Rss Feed

వ్యూ ప్రమ్ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్



ముగ్గురు ఆప్ఘన్ మహిళల జీవితాల నేపధ్యంలో 30 సంవత్సరాల ఆప్ఘనిస్తాన్ చరిత్రను పరామర్శిస్తూ మీనా నాన్జి వ్యూ ప్రమ్ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్ అనే అద్భుతమైన డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశారు. దీన్ని తెలుగులో "ఇసుక తిన్నెలమీంచి చూసినప్పుడు" అని పిలిస్తే అర్థవంతంగా ఉంటుంది.

ఆప్ఘనిస్తాన్ గురించి ఎవరు ఆలోచించినా అక్కడి మహిళల దుస్థితే మొదటగా మనసులోకి వస్తూంటుంది. ఆప్ఘన్ మహిళల ప్రస్తుత పరిస్థితి ఏమిటి... వాళ్ల జీవితాలు ఇప్పుడెలా ఉన్నాయి... కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి పరిస్థితి నిజంగా మెరుగుపడిందా... వాళ్లకు నిజమైన హక్కులు ప్రస్తుతం ఉన్నాయా.. లేదా ఇప్పటికీ వారు భయం, అణచివేత నేపధ్యంలోనే బతుకుతున్నారా.. ఇలా అనేక ప్రశ్నలు పొడుచుకుని వస్తుంటాయి.
ఇసుక తిన్నెల మీదనుంచి...
30 సంవత్సరాల క్రమంలో యుద్ధంతో ఛిన్నాభిన్నమైన ఆప్ఘనిస్తాన్ ఆకాశంలో సగభాగం దుర్భరస్థితిని, మనోధైర్యాన్ని సజీవంగా చిత్రించిన ఈ లఘుచిత్రం "వ్యూ ప్రమ్ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్" పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో లెక్కలేనన్ని అవార్డులు దక్కించుకుంది.


"ఇసుక తిన్నెల మీదనుంచి చూసినప్పుడు" అనే అర్థం గల ఈ సినిమా ముగ్గురు ఆప్ఘన్ మహిళల కళ్లలోంచి ఈ సమస్యలను పట్టి పరిశీలిస్తుంది. వారు ఓ డాక్టర్, ఓ టీచర్, ఓ హక్కుల కార్యకర్త. అంతర్జాతీయ శక్తులు పురికొల్పిన యుద్ధాల ద్వారా ఆప్ఘనిస్తాన్‌లో మూడు వేరువేరు ప్రభుత్వాల హయాంలో తమ జీవితాలు ఎంత హింసాత్మకంగా మారిందీ ఈ ముగ్గురు మహిళలూ కళ్లకు కట్టినట్లుగా చూపిస్తారు.

ఈ హింసా కొనసాగింపులో వారి జీవితాలు కదిలిపోయినప్పటికీ, తమ ఇళ్లు, తమ దేశం సైతం ధ్వంసం అయిపోయినప్పటికీ, ఈ ముగ్గురు మహిళలూ మొక్కవోని ధైర్యసాహసాలతో, చెరగని విశ్వాసంతో తమ చుట్టూ ఉన్న ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి తమ పనిలో కొనసాగుతున్న వైనాన్ని ఈ డాక్యుమెంటరీ చిత్రం అత్యద్భుతంగా చిత్రించింది.

వాయవ్య పాకిస్తాన్‌లోని శరణార్థి శిబిరాలలో, తర్వాత యుద్ధంతో ఛిన్నాభిన్నమైన కాబూల్ నగరంలో గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న పరిస్థితుల వివరణతో ప్రారంభమయ్యే ఈ చిత్రం గత 30 సంవత్సరాలుగా అంటే రాజు జహీర్ షా పాలన నుంచి మొదలై ప్రస్తుత హమీద్ కర్జాయ్ ప్రభుత్వం వరకు ఆప్ఘన్ మహిళల భయానకమైన, ఆలోచనలను రేకెత్తించే దుర్భర జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

కొనసాగుతున్న పోరాటంలో ఈ మహిళలు తమ శక్తినంతటినీ కూడదీసుకుని ఎలా నిలబడుతున్నారో ఈ చిత్రం అతి స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పటికీ విభజించబడిన, పైశాచిక స్థితికి వెళ్లిన ఆప్ఘన్ జాతీయ చిత్రణను ఈ చిత్రం చూపరులను హత్తుకునేలా చూపించింది.

మొత్తం ప్రపంచం ఇప్పుడు మరో సంక్షోభం మీద దృష్టి పెడుతున్న నేపధ్యంలో, ఈ డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ ఆప్ఘనిస్తాన్‌పై కెమెరాను సారించి ఆప్ఘన్‌లో జీవన సంఘర్షణలో మునిగి తేలుతున్న మహిళల విలువైన స్వరాలను ప్రపంచానికి గుర్తు చేస్తోంది.

30 సంవత్సరాల క్రమంలో యుద్ధంతో ఛిన్నాభిన్నమైన ఓ జాతిలో సగభాగం దుర్భరస్థితిని, మనోధైర్యాన్ని సజీవంగా చిత్రించిన ఈ లఘుచిత్రం "వ్యూ ప్రమ్ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్" పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో లెక్కలేనన్ని అవార్డులు దక్కించుకుంది.

చిత్ర దర్శకురాలు మీనా నాన్జి వివరాలు
ఈ చిత్ర దర్శకురాలు మీనా నాన్జి గత పదేళ్లుగా ఫిల్మ్ వీడియోలో పనిచేస్తున్నారు. తన ప్రయోగాత్మక చిత్ర నిర్మాణానికి గాను ఆమె అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. నేషనల్ ఎండోమెంట్ ఫర్ ది ఆర్ట్స్, రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ మీడియా ఫెలోషిప్, ది లాస్ ఏంజెల్స్ కల్చరల్ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్, పాల్ రాబ్సన్ ఫండ్ గ్రాంట్, ఇండిపెండెంట్ ఫిల్మ్ వీడియో ప్రొడక్షన్ గ్రాంట్, వంటి పలు సంస్థలు ఈమె సృజనాత్మక ప్రతిభకు అవార్డులతో సత్కరించాయి.

ఆమె దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో పలు అవార్డులను సాధించాయి. అలాగే అమెరికా, యూరోపియన్ టెలివిజన్లలో పిబిఎస్ స్టేషన్లద్వారా విస్తృత ప్రదర్శనకు నోచుకున్నాయి.


http://www.youtube.com/watch?v=2a9JUh6LtBg

మహాప్రస్థానం' మతలబులు

-

జూన్ పదిహేను మహాకవి శ్రీశ్రీ వర్ధంతి. శ్రీశ్రీ పేరు చెప్పగానే మనకు వెంటనే గుర్తువచ్చేది 'మహాప్రస్థానం'. అర్థ శతాబ్దం పైగా పూర్తి చేసుకున్న, తెలుగు కవిత్వ గతిని పూర్తిగా మార్చేసిన ఈ పుస్తకాన్ని గురించి నేను నోట్ చేసుకుని పెట్టుకొన్న కొన్ని పాఠకులకు ఆసక్తికరంగా ఉంటాయని ఈ క్రింద పొందుపరుస్తున్నాను:

* శ్రీశ్రీ 'మహాప్రస్థానం' గీతం మొట్టమొదట ముద్దుకౄష్ణ నడిపిన 'జ్వాలా పత్రికలో ప్రచురితమైంది ("మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది! పదండి ముందుకు, పదండి ముందుకు,పోదాం, పోదాం పైపైకి!" అని సాగుతుందీ గీతం)

* 'మహాప్రస్థానం' ప్రచురణకు శ్రీశ్రీకి ఆర్థిక సహాయం చేసింది, మచిలీపట్నం వాస్తవ్యుడైన ఆయన మిత్రుడు నళినీకుమార్ (అసలు పేరు ఉండవల్లి సూర్యనారాయణ). మదరాసులో ఉండగా శ్రీశ్రీకి అతడితో పరిచయమైంది.

* 'మహాప్రస్థానం' మొదటి ప్రచురణ 1950 జూన్ లో జరిగింది. ఇప్పటికిది మరో 23 ప్రచురణలు పొందింది (ఇది ఇటీవలే నేను కొన్న 'మహాప్రస్థానం' ప్రతిపైన ఉన్న వివరాల ఆధారంగా ఇచ్చిన సమాచారం. తప్పైతే సవరించండి)

* 'మహాప్రస్థానం' పుస్తకంలో మొత్తం 40 కవితలున్నాయి (కొంపెల్ల జనార్థనరావుకోసం రాసిన అంకిత గీతం కాకుండా)

* 'మహాప్రస్థానం'లోని గేయాలన్నీ 1933-1940 మధ్యకాలంలో రాసినవి ("నిజంగానే" "గర్జించు రష్యా" 1941లో, "నీడలు" 1947లో రాసినవి. అది (1930 దషకం) ఆకలి బాధలు, ఆర్థికమాంద్యం ప్రపంచాన్ని పీడిస్తున్న సమయం. ఈ దషాబ్దాన్ని (1930-40) చరిత్రకారులు "హుంగ్ర్య్ ఠిర్తిఎస్" అని అభివర్ణించారు.

* శ్రీశ్రీ తను ఆ కాలంలో రాసిన గేయాలన్నిటినీ ఈ సంపుటిలో చేర్చలేదు. ప్రపంచవ్యాప్తంగా మానవజాతి ఎదుర్కొంటున్న బాధలు ప్రధానేతివౄత్తంగా ఉండే గేయాల్నే చేర్చాడిందులో.

* శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని లండన్ లో స్థిరపడిన డాక్టర్ గూటాల కౄష్ణమూర్తి 'విదేశాంధ్ర ప్రచురణలా పేరుతో శ్రీశ్రీ సొంత దస్తూరిలో 1981లో విడుదల చేశారు. పుస్తకంతోపాటు శ్రీశ్రీతో స్వయంగా చదివించి రికార్డు చేసిన 'మహాప్రస్థానం' గీతాల క్యాసెట్టును కూడా విడుదల చేశారు. ఈ కౄషి వెనుక పురిపండా అప్పలస్వామి ప్రమేయం చాలా ఉంది.

* "మహాప్రస్థానం అన్న గీతం రాసేనాటికి నాకు మార్క్సిజం గురించి తెలియనే తెలియదు. నేను మార్క్సిజంను తెలుసుకున్నది సాహిత్యం ద్వారానేగాని, రాజకీయాలద్వారా కాదు." అని శ్రీశ్రీ 1970 ఫిబ్రవరిలో "సౄజన" పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు.

* 'మహాప్రస్థానానీకి చలంతో ముందుమాట (యోగ్యతాపత్రం) రాయించటానికి ప్రేరేపకుడు జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి (జరుక్ శాస్త్రి)

* 'మహాప్రస్థానం' సంపుటిలోని 'ప్రతిజ్ఞా గేయానికి మూలం లండన్ అభ్యుదయ రచయితల మానిఫెస్టో. దాని కాపీ ఒకటి అబ్బూరి రామకౄష్ణారావుగారు ఇస్తే అది చదవగానే ఆ స్ఫూర్తితో శ్రీశ్రీ ఈ గేయం రాశారు.

* 'దేశచరిత్రలూ గేయానికి 'జ్వాలా పత్రికలో ముద్దుకౄష్ణ రాసిన ఒక సంపాదకీయం ప్రేరణ (ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం...)

* 'మహాప్రస్థానం' ముందుమాటకి చలం పెట్టిన పేరు 'మహాప్రస్థానానికి జోహార్లూ అని. దాన్ని శ్రీశ్రీ 'యోగ్యతాపత్రం' అని మార్చుకున్నాడు. చలం అనుమతితోనే మరొక మార్పు కూడా చేశాడు. చలం రాసిన ముందుమాటలో 'శ్రీశ్రీ కవిత్వమూ, పాల్ రాబ్సన్ సంగీతమూ ఒకటేరకం అంటుంది సౌరిస్. ఆ రెంటికీ హద్దులూ, ఆజ్ఞలూ లేవు...' అని ఉంటుంది. నిజానికి చలం పాల్ రాబ్సన్ పేరు స్థానంలో 'సైగళ్ అని రాశాడు. సైగల్ పేరు తీసేసి, ఆ స్థానంలో పాల్ రాబ్సన్ పేరును చేర్చాడు శ్రీశ్రీ. పాల్ రాబ్సన్ అమెరికాలోని గొప్ప నీగ్రో గాయకుడు, వామపక్ష అభిమాని.

* శ్రీశ్రీ 'మహాప్రస్థానం' కవితా సంపుటిని హిందీలోకి డాక్టర్ సూర్యనారాయణ 'భానూ అనువదించారు. 1984లో ఇది ప్రచురింపబడింది.

* 'మహాప్రస్థానం'లోని 'చేదుపాటా కవితను జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి చదివి వింపించగా, చలం కన్నీళ్ళు పెట్టుకున్నాడట (ఔను నిజం, ఔను నిజం, ఔను నిజం, నీవన్నది, నీవన్నది, నీవన్నది నిజం, నిజం...)

* ఒక బహిరంగసభలో శ్రీశ్రీ చదివిన 'కవితా ఓ కవితా' అనే గేయాన్ని విష్వనాథ సత్యనారాయణ విని, పులకరించి, లేచి శ్రీశ్రీని కౌగిలించుకుని, ఆ గేయాన్ని నేనే ప్రచురిస్తానని వాగ్దానం చేశాడు. కాకపోతే ఆయన ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాడు (కవితా! ఓ కవితా! నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో...)

* శ్రీశ్రీ 'మహాప్రస్థానం' గేయాల్ని దేవులపల్లి, అడివి బాపిరాజు మొదలైన ప్రముఖులు బహిరంగసభల్లో ఆలాపించిన సందర్భాలు ఉన్నాయి.

* శ్రీశ్రీ తన సాహిత్య ప్రథమ గురువుగా చెప్పుకున్న అబ్బూరి రామకౄష్ణారావుగారు 1956లో తన మహాప్రస్థాన రచనావిధానాన్ని, అందులో ప్రతిపాదించిన సిద్ధాంతాలనూ వెక్కిరిస్తూ, ఖండిస్తూ ఓ కవిత రాశాడు (ఇది కేంద్ర సాహిత్య అకాడెమీ శ్రీశ్రీపై ప్రచురించిన మోనోగ్రాఫ్ లో బూదరాజు రాధాకౄష్ణగారు రాశారు, కాని, ఆ కవిత ఏమిటో చెప్పలేదు. ఎవరైనా సేకరిస్తే బాగుంటుంది)

* కొసమెరుపు - 'మహాప్రస్థానం' గేయాల్ని మొదట 'భారతీ పత్రికకు పంపిస్తే అవి తిరిగొచ్చాయి.

['మహాప్రస్థానం' లోని గీతాలను చాలా తెలుగు సినిమాల్లో ఉపయోగించుకున్నారు. వాటి వివరాలు ఎవరైనా సేకరించి ఉంటే తెలుపగలరు]