skip to main |
skip to sidebar
ఓ నిముషము నిర్లక్ష్యము ఖరీదు........? ఓ నిముషము నిర్లక్ష్యము ఖరీదు........? జూలియస్ సీజర్ అనే పరాక్రమశాలి 800 పట్టణములను జయించి, ఒక మిలియన్ మంది శత్రువులను చంపి వారి రక్తములో తన వస్త్రాలను ఉతుక్కొన్నాడు.అయితే తన విజయోత్సవ ఉచ్చ స్తితిలో నిందినవాడై, తనకు అందించబడిన ముఖ్యమైన సమాచారమును చదువుటకు సమయమివ్వలేక పోయడు. రోమా పార్లమెంటుకు భవనానికి వెల్లుతున్న అతనికి పార్లమెంటు మెట్ల దగ్గర ఓ శత్రువు అతనిని చంపుటకు పొంచియున్నాడు అన్న సమాచారమును ఓ సైనికుడు అందించాడు. అయితే సభకు ఆలస్యం అవుతుందనుకున్న సీజర్ ఆవుత్తరమును చదువుటకు సమ్యమివ్వలేక పోయెను.ఆ వుత్తరమును బెల్టుకింద పెట్టుకొని వెల్లాడు. ఆ వుత్తరం తన ప్రాణమును కాపాడుతుందనుకొలేదు. యధావిధిగా వచ్చిన సీజర్ను శత్రువు మెట్లదగ్గర కత్తితో పొడిచి చంపాడు. చుశారా! ఒక్క నిమిశము సమయము వెచ్చించి ఆ వుత్తరమును చదివి వుండి వుంతె అతను తన ప్రాణమును కాపాడుకొనె వాడు. ఈనాడు అనేకులు సమయం లేదంటు నిర్లక్ష్యముగా వుంటున్నారు.