగా తీస్తే నేను అడుక్కుతినాల, ఓ వూరు వూరంతా పస్తుండి నాకు ముష్టెయ్యాల్సొస్తుంది. అరే ఇన్నాళ్ళనుండి సూత్తన్నాను. సినిమాకు పనికొచ్చే ఒక కథ కూడా సెప్పలేనోడివి నువ్వేం కవివయ్యా అసలు. నేనొక గొప్ప కథ సెప్తాను ఇనుకో మధ్య తరగతి ఎదవనాయాలా. మహాప్రభో తమరు నన్ను తిట్టారా? లేదు సినిమా పేరు చెప్పా--ఆ పేరు తిట్టులా ఉంది మహాప్రభో --పేరులో తిట్టుంటేనే సినిమా హిట్టవుద్దయ్యా తెర లెగవంగానే ఈరో ఒక కాఫీ ఓటల్కు ఎల్తాడు. సర్వర్ రాగానే ఈరో ఏమున్నాయి అని అడిగాడు. అప్పుడు సర్వరు "ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మషాలా గారె, ఉప్మా, కిచిడీ, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మషాలా అట్టు, బాత్తు, టమేటా బాత్తు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరిటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిథాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా,హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా" ఉన్నాయంటాడు. అప్పుడు ఈరో "అట్టు తే" అన్నాడు అప్పుడు సర్వరు " యే అట్టు? పెసరట్టా, మినపట్టా, రవ్వట్టా, మషాలా అట్టా, 70mm అట్టా, MLA అట్టా, నూనేసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా, నీళ్ళోసి కాల్చాలా, పెట్రోలు పోసి కాల్చాలా, కిరసనాలు పోసి కాల్చాలా, డీజిలేసి కాల్చాలా, అసలు కాల్చాలా వద్దా " అని అడిగాడు అప్పుడు ఈరో పెసరట్టు నెయ్యేసి కాల్చమన్నాడు, కాఫీ కూడా తెమ్మన్నాడు అప్పుడు సర్వరు "యే కాపీ మామూలు కాపీయా,స్పెసలు కాపీయా, బుర్రూ కాపీయా, నెస్కాఫీయా, బ్లాక్ కాఫీయా, వైటు కాఫీయా హాటు కాఫీయా, కోల్డు కాఫీయా , నురుగు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు " అని అడిగాడు అప్పుడు ఈరో మామూలు కాపీ తెమ్మన్నాడు అప్పుడు సర్వరు "నీలగిరి కాపీయా, హిమగిరి కాపీయా, సిమలా కాపీయా' ఆపండి మహాప్రభో, తమలో ఇంత వూహాశక్తి ఉందని వూహించలేకపోయాను. ఈ కథనే సినిమాగా తీసుకోండి. పది వేల రోజులు ఆడుతుంది జనం వ్రుద్దులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనం అయిపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభో నన్ను వదిలెయ్యండి మహాప్రభో నన్ను వదిలెయ్యండి మహాప్రభో అద్దె బాకీ మాఫీ చేస్తానని తమరు నన్నిలా శంకుస్థాపన టైపులో పాతిపెట్టి తమరలా విష్ణుమూర్థిలా పడుకోవడం ఏమీ బాగలేదు మహాప్రభో నిన్ను నేను పాతిపెట్టాను కదా, నన్ను పాతి పెట్టే మడిసి కోసం సూత్తన్నానయ్యా నన్ను తొరగా బయటకి లాగండి మహాప్రభో. ఏ ఊరకుక్కాన్నా దగ్గరికొచ్చి కాలెత్తిందంటే పావనమైపోతాను. లేదా యే అల్సేషనో ఇసుకలో బంతి పడిందని నా తల నొట కరుచుకొని వెళ్ళిపోతే కీర్తిశేషుడిని అయిపోతాను. చీ ముక్కు మీద దురద పుట్టినా గోక్కోలేని వెధవ బ్రతుకు అయిపోయింది నాది స్షో ఆట్టే వాగావంటే... .... నువ్వు సెప్తున్న కథలో ఏదో లోపముందయ్యా కవీ. నేను ఆలోసించి పెట్టుకున్న సిన్న లైను ఇనిపిస్తాను ఇనుకో వో ప్యామిలీ మంగలగిరి తిరణాలకెల్తారు. ఆళ్ళ కొడుకు ఆరేళ్ళ గుంటడు ఆ జనంలో తప్పోతాడు. ఆడి తల్లిదండ్రులు ఆడికోసం బావురుమంటారు ఆహా సెంటిమెంటు బాగుందండయ్యా. మొదటి సారిగా తమరు మెదడు వాడుతున్నారు, వాడండి ఆడి తండ్రి ఆడికోసం వూళ్ళన్నీ గాలించడం మొదలుపెట్టాడు. యే యే వూళ్ళు తిరిగాడో తెలుసా? ఐదరాబాదు, అదిలాబాదు, సికిందరాబాదు, అహమ్మాదాబాదు, ఫకీరాబాదు,అలహాబాదు, ఫరీదాబాదు. ఔరంగాబాదు, తనబాదు (??), సింధుబాదు,ముస్తాబాదు, ఫైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జపారాబాదు, వుస్సేనుబాదు. (బ్రహ్మం ఏడుస్తూ) నా బొందబాదు, నా శ్రాద్దంబాదు, నా పిండాకూడు బాదు ఆ ఆ ఆటన్నిటితో కలిపి మొత్తం ఇరవయ్యొక్క బాదులు ఎతికాడు. సివరాఖరికి యెవుడో ఆ గుంటడు బెజవాడలో ఉన్నాడని సెప్తే ఆ వూరెళ్ళాడు. బెజవాడలో గవర్నరుపేట, లబ్బీ పేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్యా నగరం, ముత్యాలపాడు, గుణదల, గాంధీ నగరం, చిట్టి నగరం, మాచవరం, రోకళ్ళపాలెం, మారుతీ నగరం, మొగల్రాజపురం, భవానీపురం, సత్యన్నారాయనపురం, సీతారామపురం... వద్దు బాబోఇ, చాలు మహాప్రభో చాలు, బెజవాడంతా వెతికేసాడనుకుందాం ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభో. అన్నీ పేట్లెతికినా ఆ గుంటడు దొరకలేదయా, అప్పుడు... పారిపోవడానికి కూడా వీలులేని పరిస్థిథిలో పడిపోయాను మహాప్రభో ఇను ఇక్కడే ఇక్కడే తమాషగుంటంది అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. యే యే రోడ్ల మీద పడ్డాడో తెలుసా? బీసెంటు రోడ్డు, బందరు రోడ్డు, యేలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టిక్కల రోడ్డు, కారల్ మార్క్సు రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టవును రోడ్డు, అద్దంకివారి వీధి, తాళంకివారి వీధి, దాసరివారి వీధి, మల్లెలవారి వీధి, పుల్లెలవారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోడా టాకీసు వీధి, అచ్చమామబ ఆస్పత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి... మహాప్రభో ఆపండి, ఇది సినిమా కథా? ఈ లెక్కన పోస్ట్ మ్యాన్లు అత్యద్భుతమయిన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తినా పందొచ్చి తల కొరికినా ఇంతకంటే సుఖంగా ఉంటుంది మహాప్రభో వేటగాడు చిత్రం నుంచి రావుగోపాలరావు, సత్యనారాయణతో -రాజా ప్రియురాలు రోజా మేజా బల్ల మీదికెక్కి కాజాలు తింటూ నీ వీపు మీద బాజాలు బాదుతోంటే నువ్వేంచేస్తున్నావురా కూజా" అన్నప్పుడు సత్యనారాయణ చిన్నబుచ్చుకున్న కోపంతో రావుగోపాలరావు ప్రాసల బలం ఎంతుందో చూపమంటాడు. అప్పుడు రావుగోపాలరావు - " రాజుగారి పెద్ద కొడుకు బెస్టుగా పస్టు క్లాసులో పాసయ్యాడని, బావుండదని గెస్టుగా పీస్టుకి పిలిచి, హోస్టుగా నేనుండి సపర్యలు చేస్తోంటే, సుస్టుగా భోంచేసి, పొద్దున్నే లేచి మన పేస్టుతోనే పళ్లు తోంకుని, ఉడాయించాడు భ్రస్టు వెధవ" అన్నప్పుడు ఇదంతా విని రొప్పుతున్న సత్యనారాయణని చూసి - " ఇంకా విసరమంటావా నా మాటల తూటాలు" అంటాడు. జంధ్యాల సినిమాలు దర్శకునిగా సినిమా తారాగణం విడుదల తేది ముద్ద మందారం ప్రదీప్, పూర్ణిమ 1981 మల్లె పందిరి విజ్జి బాబు, జ్యోతి, యస్.పి.బాల నుబ్రమణ్యం 1982 నాలుగు స్తంభాలాట నరేష్, ప్రదీప్, పూర్ణిమ, తులసి 15-5-1982 నెలవంక రాజేష్, గుమ్మడి, జే.వి.సోమయాజులు 25-1-1983 రెండుజెళ్ళ సీత నరేష్, ప్రదీప్, రాజేష్, సుభాకర్, మహాలక్ష్మి 30-3-1983 అమరజీవి అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద 19-8-1983 మూడు ముళ్ళు చంద్రమోహన్, రాధిక, గీత -9-1983 శ్రీవారికి ప్రేమలేఖ నరెష్, పూర్ణిమ 2-3-1984 ఆనంద భైరవి (తెలుగు & కన్నడం) గిరీష్ కర్ణాడ్, మాళవిక -4-1984 రావు - గోపాలరావు రావు గోపాలరావు, చంద్రమోహన్, ముఛ్ఛర్ల అరుణ 1984 పుత్తడి బొమ్మ నరేష్, పూర్ణిమ, ముఛ్ఛర్ల అరుణ 1985 బాబాయ్ అబ్బాయ్ బాలకృష్ణ, అనితా రెడ్డి, సుత్తి వీరభద్ర రావు 8-2-1985 శ్రీవారి శోభనం నరేష్, అనితా రెడ్డి 1985 మొగుడు పెళ్ళాలు నరేష్, భానుప్రియ 5-8-1985 ముద్దుల మనవరాలు భానుమతి, సుహాసిని, జయసుధ, చంద్రమోహన్, శరత్ బాబు 1985 రెండు రెళ్ళు ఆరు రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, రజని, ప్రీతి 11-1-1986 సీతారామ కళ్యాణం బాలకృష్ణ, రజిని 18-4-1986 చంటబ్బాయి చిరంజీవి, సుహాసిని 22-8-1986 పడమటి సంధ్యారాగం విజయశాంతి, టామ్, గుమ్మలూరి శాస్త్రి 11-4-1987 రాగలీల రఘు, సుమలత, తులసి, సంధ్య 4-6-1987 సత్యాగ్రహం చల్లా రామకృష్ణా రెడ్డి, సరిత, గుంటూరు శాస్త్రి 1987 అహ నా పెళ్ళంట రాజేంద్ర ప్రసాద్, రజని 27-11-1987 చిన్ని కృష్ణుడు రమేష్, కుషుబూ, శరత్ బాబు -4-1988 వివాహ భోజనంబు రాజేంద్ర ప్రసాద్, అశ్విని -4-1988 నీకు నాకు పెళ్ళంట డా.రాజశేఖర్, అశ్వని 8-1988 చూపులు కలసిన శుభవేళ నరేష్, మోహన్, అశ్వని, సుధ 7-10-1988 హై హై నాయకా నరేష్, శ్రీ భారతి 23-2-1989 జయమ్ము నిశ్చయమ్మురా రాజేంద్ర ప్రసాద్, సుమలత, చంద్రమోహన్, అవంతి 6-7-1989 లేడీస్ స్పెషల్ సురేష్, వాణీ విశ్వనాథ్, రశ్మి, సుత్తివేలు 1991 బావా బావా పన్నీరు నరేష్, రూపకళ 9-8-1991 ప్రేమ ఎంత మధురం నరేష్, మయూరి 6-9-1991 విచిత్రప్రేమ రాజేంద్ర ప్రసాద్, అమృత 1991 బాబాయి హోటల్ బ్రహ్మానందం, కిన్నెర 5-6-1992 ప్రేమా జిందాబాద్ రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్య, సుభలేఖ సుధాకర్ - అ ఆ ఇ ఈ వరుణ్ రాజ్, అచ్యుత్, విజయ్ కుమార్ - ష్ గప్‌చుప్ వరుణ్ రాజ్, భానుప్రియ 12-5-1994 ఓహో నా పెళ్ళంట హరీష్, సంఘవి 20-3-1996 విచిత్రం గజల్ శ్రీనివాస్, చంద్రశ్రీ, శ్రీ హర్ష, చార్మి 6-11-1999 రచయితగా * నారీ నారీ నడుమ మురారి * అడవి రాముడు * వేటగాడు * రహస్య గూఢచారి * సీతాకోక చిలుక

చిత్తూరు నాగయ్య

చిత్తూరు నాగయ్య ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు ధరించి చిరస్మరణీయుడయ్యాడు. దక్షిణభారత దేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలినటుడు. తెలుగు సినిమా నే కాకుండా, తమిళ సినిమాకి కూడా ఒక గౌరవాన్నీ, ప్రతిష్ఠనీ కల్పించిన నటుడు నాగయ్య. కేవలం తన నటనతోనూ, వ్యక్తిత్వంతోను ఆ గౌరవం తీసుకురాగలిగారాయన. సభ్యసమాజంలో సినిమానటులంటే చిన్నచూపు వుండేది - తొలిరోజుల్లో నాటకాల వాళ్లకి వున్నట్టు. ఆ చూపును పెద్ద చూపు చేసి సమదృష్టితో చూడగలిగేలా చేసిన మహనీయుడు చిత్తూరు వి.నాగయ్య. మహారాజుల దగ్గరా, విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గరా నాగయ్యకు విశేష గౌరవాలు లభించాయి. ఈ గౌరవ ప్రతిష్ఠలు ఆయనతోనే ఆరంభమయాయని చెప్పడం అతిశయోక్తి అనిపించుకోదు. చిత్తూరు నాగయ్య 1904 మార్చి 28న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. ఆయన అసలు పేరు "ఉప్పల దడియం నాగయ్య". కొంతకాలం పాత్రికేయునిగా పనిచేశారు. చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా ప్రసిద్ధులయ్యారు. విషయ సూచిక * 1 సినీరంగ ప్రవేశం * 2 వ్యక్తిత్వం * 3 దర్శకత్వం * 4 చివరి దశ * 5 ప్రశంసలు * 6 నటించిన చిత్రాలు * 7 ఇతర వనరులు * 8 చూడండి సినీరంగ ప్రవేశం 1938లో హెచ్.ఎమ్.రెడ్డి చిత్రం గృహలక్ష్మితో నాగయ్య సినీ ప్రస్థానం ప్రారంభమైంది. చిత్తూర్లో పత్రికా విలేకరిగా వుంటూ, నాటకాల్లో నటిస్తూ గ్రామఫోన్ రికార్డులు ఇస్తూ కాలక్షేపం చేస్తున్న నాగయ్యను సినిమారంగం ఆహ్వానించింది. ఆ రోజుల్లో పర్సనాలిటీ ఎలావుందని ఎవరూ చూసేవారు కాదు. 'పాటా పద్యం వచ్చునా - ఓకే!' అన్న రోజులు. రంగస్థలం మీద సంభాషణ చెప్పడంలో కూడా కొత్త విధానాన్ని చూపించారనీ, ఉచ్చారణ స్పష్టంగా వున్నదనీ నాగయ్యను హెచ్.ఎం.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, గృహలక్ష్మి (1938) చిత్రములో నటించడానికి పిలిచారు. అందులో ఈయన ఒక దేశభక్తుడి పాత్ర పోషించాడు. గృహలక్షిలో నాగయ్య పాడిన పాటలు అందర్నీ ఆకట్టుకొని ప్రాచుర్యం పొందాయి. తొలిచిత్రంతోనే చిత్తూరు వి.నాగయ్య మంచి నటుడు అనిపించుకున్నాడు. 1939లో బి.యన్.రెడ్డి వందేమాతరం చిత్రంలో నాగయ్యకు కధానాయకుని పాత్ర లభించింది. అదే చిత్రంలో నాగయ్య సంగీతాన్ని కూడా కూర్చారు. అప్పుడు 'హీరో ఇమేజ్' వుంటుందీ, పోతుందీ అన్న భావన లేనేలేదు. వెంటనే 'సుమంగళి (1940) లో వృద్ధపాత్ర ధరించారాయన. తర్వాతి చిత్రం దేవత (1941) లో హీరోయే. ఈ సినిమాలన్నీ తమిళనాడులో కూడా బాగా నడవడంతో, నాగయ్యకు తమిళ చిత్రాల్లో కుడా మంచి అవకాశాలొచ్చాయి. తమిళభాషను ఆయన క్షుణ్ణంగా నేర్చుకున్నారు. గ్రాంథికభాష కూడా అలవరుచున్నారు. తన పాటలు తానే పాడుతూ 'సిసలైన తెలుగు సినిమా హీరోగా' గొప్ప వెలుగు వెలిగారు నాగయ్య. స్వర్గసీమ (1945) ఒక ఉదాహరణ. భక్త పోతన (1942), త్యాగయ్య (1946), యోగి వేమన (1947) చిత్రాలు నాగయ్య జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఆ పాత్రల ప్రభావం ఆయన మీద బాగా పడింది. 1938-1973 మధ్య నాగయ్య 200పైగా తెలుగు, తమిళ సినిమాలలో నటించారు. సుమంగళి, భక్త పోతన, రామదాసు, యోగివేమన, త్యాగయ్య ఆయన నటించిన కొన్ని విశేష చిత్రాలు. అప్పటిలో నాగయ్య అత్యధిక పారితోషికం తీసుకొనే నటుడు. 1948లో తమిళ సినిమా "భక్యదలి (?)" కి నాగయ్యకు లక్ష రూపాయలు పారితోషికం. నాగయ్య మంచి గాయకుడు, సంగీత దర్శకుడు కూడాను. స్వర్గసీమ సినిమాకు నేపధ్యగాయకునిగా ఘంటసాలను పరిచయం చేశారు. త్యాగయ్య సినిమా చూసి మైసూరు మహారాజా నాగయ్యను 101 బంగారు నాణేలు, ఒక కంఠాభరణంతో సత్కరించారు. తెలుగు సినీరంగంలో మొట్టమొదటి పద్మశ్రీ సత్కారం గ్రహించింది నాగయ్యే. మాన్యులు, సామాన్యులు కూడా నాగయ్యను విపరీతంగా అభిమానించే వారు. తరువాత భాగ్యలక్ష్మి సినిమాతో చిత్రనిర్మాణంలోకి దిగారు. రామదాసు సినిమాలో ఆయన బాగా నష్టపోయారు. సినిమా నిర్మాణంలోను, దాన ధర్మాల వలన ఆయన ఆస్తి బాగా కరిగిపోయింది. సినిమా ప్రభావం మంచైనా, చెడైనా ప్రజల మీద వుంటుందంటారు. అది చూస్తూనే వున్నాం, వింటూనే వున్నాం. పోతన, వేమన పాత్రల ప్రభావంతోనే ముమ్మడివరం బాలుడు బాలయోగిగా మారాడన్నది తెలిసిన విషయమే. అప్పుడే బాబూరావు పటేల్ తన 'ఫిల్మిండియా' పత్రికలో 'మనదేశంలోనూ ఒక పాల్ ముని వున్నాడు' అని నాగయ్యను ప్రస్తుతించాడు. తెలుగునటుల్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న తొలినటుడు నాగయ్య. ఆ చిత్రం పక్షిరాజా వారి 'బీదలపాట్లు (50). దక్షిణభారతంలో 'పద్మశ్రీ' పురస్కారం పొందిన తొలినటుడూ నాగయ్యే. 'అదేదో నా ఘనత కాదు. నాకే వచ్చిన ప్రశంస కాదు. ఇదినటులందరిదీ!' అని చెప్పేవారు నాగయ్య ఎవరు కనిపించినా. వ్యక్తిత్వం ఆయన మాటతీరూ, చిరునవ్వూ అన్నీ శాంతం ఉట్టిపడుతూ వుండేవి. ఎవరి మీదా ఈర్ష్యాద్వేషాలూ, కోపతాపాలూ వుండేవి కావు. పోతన - తన దగ్గర లేకపోయినా, ఉన్నదేదో దానం చేసినట్టు, - నాగయ్య కూడా దానాలు చేసి చేసి, ఆస్తులన్నీ హరింప జేశారు. కొందర్ని నమ్మి కొంత డబ్బు మోసపోయారు. 'త్యాగయ్య తీస్తున్నప్పుడు వారి రేణుకా ఆఫీసు ధర్మసత్రంలా వుండేదని చెప్పుకుంటారు. చిన్న చిన్న వేషాలు వేసేవాళ్లూ, చిన్న టెక్నీషియన్లూ, అక్కడే బసా, భోజనాలూ! 'పొట్టిప్లీడరు (1966) సినిమా తీస్తున్నప్పుడు పద్మనాభం ఆయనతో మాటల సందర్భంగా చెప్పారు తను కూడా 'రేణుక' ఆఫీసులో కొంతకాలం వున్నానని. దానికాయన ఎంతో స్పందించి, 'అలాగా నాయనా! నీకు అప్పుడు ఏ లోపం జరగలేదు గదా, నువ్వెవరో నాకు తెలియకపోయెనే!' అని బాధపడ్డారు. అవుట్ డోర్ షూటింగులకి వెళ్తే, మధ్యాహ్నం భోజనసమయంలో షూటింగు చూడవచ్చిన జనానికి భోజనం పెట్టమనేవారు నాగయ్య. 'వాళ్లు కూడా పొద్దున నుంచి మనతోపాటే ఇక్కడ వున్నారుగదా!' అన్నది ఆయన సమాధానం. మద్రాసులో స్కూళ్లూ, కాలేజీలూ తెరిచే రోజుల్లో ఆయన ఇంటిముందు విపరీతంగా జనం గుమిగూడేవారు - ఆయన లేఖలురాసి ఇస్తే కాలేజీ, హైస్కూళ్లలో సీట్లు దొరకడం సులభయయేది. దర్శకత్వం దర్శకుడుగా త్యాగయ్య ఆయన తొలిచిత్రం. త్యాగయ్య సినిమాను ఆయనే నిర్మించి, దర్శకత్వము చేశారు. నాయిల్లు (1953), భక్త రామదాసు (1964) చిత్రాలూ డైరెక్టు చేశారు - నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ. కొంతకాలం క్రితం మద్రాసులో నాగయ్య స్మారకదినోత్సవం జరిగితే, 'త్యాగయ్య' ప్రదర్శించారు. ఆ చిత్రం చూసిన ప్రసిద్ధదర్శకుడు కె.విశ్వనాథ్ 'ఈ చిత్రంలోని ప్రతి అంశం ఎంతో కళాత్మకంగానూ, ఉన్నతంగానూ ఉన్నాయి. ఆయన తీసిన కొన్ని షాట్స్ నాలాంటి దర్శకుల ఊహకు అందనివీ అని కీర్తించారు. 'త్యాగయ్య సినిమాలోని 'ఎందరో మహానుభావులూ' పాట విన్న ప్రసిద్ధ గాయకుడు జేసుదాసు త్యాగరాజు ఎలా పాడివుంటారో, నాగయ్యపాట విన్నాక, ఊహించుకోవచ్చును. త్యాగరాజ సంప్రదాయాన్ని పాటిస్తూ, ఆకౄతిని అతిభక్తిశ్రద్ధలతో ఇంకొకరు పాడగలరా - అనిపిస్తుందీ అని చెప్పారు. ఆ చిత్రంలోని ఆయన గానామృతానికి పరవశించి, మైసూరుమహారాజా, తిరువాస్కూర్ మహారాజా, నాగయ్యను అతిఘనంగా సత్కరించారు. తిరువాస్కూరు రాజావారు, ఏకంగా తన సింహాసనం మీదనే కూర్చోబెట్టారుట. 'రామదాసు' చిత్రం వేళకే ఆయన ఆస్తులు కొండెక్కిపోయాయి. ఆయనకు నాలుగైదు తోటలు వుండేవి. రామదాసు సినిమా తీస్తున్నప్పుడు, రామదాసు పడిన కష్టాలన్నీ నాగయ్య అనుభవించారు. చిత్రం పూర్తి కావడానికి చాలాకాలం పట్టింది. చివరి దశ చివరి రోజులలో పేదరికాన్ని అనుభవించారు. కేవలం వందల రూపాయలకు చిన్న చిన్న వేషాలు వేశారు. తెలుగు సినీరంగములో ఒకదశలో అత్యధిక పారితోషికం తీసుకున్న నాగయ్య, ఆ తరువాత దశలో ఉదరపోషణకు చిన్న వేషాలు వేస్తూ అల్ప పారితోషికాలూ అందుకున్నారు. నా జీవితం అందరికీ ఒక పాఠం. తనకు మాలిన ధర్మం చెయ్యకండి. అపాత్రదానాలు చెయ్యకండి. ఎందరో గోముఖవ్యాఘ్రాలు వుంటారు. అందర్నీ నమ్మకండి! అని చెప్పేవారు - ఇళ్లు అన్నీ పోయి అద్దె ఇంట్లో వున్నప్పుడు! మద్రాసు పానగల్ పార్కులోని ఆయన విగ్రహం, వాణీ మహాల్ ఆడిటోరియం, ఆయన చలనచిత్ర ఉదాత్తపాత్రలూ ఆయన ఘనతను మనకు అనునిత్యం గుర్తుకు తెస్తూవుంటాయి. 1973లో నాగయ్య మరణించారు. ] ప్రశంసలు ] నటించిన చిత్రాలు 30వ దశకం 1. గృహలక్ష్మి(1938) 2. వందేమాతరం (1939) 40వ దశకం 1940 1. సుమంగళి 2. మహాత్మాగాంధీ (డాక్యుమెంటరీ) 3. విశ్వమోహిని 1941 1. దేవత 1943 1. భాగ్యలక్ష్మి 2. చెంచులక్ష్మి 3. భక్తపోతన 1945 1. స్వర్గసీమ 1946 1. త్యాగయ్య 2. యోగి వేమన 1949 1. మనదేశం 50వ దశకం 1950 1. బీదలపాట్లు 1953 1. నా ఇల్లు 2. ఇన్స్‌పెక్టర్ 3. ప్రపంచం 4. గుమస్తా 1954 1. మా గోపి 2. సంఘం 3. జాతకఫలం 1955 1. అనార్కలి 1956 1. భక్త మార్కండేయ 2. ముద్దు బిడ్డ 3. తెనాలి రామకృష్ణ 4. నాగపంచమి 1957 1. సతీ సావిత్రి 2. పాండురంగ మహత్యం 3. నలదమయంతి 1958 1. బొమ్మల పెళ్ళి 2. ఎత్తుకు పైఎత్తు 3. గంగా గౌరి సంవాదం 4. శ్రీ రామాంజనేయ యుద్దం 5. సంపూర్ణ రామాయణం 6. పార్వతీ కళ్యాణం 1959 1. బండరాముడు 2. జయభేరి 3. సిపాయి కూతురు 60వ దశకం 1960 1. అభిమానం 2. భక్త రఘునాథ్ 3. భక్త శబరి 4. మా బాబు(అతిధి) 5. సమాజం 6. శాంతినివాసం 7. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం 1961 1. భక్త జయదేవ 2. ఇంటికి దీపం ఇల్లాలే 3. సీతారామ కళ్యాణం 4. వాగ్దానం(అతిధి) 5. పెళ్ళిపిలుపు(అతిధి) 6. సతీ సులోచన(అతిధి) 7. ఋష్యశృంగ 1962 1. నాగార్జున 2. దక్షయజ్ఞం(అతిధి) 3. ఆరాధన(అతిధి) 4. స్వర్ణమంజరి 5. పెళ్ళి తాంబూలం 6. పదండి ముందుకు(అతిధి) 7. గాలి మేడలు 8. సిరిసంపదలు 9. మమకారం 1963 1. బందిపోటు 2. కానిస్టేబుల్ కూతురు 3. లవకుశ 4. అనురాగం(అతిధి) 5. శ్రీకృష్ణార్జున యుద్ధం 6. తల్లీ బిడ్డలు 7. లక్షాధికారి 8. ఇరుగు పొరుగు 1964 1. అగ్గిపిడుగు 2. ఆత్మబలం 3. అమరశిల్పి జక్కన 4. రామదాసు 5. వివాహ బంధం 6. గుడిగంటలు 7. దాగుడుమూతలు(అతిధి) 8. నవగ్రహ పూజా మహిమ 9. బొబ్బిలి యుద్ధం(అతిధి)

సి.ఎస్.రావు

సి.ఎస్.రావుగా ప్రసిద్ధిచెందిన చిత్తజల్లు శ్రీనివాసరావు సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు మరియు నటుడు. ఇతడు సుప్రసిద్ధ దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య మరియు నటీమణి శాంత కుమారి దంపతుల పుత్రుడు. ఇతని భార్య ప్రముఖ నాట్యకళాకారిణి మరియు నటీమణి రాజసులోచన. విషయ సూచిక * 1 చిత్ర సమాహారం o 1.1 దర్శకుడిగా o 1.2 నటుడిగా o 1.3 రచయితగా * 2 బయటి లింకులు చిత్ర సమాహారం దర్శకుడిగా * యోగి వేమన (1988) * గృహలక్ష్మి (1985) * రాజా హరిశ్చంద్ర (1984) * సత్య హరిశ్చంద్ర (1984) * Bhayankara Bhasmasura (1983) * మరో మాయాబజార్ (1983) * రాధమ్మ మొగుడు (1982) * అల్లరి పిల్లలు (1978) * Parasuraman (1978) * Shri Renukadevi Mahatme (1977) * మహాకవి క్షేత్రయ్య (1976) * మంచికి మరోపేరు (1976) * Punardatta (1976) * దేవుడులాంటి మనిషి (1975) * Swandam Kariyum Zindabad (1975) * యశోదా కృష్ణ (1975) * ఆడంబరాలు అనుబంధాలు (1974) * అనగనగా ఒక తండ్రి (1974) * బంధాలు అనుబంధాలు (1974) * దేశోద్ధారకులు (1973) * ధనమా? దైవమా? (1973) * శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం (1972) * భాగ్యవంతుడు (1971) * జీవిత చక్రం (1971) * రంగేళీ రాజా (1971) * దేశమంటే మనుషులోయ్ (1970) * మళ్ళీ పెళ్ళి (1970) * మారిన మనిషి (1970) * పెత్తందార్లు (1970) * రెండు కుటుంబాల కథ (1970) * ఏకవీర (1969) * మామకు తగ్గ కోడలు (1969) * బంగారు గాజులు (1968) * గోవుల గోపన్న (1968) * గ్రామదేవతలు (1968) * మన సంసారం (1968) * నిలువు దోపిడి (1968) * నిండు సంసారం (1968) * కంచుకోట (1967) * Pallava Sevengal (1967) * కీలు బొమ్మలు (1965) * Prachanda Bhairavi (1965) * ప్రతిజ్ఞా పాలన (1965) * లవకుశ (1963) * వాల్మీకి (1963/I) * టైగర్ రాముడు (1962) * Santhi Nivas (1962) * Pellikani Pillalu (1961) * Abhimanam (1960) * Shantinivasam (1960) * Naradhar Kalyanam (1959) * Sabhash Ramudu (1959) * Shabash Ramu (1959) * Anna Thamudu (1958) * Manchi Manasuku Manchi Rojulu (1958) * Shri Krishna Maya (1958) * Shri Krishna Tulabharam (1955/II) * Pona Machan Thirumbi Vandhan (1954) * Ponni (1953) నటుడిగా * కోకిల (1989) * జేబు దొంగ (1987) * Intlo Ramayya Veedilo Krishnayya (1982) * పెళ్ళి సందడి (1959) * Pakka Inti Ammayi (1953) * Anasuya (1936) (as Master Srinivasa Rao) * Dhruva (1936) (as Master Srinivasa Rao) రచయితగా * Pakka Inti Ammayi (1953) (screen adaptation)

లూరు వెంకట సుబ్బారావు (కలంపేరు చక్రపాణి)

ఆలూరు వెంకట సుబ్బారావు (కలంపేరు చక్రపాణి) ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత మరియు దర్శకులు. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకరు. చక్రపాణి గుంటూరు జిల్లా తెనాలిలో 1908, ఆగష్టు 5న ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో గురవయ్య, వెంకమ్మ దంపతులకు జన్మించారు. జాతీయోద్యమ ప్రభావానికి లోనై హైస్కూలు విద్యకు స్వస్తిచెప్పి యలమంచిలి వెంకటప్పయ్య వద్ద హిందీ భాషను అభ్యసించారు. ఆ సమయంలో హిందీ భాషా వ్యాప్తికి గాఢ కృషిసాగిస్తున్న వ్రజనందన వర్మ దగ్గర హిందీ భాషలో చక్కని పాండిత్యాన్ని గడించారు. 'చక్రపాణి' అనే కలం పేరును వీరికి అతనే ప్రసాదించారు. తరువాత స్వయంకృషితో సంస్కృతం, ఇంగ్లీషు భాషలలో గాఢ పరిచయాన్ని పొందారు. క్షయ వ్యాధిగ్రస్తుడై 1932లో మదనపల్లి లోని శానిటోరియంలో వైద్యం కోసం వెళ్ళారు. అక్కడే కొన్ని నెలలు ఉండి, ఒక సాటి రోగి అయిన ఒక పండితుని సాయంతో బెంగాలీ భాష కూడా నేర్చుకొన్నారు. నేర్చుకొన్న తరువాత బెంగాలీ నవలలను తెలుగులోకి అనువదించడం మొదలు పెట్టారు. ముఖ్యంగా శరత్‌బాబు నవలలకు ఆయన అనువాదం ఎంతటి నిర్దిష్టం అంటే - శరత్‌బాబు తెలుగువాడు కాడన్నా, ఆ పుస్తకాల మూలం బెంగాళీ అన్నా చాలా మంది నమ్మేవారు కాదు. తరువాత తెలుగులో చిన్న చిన్న కథలు, నవలలు వ్రాయటం మొదలుపెట్టారు. 1940లో ముంబైలోని ఫేమస్ ఫిలింస్ వారి ధర్మపత్ని కోసం వీరు మాటలు రాసారు. బి.ఎన్.రెడ్డి గారు రూపొందిస్తున్న స్వర్గసీమకు మాటలు రాయడానికి చెన్నై వెళ్ళారు. 1949-1950లో నాగిరెడ్డి, చక్రపాణి కలవడం, కలసి విజయా ప్రొడక్షన్స్ ను స్థాపించి, సినిమాలు తీయాలని నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి వాహినీ స్టుడియోలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 35 చలనచిత్రాలను రూపొందించారు. ఇద్దరూ కలసి షావుకారు, పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు లాంటి అజరామరమైన సినిమాలు తీశారు. సినిమాలే కాక చక్రపాణి గారు నాగిరెడ్డిగారితో కలసి పిల్లల కోసం చందమామ కథల పుస్తకం ప్రారంభించారు. 1934-1935లో కొడవటిగంటి కుటుంబరావుతో కలసి తెనాలిలో యువ మాసపత్రికను మంచి అభిరుచిగల తెలుగు పాఠకుల కోసం ప్రారంభించారు. 1960లో దీనిని హైదరాబాదుకు తరలించారు. వీరు సెప్టెంబరు 24, 1975 సంవత్సరంలో పరమపదించారు. విషయ సూచిక * 1 చిత్ర సమాహారం o 1.1 రచయితగా o 1.2 నిర్మాతగా o 1.3 దర్శకుడిగా చిత్ర సమాహారం రచయితగా * స్వయంవర్ (1980) (story) * శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976) (writer) * జూలీ (1975) (screen adaptation) * Gundamma Katha (1962) (story) * Manithan Maravillai (1962) (screen adaptation) * Rechukka Pragatichukka (1959) (screen adaptation) * Appu Chesi Pappu Koodu (1958) (adaptation) * Maya Bazaar (1957/II) (screen adaptation) * Missamma (1955) (writer) * Missiamma (1955) (writer) * Chandraharam (1954) (writer) * Pelli Chesi Choodu (1952) (writer) * Shavukaru (1950) (writer) * Swargaseema (1945) (dialogue) (story) * Dharmapatni (1941/I) (dialogue) * Dharmapatni (1941/II) (dialogue) [మార్చు] నిర్మాతగా * శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976) (producer) * జూలీ (1975) (producer) (as B. Nagi Reddi-Chakrapani) * గంగ మంగ (1973) (producer) * రామ్ ఔర్ ష్యామ్ (1967) (producer) * గుండమ్మ కథ (1962) (producer) * మనిదన్ మారవిల్లై (1962) (producer) * రేచుక్క పగటిచుక్క (1959) (producer) * అప్పుచేసి పప్పుకూడు (1958) (producer) * మాయా బజార్ (1957/I) (producer) * మిస్సమ్మ (1955) (producer) * చంద్రహారం (1954) (producer) * పెళ్ళి చేసి చూడు (1952) (producer) * పాతాళ భైరవి (1951) (producer) * షావుకారు (1950) (producer) [మార్చు] దర్శకుడిగా * శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ (1976) * అరస కత్తలి (1967) * మనిదన్ మారవిల్లై (1962)

ఘంటసాల బలరామయ్య

ఘంటసాల బలరామయ్య సుప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకులు. నాటకరంగంలో ప్రసిద్ధులైన వీరి సోదరులు రాధాకృష్ణయ్య గారి ప్రోత్సాహంతో వీరికి రంగస్థల అనుభవం కలిగింది. అన్నదమ్ములిద్దరూ 1933లో కలకత్తా వెళ్ళి చిత్రరంగంలొ అడుగుపెట్టారు. వీరు శ్రీరామా ఫిల్మ్స్, కుబేరా పిక్చర్స్ అనే కంపెనీలు పెట్టి 1936లో సతీ తులసి, 1938లో మార్కండేయ మరియు 1940లో మైరావణ చిత్రాల్ని నిర్మించారు. 1940లో ప్రతిభా పిక్చర్స్ సంస్థను నెలకొల్పి పార్వతీ కళ్యాణం సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. తరువాత కాలంలో చిత్ర నిర్మాణం మరియు దర్శకత్వం రెండు నిర్వహిస్తూ గరుడ గర్వభంగం (1943), సీతారామ జననం (1944), ముగ్గురు మరాఠీలు (1946), బాలరాజు (1948), శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి మరియు చిన్న కోడలు (1952) మొదలైనవి తయారుచేశారు. 1944లో నిర్మించిన సీతారామ జననం చిత్రం ద్వారా వీరు అక్కినేని నాగేశ్వరరావు మరియు అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు లను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. 1048లో నిర్మించిన బాలరాజు సినిమా సాటిలేని విజయాన్ని వీరికి అందించింది. తోటివారిలో పోటీపడి శ్రీ లక్ష్మమ్మ కథ చిత్రాన్ని కేవలం 19 రోజులలో నిర్మించి విడుదల చేశారు. వీరు అందరూ అభివృద్ధి చెందాలని, సుఖంగా జీవించాలని కోరుకొనేవారు. ఎన్నో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో వీరు పాల్గొన్నారు. తెలుగు సినీ రంగానికి వెలలేని సేవలందించిన వీరు 1954 లో గుండెపోటుతో పరమపదించారు.

గౌతమ్ ఘోష్

గౌతమ్ ఘోష్ ప్రఖ్యాత భారతీయ సినిమా దర్శకుడు; మంచి ఫోటో జర్నలిస్ట్ కూడా. అతడు 1950 వ సంవత్సరంలో కోల్‌కతా లో జన్మించాడు. [మార్చు] సినిమా ప్రస్థానం గౌతమ్ ఘోష్ కలకత్తా యునివర్సిటీ నుండి పట్టా పొంది, సినిమాలలో ప్రవేశించాడు. ఆయన మొదటి సినిమా- మా భూమి, తెలుగులో తీసింది. 1930 - 1948 ప్రాంతంలో, హైదరాబాదు నిజాం కు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన సినిమా ఇది; ఎన్నో రోజులు తెలుగు నాట ఆడింది. అతని సినిమాలన్నీ సామాజిక స్థితిగతులనే ప్రతిబింబిస్తుంటాయి. [మార్చు] ముఖ్యమైన సినిమాలు * మా భూమి ( 1979 ) * దఖల్ ( 1981 ) * పార్ ( 1984 ) * అంతర్జలి జాత్రా ( 1987 ) * పద్మ నాదిర్ మఝి ( 1992 ) * పతంగ్ ( 1993 ) * గుడియా ( 1997 ) * అబర్ అరణ్యె ( 2003 ) * యాత్రా ( 2006 ) * కాల్ బేలా ( 2009 ) * సంగెమీల్ సె ములాఖత్ ( షెహనాయ్ విద్వాంసుడు, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పై తీసిన డాక్యుమెంటరీ )

గూడవల్లి రామబ్రహ్మం

గూడవల్లి రామబ్రహ్మం (1902, జూన్ 24 - 1946, అక్టోబర్ 1) ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు సంపాదకుడు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు.హేతువాది . విషయ సూచిక * 1 జీవిత విశేషాలు * 2 ప్రజామిత్ర * 3 సినిమా జీవితం * 4 మాలపిల్ల * 5 రైతుబిడ్డ * 6 తీసిన సినిమాలు * 7 ఇతర వివరాలు * 8 మూలాలు * 9 బయటి లింకులు జీవిత విశేషాలు 1902 వ సం.లో కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలములోని నందమూరు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు గూడవల్లి వెంకయ్య - బాపమ్మ లకు కలిగిన ఆరుగురు పిల్లలలో రామబ్రహ్మం చిన్నకొడుకు. తొలి తెలుగు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కూడా ఈ గ్రామంలోనే జన్మిచాడు. రామబ్రహ్మం చదువు ఇందుపల్లి, గుడివాడ, బందరు లలో సాగింది. ఆయనకు 18 ఏళ్ళ వయసులో (1920)లో ఇందుపల్లి గ్రామానికి చెందిన కోగంటి నాగయ్య కుమార్తె శారదాంబ తో వివాహం జరిగింది. తర్వాత ఆయన చదువు మానేసి తన మామగారింట్లో విదేశీ వస్త్రాలను దహనం చేసి సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. 1924 లో ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక స్టేషనరీ షాపు ప్రారంభించాడు. అయితే ఆ షాపు వ్యాపారానికి బదులుగా రచయితలు, కళాకారుల సమావేశాలకు, చర్చలకు ఒక మంచి కేంద్రంగా తయారయింది. దాంతో వ్యాపారం తగ్గిపోయి 1930 లో మూసివేయవలసి వచ్చింది. ఆయన 1931 లో అఖిలాంధ్ర రైతు మహాసభ ను ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడి హోదాలో నిర్వహించాడు. 1934 లో ఆంధ్ర నాటక పరిషత్ చతుర్థ సమావేశాలకు కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. దీనికి నాట్యకళ ప్రపూర్ణ బళ్ళారి రాఘవ అధ్యక్షులు. ఆయన కమ్మ కుల చరిత్ర అనే పుస్తకం వ్రాశాడు. ఆ పుస్తకం వ్రాయడం కోసం కమ్మ కులం గురించి అవసరమైన సమాచారం సేకరించడానికి కడపకు వెళ్ళాడు. అక్కడ ఆయన గండికోట పట్ల ఆకర్షితుడై ఆ కోట గురించి పరిశోధన చేసి 'గండికోట పతనం' అనే నాటకం వ్రాశాడు. ఈ నాటకం అనేక నగరాల్లో ప్రదర్శించబడి మంచి ప్రజాదరణ పొందింది. ప్రజామిత్ర ఆయన మద్రాసు నుంచి 'ప్రజామిత్ర' వారపత్రికను పదేళ్ళ పాటు నడిపాడు. ఆ రోజుల్లో మద్రాసుకు వెళ్ళే తెలుగు రచయితలు, కళాకారులకు ప్రజామిత్ర ఆఫీసే సమావేశ ప్రదేశమైంది. అంతవరకు రాజకీయ పత్రికగా నడిచే ప్రజామిత్రను సంగీత, సాహిత్య, నాటక, చిత్రకళా వ్యాసాలతో ఒక అపురూపమైన పత్రికగా రామబ్రహ్మం తీర్చిదిద్దారు. ఆయన ప్రజామిత్ర లోనే కాక సమదర్శిని, వాది లాంటి ఇతర పత్రికల్లో కూడా ఆర్టికల్స్ వ్రాశాడు. సముద్రాల రాఘవాచార్య, కుర్రా సుబ్బారావులు ఇతనికి సహాయపడుతుండేవారు. నార్ల వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రభలో చేరక మునుపు 1937లో ఇతనికి సహాయ సంపాదకునిగా పనిచేశారు. ఆ తరువాత ఆండ్ర శేషగిరిరావు, ముద్దా విశ్వనాథం, బోయి భీమన్నలు కూడా పత్రికా సహాయ సంపాదకులుగా పనిచేశారు. తాపీ ధర్మారావు, వేలూరి శివరామశాస్త్రి, త్రిపురనేని గోపీచంద్ మొదలైన వారు సాహిత్య వ్యాసాలు రాసేవారు. సంఘాన్ని నిష్కర్షగా విమర్శించి సంచలనం కలిగించే రచనలతో పత్రిక సాగించాలి. అపూర్వ విషయాలతో పత్రిక విజ్ఞాన సర్వస్వం అనిపించుకోవాలి అనే లక్ష్యాలతో రామబ్రహ్మం సమర్ధులైన రచయితల సహకారంతో పత్రికను నిర్వహించేవారు. సినిమా జీవితం ఆయన ఆసక్తి సినిమాల మీదకుమళ్ళాక ఆయన పత్రికారంగాన్ని వదిలి పెట్టి సారథిచిత్ర అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఆయన 1934లో తీసిన శ్రీ కృష్ణ లీలలు చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర వేయించడం కోసం రామబ్రహ్మం, నిర్మాత పి.వి.దాసు కలిసి రాజేశ్వర రావు అనే నటుడిని బెంగుళూరు నుంచి తీసుకు వచ్చారు. తర్వాత 1936లో విడుదలైన ద్రౌపదీ వస్త్రాపహరణం సినిమాలో కూడా ఆయన పని చేశాడు. ఈ అనుభవాలతో చిత్రనిర్మాణ కళ తనకు పట్టుబడిన తర్వాత, పౌరాణిక చిత్రాల జోరులో కొట్టుకుని పోతున్న జనం అభిరుచులను మార్చడానికి సాహసించి సఫలుడైన ధీశాలి గూడవల్లి. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం మాలపిల్ల ఆయన తీసిన తదుపరి చిత్రం. సారథిచిత్ర బ్యానర్ మీద రామబ్రహ్మం నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా 1938 లో విడుదలైంది. మాలపిల్ల దక్షిణాది రాష్ట్రాల్లో బ్రాహ్మణేతరుల ఆత్మగౌరవ సంరక్షణ ఉద్యమంతో బాటు గాంధీజీ హరిజనోద్ధరణ ఉద్యమం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యం లో రామబ్రహ్మం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మాలపిల్ల చిత్రాన్ని ఉన్నత ప్రమాణాలతో నిర్మించాడు. అసలు సిసలు సామాజిక ప్రయోజనం గల చిత్రంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన చిత్రం మాలపిల్ల.జస్టిస్ పార్టీ వారి సమదర్శిని తో బాటు ప్రజామిత్ర పత్రికకూ సంపాదకుడైన రామబ్రహ్మం పత్రికల కన్నా సినిమాయే శక్తివంతమైన ప్రచార సాధనమని గుర్తించి ఊపిరిపోసిన చిత్రమిది. ఆనాడు దేశాన్ని పట్టి ఊపేస్తున్న హరిజనోద్యమాన్ని రామబ్రహ్మం తన సినిమాకు ఇతివృత్తంగా తీసుకుని,గుడిపాటి వెంకటచలం తో కథారచన చేయించాడు. ఈ సినిమాకు తాపీ ధర్మారావు సంభాషణలు వ్రాశాడు.చలం, ధర్మారావు ఇద్దరూ ఆనాటి సమాజంలో చలామణి అవుతున్న అర్థం లేని ఆచారాలను అపహాస్యం చేసిన వారే.మాలపిల్ల చిత్రం లోని పాటలకు భావకవి బసవరాజు అప్పారావు కావ్యగౌరవం కల్పించాడు.ఇందరు ప్రముఖుల సౄజనాత్మక భాగస్వామ్యంతో తయారైన మాలపిల్ల తెలుగు నాట అఖండ విజయం సాధించింది.జస్టిస్ పార్టీ నేతృత్వంలో 1920వ దశాబ్దంలో బ్రాహ్మణేతరుల ఆత్మగౌరవ సంరక్షణ ఉద్యమం జోరుగా నడిచిన ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం ఘన విజయం సాధించింది. మాలపిల్ల చిత్రం కాంచనమాలను సూపర్ స్టార్ ను చేసింది. పౌరాణిక చిత్రాల జోరులో ప్రప్రథమంగా ఒక సమకాలీన సమస్యను ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన ఈ చిత్రం అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు భాషాప్రాంతాల్లోనే గాక ఇతర భాషా ప్రాంతాల్లో కూడా పెద్ద హిట్. నాటి గాయని, నటి సుందరమ్మతో కలిసి ఆమె పాడిన నల్లవాడే గొల్లపిల్లవాడే సూపర్ హిట్ అయింది.అప్పటికింకా భాషాదురభిమానం తలెత్తక పోవడంతో దక్షిణభారతమంతటా ఆ పాట జనం నాలుకలపై నర్తించింది. ఆ నాటి సమాజంలో ఈ సినిమా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా తెలుగునాట కరపత్రాల పంపిణీ జరిగింది. అప్పట్లో బెజవాడలో జరిగిన ఒక 'నిరసన మహాసభ ' బ్రాహ్మణులు మాలపిల్లను చూడరాదని తీర్మానించింది.అయినా దొంగచాటుగా ఆ సినిమాను చూసి వచ్చిన యువబ్రాహ్మణులకు తల్లిదండ్రులు వీధిలోనే శుద్ధి స్నానం చేయించి గానీ ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. రామబ్రహ్మం కూడా "మాలపిల్ల ను చూడడానికి వచ్చే పిలక బ్రాహ్మణులకు టికెట్లు ఉచితం" అంటూ అగ్రహారాలలో కరపత్రాలు పంచాడు. ఆయన తీసిన తదుపరి చిత్రం రైతుబిడ్డ రైతుబిడ్డ మాలపిల్ల తర్వాత జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతుబిడ్డ తీసి రామబ్రహ్మం తన సాహస ప్రవృత్తిని మళ్ళీ చాటుకున్నాడు. 1925 లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఛత్రం క్రింద జాగృతులైన సన్నకారు రైతులు తమ హక్కుల సాధనకు నడుం కట్టారు. 1937లో మద్రాసులో కాంగ్రెసు ప్రభుత్వం నియమించిన కమిటీ ఒకటి భూమికి యజమాని రైతేనని తీర్మానించింది. ఈ చారిత్రక నేపథ్యంలో రామబ్రహ్మం రైతుబిడ్డను నిర్మించాడు. ఈ సినిమాకు రామబ్రహ్మం స్వయంగా కథ సమకూర్చగా త్రిపురనేని గోపీచంద్ మాటలు వ్రాశాడు. కొసరాజు పాటలు వ్రాయగా, జమీన్ రైతు ఉద్యమంలో నెల్లూరు వెంకట్రామానాయుడు వ్రాసిన గీతాలను కూడా ఈ సినిమాలో వాడుకున్నారు. సంగీత దర్శకుడు బి.నరసింహారావు. ఈ సినిమాకు వ్యతిరేకత సనాతన వర్గాలకంటే బలంగా జమీందార్ల నుంచి ఎదురైంది. మాలపిల్లను ప్రభుత్వం నిషేధించలేదు. కానీ జమీందార్లు రైతుబిడ్డ సిన్మాను ప్రభుత్వం చేత నిషేధింపజేయగలిగారు. ఇంకో విచిత్రమేమిటంటే జమీందార్ల ఘాతుకాలను నిరసించిన ఈ సినిమాను నిర్మించినది ఒక జమీందారు. ఈ చిత్ర నిర్మాత అయిన చల్లపల్లి రాజా జమీందార్ల పార్టీ అయిన జస్టిస్ పార్టీలో ఒక వర్గానికి నాయకుడు. పార్టీ లో ఆయన ప్రత్యర్థి వర్గానికి నాయకుడైన మీర్జాపురం రాజా ఈ చిత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, తిరోగమన ధోరణిలో అనేక జానపద, పౌరాణిక చిత్రాలను నిర్మించాడు. రైతుబిడ్డ చిత్రాన్ని జమీందార్ల ఒత్తిడిపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించినా ఆ చిత్రం ప్రతిబింబించిన స్ఫూర్తి కాలక్రమంలో విజయం సాధించింది. 1955లో విడుదలై ఘనవిజయం సాధించిన రోజులు మారాయి చిత్రాన్ని రైతుబిడ్డకు కొనసాగింపు అనుకోవచ్చు. ఇటువంటి చిత్రాల ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైన కోస్తా రైతాంగ చైతన్యం కాలక్రమంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి వెన్నుదన్నుగా నిలిచింది. కులవ్యవస్థ నిర్మూలన సందేశం ఇవ్వడం కోసం కూడా రామబ్రహ్మం నడుం కట్టాడు. పల్నాటి బ్రహ్మనాయుడు పాత్ర ద్వారా ఈ సందేశాన్ని ఇవ్వడానికి పల్నాటి యుద్ధం సినిమా తీశాడు. తీసిన సినిమాలు మాలపిల్ల(1938) నిర్మాత మరియు దర్శకుడు రైతుబిడ్డ(1939) రచయిత మరియు దర్శకుడు ఇల్లాలు(1940) దర్శకుడు అపవాదు(1941) దర్శకుడు పత్ని(1942) దర్శకుడు పంతులమ్మ(1943) దర్శకుడు మాయలోకం(1945) దర్శకుడు పల్నాటి యుద్ధం(1947) దర్శకుడు అభ్యుదయమే ఊపిరిగా జీవించిన సాహసి రామబ్రహ్మం కాగా ఈ వారసత్వాన్ని కొనసాగించిన ధీరుడు బి.ఎన్.రెడ్డి. "రామబ్రహ్మం, బి.ఎన్.రెడ్డి తమకున్నలాంటి సంస్కృతే ప్రేక్షకులకు ఉన్నట్లుగా భావించేవారు తప్ప వారిని వెర్రివెంగళప్పలుగా చూడలేదు." -కొడవటిగంటి కుటుంబరావు. ఇతర వివరాలు * రామబ్రహ్మం 1942-43 మరియు 1944-45 సంవత్సరాలలో రెండు సార్లు దక్షిణ భారత ఫిలిం వాణిజ్యమండలి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. * రామబ్రహ్మానికి మధుమేహం వ్యాధి ఉన్నది. పల్నాటి యుద్ధం భారీ సినిమా నిర్మాణ సమయంలో (1946) హఠాత్తుగా అతనికి పక్షవాతం వచ్చింది. ఎన్ని మందులు వాడినా వ్యాధి తగ్గకుండా అక్టోబరు 1న కాలధర్మం చేశారు. * విజయవాడలో ఈడ్పుగంటి లక్ష్మణరావు కార్యదర్శిగా, అక్కినేని నాగేశ్వరరావు గౌరవాద్యక్షునిగా 'గూడవల్లి రామబ్రహ్మం సినీ కళాసాగర్' అనే సంస్థను స్థాపించి సుమారు పది సంవత్సరాలు నాటక, సినీ రంగాలకు సేవచేశారు. * తెనాలిలో రామబ్రహ్మం 30వ వర్ధంతి సందర్భంగా 1976 అక్టోబరులో 'రామబ్రహ్మం సంస్మరణ సంఘం' ఏర్పడి అతనితో సాన్నిహిత్యం ఉన్న ప్రముఖులతో విలువైన వ్యాసాలు రాయించి 'స్మారక సంచిక'ను ప్రచురించారు. * విజయవాడ గాంధీనగర్ లోని అలంకార్ సెంటర్ లో రామబ్రహ్మం కాంస్య విగ్రహాన్ని 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ఆవిష్కరించారు. మూలాలు * శ్రీ గూడవల్లి రామబ్రహ్మం, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, శ్రీ గాయత్రి ప్రింటర్స్, తెనాలి, 2004.