Rss Feed

బి.విఠల ఆచార్య

బి.విఠల ఆచార్య లేదా బి.విఠలాచార్య 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు మరియు నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ బాషలలో 70 చిత్రాలను రూపొందించిన ఈయన 1920 జనవరి 28న కర్ణాటకలో ఉడిపిలో జన్మించారు. కొంతకాలం సర్కస్ కంపెనీలో జంతువుల ఆలనా పాలనా చూశారు. ఆయన ఎన్నో జానపద చిత్రాలకు అద్భుతమైన దర్శకత్వం వహించారు. అప్పటి పరిమితమైన సాంకేతిక పరిజ్ఙానముతో ఆయన చూపించిన ప్రతిభ అసామాన్యమైనది. చాలా కొద్ది ఖర్చుతో ఆయన కనులకింపైన జానపద కళా ఖండాలను రూపొందించారు. 1942 లో చిత్రరంగ ప్రవేశము చేసిన ఈయన నిర్మాతగా డి.శంకర్ సింగ్ తో కలిసి దాదాపు 18 చిత్రాలను తమ మహాత్మా పిక్చర్స్ పతాకముపై నిర్మించారు. వీటిలో సాంఘీక చిత్రాలే అధికము. ఆ తరువాత తొలిసారిగా తెలుగులో 1953లో షావుకారు జానకి ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికి దర్శకత్వము వహించాడు. క్రమంగా తెలుగులో నిర్మాతగా, దర్శకునిగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలను తీశాడు. ఈయన దర్శకత్వము వహించిన చిత్రాలలో 15 చిత్రాలు నందమూరి తారక రామారావు నటించినవే అందులో 5 చిత్రాలను విఠలాచార్యే స్వయంగా నిర్మించాడు. జానపదబ్రహ్మ 1999 మే 28 న 80 యేళ్ల వయసులో మద్రాసులోని తన స్వగృహములో కన్నుమూశారు. ఈయనకు ఒక భార్య, నలుగురు కుమారులు మరియు నలుగురు కుమార్తెలు కలరు. విషయ సూచిక [ ఆయన దర్శకత్వము వహించిన కొన్ని సినిమాలు * కనకదుర్గ పూజా మహిమ * ఆలీబాబా 40 దొంగలు * నిన్నే పెళ్ళాడుతా * కన్యాదానం * భలే మొనగాడు * అగ్గిబరాటా * లక్ష్మీ కటాక్షం * చిక్కడు దొరకడు * విజయం మనదే * బందిపోటు * జగన్మోహిని * రాజకోట రహస్యం కొన్ని విశేషాలు [1] ఎన్‌.టి.రామారావు, కాంతారావు‌లిద్దరికీ ‘మాస్‌ ఫాలోయింగ్‌’ తెచ్చింది విఠలాచార్య చిత్రాలే. వీటిలో నటీనటులే కాకుండా, పక్షులూ, జంతువులూ కూడా పాత్రధారులు. ‘ట్రిక్‌వర్క్‌’కి ఆయన చిత్రాలు ప్రాధాన్యం కల్పించేవి. ‘లాజిక్‌’ అక్కర్లేదు, ‘అదెందుకు జరిగింది?’ అని అడగడానికి లేదు. ‘ఏమీ అక్కర్లేదు. ప్రేక్షకుల్ని ఆహ్లాదపరచడమే ముఖ్యం. ఇది ‘కమర్షియల్‌ ఆర్ట్‌’ అనబడే సినిమా. మన ప్రేక్షకులు క్లాస్‌ సినిమాలు చూడరు. మాస్‌ చిత్రాలు అనబడేవాడినే ఎక్కువగా చూస్తారు. అందుకే అవే ఎక్కువగా తీశాను. ‘తక్కువ ఖర్చు పెట్టి, ఎక్కువ లాభం పొందాలి’ అన్న సూత్రం కూడా నమ్ముకున్నాను’ అని విఠాలాచార్య చెప్పేవారు. సినిమా నిర్మాణంలో ‘పొదుపు’ ఎలా చెయ్యాలి? అన్న దారి చూపించిన వ్యక్తి కూడా ఆయనే. ఒకే పెద్ద మందిరం సెట్టు వేస్తే, దాన్నే రకరకాల సెట్లుగా మార్చేవారు ఆయన. అంత:పురం రాజుగారి రహస్యమందిరం, విలన్‌ ఇల్లూ, ఇంకొక రాజుగారి ఇల్లూ - అన్నీ ఒకే ఒక సెట్లో ఇమిడిపోయేవి. సామాన్య జనానికీ, సినిమా చూట్టంలో లీనమైపోయే ప్రేక్షకులకీ ఈ తేడాలు అక్కర్లేదని విఠలాచార్య విశ్వసించేవారు. అలాగే కాస్ట్యూమ్స్‌, ఆభరణాలూ, ప్రతి సినిమాకీ మార్చవలసిన అవసరం లేదు ముఖ్యపాత్రకి తప్ప. ‘నటీనటుల కాల్‌ షీట్లు గల్లంతైతే, వాళ్లని చిలకలుగానో, కోతులుగానో మార్చడం ఆయనకే చెల్లింది’ అని ఒక సందర్భంలో కాంతారావు చెప్పారు. విఠలాచార్య ఎంతో దక్షతా, బాధ్యతా గల నిర్మాత. నటీనటులకీ, టెక్లీషియన్లకీ తాను ఇస్తానన్న మొత్తాన్ని విభజించి ప్రతినెలా ఒకటో తేదీకల్లా - చిన్నా, పెద్దా అందరికీ చెక్కులు పంపించేసేవారు. ఏది వచ్చినా రాకపోయినా విఠలాచార్య గారి చెక్కు వచ్చేస్తుందన్న నమ్మకం అందరికీ వుండేది. ఈ విధానం అరుదు! అలాగే నటీనటులకి కాల్‌ షీట్స్‌ అడ్జస్ట్‌ చెయ్యడంలో కూడా ఆయన ‘నంబర్‌వన్‌’ అనిపించుకునేవారు. ముందుగా చెబుతే, ఒప్పుకున్న డేట్స్‌ని అటూ, ఇటూగా మార్చి చిన్న, పెద్ద నటీనులందిరికీ, సహాయపడేవారు. వేషాలకోసం ఆఫీసులకి వెళ్తే సాధారణంగా డైరెక్టర్లు, నిర్మాతలూ వాళ్లని చూసేవారు కాదు. మేనేజర్‌ అడ్రస్‌ తీసుకుని పంపేస్తాడు. విఠలాచార్య అలా కాదు. వచ్చిన ప్రతీవాళ్లనీ తన గదిలోకి పిలిచి, కూచోబెట్టి కాఫీ ఇచ్చి మాట్లాడి పంపించేవారు. ఈ విధానం కూడా అరుదే. స్క్రిప్టు ముందు రాయించుకుని, షెడ్యూల్సు వేసుకుని టైముకి ముందుగానే షూటింగ్‌ పూర్తిచేసి, అనుకున్న తేదీకి సినిమా విడుదల చెయ్యడం ఆయనకే చెల్లింది. సినిమా ఆరంభించకముందే - విడుదల తేదీ ఇవ్వడం ఎంతమందికి సాధ్యం? సినిమా పరిశ్రమలో ఇదికూడా అరుదే! ఇలాంటి అరుదైన వాటిని అమలుపరిచిన విఠలాచార్య జానపద చిత్రాలకి ఆదరణ తగ్గుతోందన్న ఆలోచనలో అక్కినేని నాగేశ్వరరావుతో ‘బీదల పాట్లు’ తీశారు. తన టెక్నీషియన్లందరినీ మార్చి, నటీనటుల్నీ మార్చి మంచి క్వాలిటీతో చిత్రం రావాలని - కృషి చేసి తీశారు. తన విధానానికి భిన్నంగా తీశారు. ‘చిత్రం ఉత్తమంగా వుంది’ అని అందరూ ప్రశంసించారు. కాని డబ్బు రాలేదు. ‘విఠలాచార్య సినిమా ఇలావుందేమిటి?’ అన్నారంతా. ‘నా పేరు కాకుండా ఇంకొకరి పేరు వేసివుంటే బాగా నడిచేదేమో!’ అని వ్యాఖ్యానించారు విఠలాచార్య. ‘ఏది అలవాటు చేస్తే ఆ ధోరణిలో వెళ్లడమేశ్రేయస్కరం’ అన్నది ఆయన చెప్పిన నీతి.

బాలు మహేంద్ర

బాలు మహేంద్ర (Balu Mahendra) (జ: జనవరి 1, 1946) దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు మరియు దర్శకుడు. దర్శకుడిగా * Athu Oru Kanaa Kaalam (2005) * Julie Ganapathy (2003) * Aur Ek Prem Kahani (1996) * సతీ లీలావతి (1995) * Marupadiyam (1993) * చక్రవ్యూహం (1992) * Poonthenaruvi Chuvannu (1991) * Vanna Vanna Pookkal (1991) * సంధ్యారాగం (1989) * Veedu (1988) * Irattaival Kuruvi (1987) * Rendu Thokala Titta (1987) * Yaathra (1985) * Unn Kannil Neer Vazhindal (1985) * Neengal Kettavai (1984) * Oomai Kuyil (1983) * Sadma (1983) * Moondram Pirai (1982) * నిరీక్షణ (1982) * Olangal (1982) * Manju Moodal Manju (1980) * Moodupani (1980) * Azhiyatha Kolangal (1979) * కోకిల (1977) * Motor Sundaram Pillai (1966) ఛాయాగ్రహకుడిగా * Yaathra (1985) * Pallavi Anu Pallavi (1983) * Sadma (1983) * Moondram Pirai (1982) * Olangal (1982) * సీతాకోకచిలుక (1981) * Moodupani (1980) * శంకరాభరణం (1979) * మనవూరి పాండవులు (1978) * లంబాడోళ్ళ రామదాసు (1978) * సొమ్మొకడిది సోకొకడిది (1978) * Ulkatal (1978) * తరం మారింది (1977) * Nellu (1974)

బాపు

బాపు జన్మ నామం సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ జననం డిసెంబర్ 15,1933 స్వస్థలం నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా,ఆంధ్రప్రదేశ్ నివాసం చెన్నై, తమిళనాడు ఇతర పేర్లు బాపు వృత్తి చిత్రకారుడు, కార్టూనిస్ట్ మరియు సినిమా దర్శకుడు మతం హిందూ భార్య/భర్త భాగ్యవతి తండ్రి వేణు గోపాల రావు తల్లి సూర్యకాంతమ్మ వెబ్‌సైటు http://www.bapubomma.com/ బాపు తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం. 'బాపు బొమ్మ' అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు.బాపు బొమ్మల గురించి ప్రసిద్ది గాంచిన కవి ఆరుద్ర పద్య రూపంలో తన కవితల పుస్తకములో హ్రుద్యంగా వర్ణించిన తీరు చిరస్మరణీయమైనది ఒకటుంది. కొంటెబొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయలలూపు ఓ కూనలమ్మా! ఇలా కూనలమ్మ పదం రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతొ ఏకీబవించని వారు లేరు.బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఈయన చేతిరాతకూడ బాపు ఫాంటుగా అలరిస్తోంది. అందమయిన చేతిరాతకి అందరికి గుర్తొచ్చే ఫాంటు ఇదే అవటం అతిశయోక్తి కాదు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు,హిందీ సినిమాలు అవార్డులు, రివార్డులు పొందటముతొ పాటు అచ్చ తెలుగు సినిమాకి ఉదాహరణలుగా చరిత్రలొ నిలిచిపొయాయనటం పొగడ్త కాదు. క్లుప్తంగా ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపొయిన,తీసిన సినిమాలొ దర్శకుడిగా ఈయన పేరు చూడక పొయినా చప్పున ఎవరయినా ఇది గీసింది,తీసింది బాపూ అని గుర్తించగలిగేటంత విలక్షణమయిన శైలి ఈ ప్రతిభావంతుడి సొత్తు. విషయ సూచిక * 1 జీవితం * 2 చిత్రకళ * 3 బాపు చిత్రమాలిక * 4 చలన చిత్రకళ o 4.1 బాపు దర్శకత్వం వహించిన సినిమాలు * 5 ప్రదర్శనలు * 6 ప్రముఖుల అభిప్రాయాలు * 7 పురస్కారాలు * 8 మూలాలు * 9 బయటి లింకులు జీవితం బాపు తల్లి తండ్రులు బాల్యంలో బాపు బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబర్ 15, 1933 వ సంవత్సరం లో పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం లో వేణు గోపాల రావు,సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు.[1] 1955 వ సంవత్సరం లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి లాయర్ పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్ర పత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు. చిత్రకళ బాపుబొమ్మ బాపు స్వీయ రేఖాచిత్రం బాపు చిత్రకళ ఒక విషయానికి పరమితంకాలేదు. 1945 నుండీ బాపు చిత్రాలనూ, వ్యంగ్యచిత్రాలనూ, పుస్తకాల ముఖచిత్రాలనూ, పత్రికల ముఖచిత్రాలనూ, కధలకు బొమ్మలనూ, విషయానుగుణ చిత్రాలనూ పుంఖాను పుంఖాలుగా సృష్టిస్తున్నారు. కొత్త రచయితలూ, ప్రసిద్ధ రచయితలూ, పురాణాలూ, జీవితమూ, సంస్కృతీ, రాజకీయాలూ, భక్తీ, సినిమాలూ - అన్ని రంగాలలో ఆయన గీతలు వాసికెక్కాయి. ఆయన చిత్రాలతో ఉన్న శుభాకాంక్ష పత్రికలు (గ్రీటింగ్ కార్డులు), పెళ్ళి శుభలేఖలూ కళాప్రియులు కోరి ఏరుకుంటారు. బాపు రాత కూడా అంతే. ఇంతవరకూ తెలుగునాట ఎవరి చేతి వ్రాతకూ ఆ ప్రాముఖ్యత అందలేదు. తెలుగులో బాపు అక్షరమాల (ఫాంట్) ఎన్నో డి.టి.పి సంస్థలూ, ప్రచురణా సంస్థలూ వాడుతుంటాయి. నవరసాలు, అష్టవిధనాయికలు, జనార్దనాష్టకము, అన్నమయ్య పాటలు, రామాయణము, భారతీయ నృత్యాలు, తిరుప్పావై - ఇలా ఎన్నో విషయాలపై బాపు ప్రత్యేక చిత్రావళిని అందించారు. ఆయన చిత్రాలలో కొన్ని ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. * పొదుపుగా గీతలు వాడటం. * ప్రవహించినట్లుండే ఒరవడి * సందర్భానికి తగిన భావము * తెలుగుదనము బుడుగు బాపు కొతకాలం జె.వాల్టర్ థామ్సన్ సంస్థలోనూ, ఎఫిషియెంట్ పబ్లికేషన్స్ లోనూ, ఎఫ్.డి.స్టీవార్ట్స్ సంస్థలోనూ పని చేశారు. బాపు కృషిలో సహచరుడైన ముళ్ళపూడి వెంకటరమణ తో కలిసి రూపొందించిన బుడుగు పుస్తకం తెలుగు సాహిత్యంలో ఒక క్లాసిక్. ఇందులో బుడుగు తో పాటు సిగానపెసూనంబ తెలుగువారి హృదయంలో చిరకాలస్థానం సంపాదించుకొన్నారు. ఆయన చిత్రాలు దేశదేశాలలో ఎన్నో ప్రదర్శనలలో కళాభిమానుల మన్నలందుకొన్నాయి. బాపు చిత్రమాలిక అసంఖ్యాకంగ ఈయన గీసిన అందమయిన, అద్భుతమయిన చిత్రాలలొనుండి మచ్చుకు కొన్ని... బాల కృష్ణుడు గంగావతారం సీతారాముల పట్టాభిషేకం సరస్వతీదేవి రామాయణం క్లుప్తంగా దారి విడుము కృష్ణా... కూచిపూడి... నమస్కారం చలన చిత్రకళ 1967లో సాక్షి (సినిమా) చిత్రదర్శకునిగా సినిమారంగంలో అడుగుపెట్టిన బాపు మొదటి చిత్రంతోనే ప్రసంసలు అందుకొన్నారు. అయన మొత్తం 41 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1976లొ వెలువడిన 'సీతాకల్యాణం' సినిమా చూసెవారికి కన్నుల పండుగ. ముఖ్యంగా అందులో గంగావతరణం సన్నివేశం మరువరానిది. బాపు తను తీయబోయే చలన చిత్రపు సన్నివేశాలని సచిత్రంగా ( స్టోరీబోర్డు ) తయారు చేసుకుని తెరమీదకి ఎక్కిస్తారు.ఈ విదానం వలన తను మనసులో అనుకున్నది కాగితం మీద ఎంత అందంగా చిత్రీకరించుకుంటారో అంతే అందంగా తెరమీద గందరగోళం లేకుండా చిత్రీకరించగలుగుతారు. ఉదాహరణకి...రాధాగోపాళం తెలుగు సినిమాకి ఈయన గీసుకున్న సన్నివేశపు చిత్రం. రాధాగోళం సినిమాకు స్టోరీబోర్డు చిత్రాలు - ముందుగా గీసిన చిత్రాలతోబాటు సినిమా తీసిన తరువాతి షాట్లను కూడా చూడవచ్చును. బాపు దర్శకత్వం వహించిన సినిమాలు చిత్రం పేరు విడుదల సంవత్సరం బాష తెలుగు సుందరకాండ 2008 తెలుగు రాధా గోపాళం 2005 తెలుగు రాంబంటు 1996 తెలుగు పెళ్ళికొడుకు 1994 తెలుగు పరమాత్మా 1994 హిందీ శ్రీనాథ కవిసార్వభౌమ 1993 తెలుగు మిష్టర్ పెళ్ళాం 1993 తెలుగు పెళ్ళి పుస్తకం 1991 తెలుగు ప్రేమ్ ప్రతిగ్యా 1989 హిందీ దిల్ జలా 1987 హిందీ ప్యార్ కా సిందూర్ 1986 హిందీ కళ్యాణ తాంబూలం 1986 తెలుగు మేరా ధరమ్ 1986 హిందీ ప్యారీ బెహనా 1985 హిందీ బుల్లెట్ 1985 తెలుగు జాకీ 1985 తెలుగు మోహబ్బత్ 1985 హిందీ సీతమ్మ సేత 1984 తెలుగు మంత్రిగారి వియ్యంకుడు 1983 తెలుగు వోహ్ సాత్ దిన్ 1983 హిందీ ఏది ధర్మం ఏది న్యాయం 1982 తెలుగు కృష్ణావతారం 1982 తెలుగు నీతిదేవన్ మయగుగిరన్ 1982 తమిళం పెళ్ళీడు పిల్లలు 1982 తెలుగు బేజుబాన్ 1981 హిందీ రాధా కళ్యాణం 1981 తెలుగు త్యాగయ్య 1981 తెలుగు హమ్ పాంచ్ 1980 హిందీ వంశవృక్షం 1980 తెలుగు కలియుగ రావణాసురుడు 1980 తెలుగు పండంటి జీవితం 1980 తెలుగు రాజాధిరాజు 1980 తెలుగు తూర్పు వెళ్ళే రైలు 1979 తెలుగు మనవూరి పాండవులు 1978 తెలుగు అనోఖా శివభక్త్ 1978 హిందీ గోరంత దీపం 1978 తెలుగు స్నేహం 1977 తెలుగు భక్త కన్నప్ప 1976 తెలుగు సీతాస్వయంవర్ 1976 హిందీ శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీక్లబ్ 1976 తెలుగు సీతాకల్యాణం 1976 తెలుగు ముత్యాల ముగ్గు 1975 తెలుగు శ్రీ రామాంజనేయ యుద్ధం 1974 తెలుగు అందాల రాముడు 1973 తెలుగు సంపూర్ణ రామాయణం 1971 తెలుగు బాలరాజు కధ 1970 తెలుగు ఇంటి గౌరవం 1970 తెలుగు బుద్ధిమంతుడు 1969 తెలుగు బంగారు పిచ్చుక 1968 తెలుగు సాక్షి 1967 తెలుగు ప్రదర్శనలు ] ప్రముఖుల అభిప్రాయాలు * శివలెంక రాధాకృష్ణ-ఆంధ్ర పత్రిక సంపాదకులు-చక్కటి గీత, నొప్పించని హేళన, మొత్తం మీద అందంగా కనిపించే బొమ్మ-తెలుగు కార్టూన్‌లలో ఈ లక్షణాలు ఉన్న సంప్రదాయాన్ని శ్రీ బాపు గారు మొదలు పెట్టారు. పురస్కారాలు ముగ్దమనోహరమయిన ఒక స్రీ హొయలు... బాపు గారికి స్వదేశీ, విదేశీ పురస్కారాలు ఎన్నో లభించాయి. అందులో ముఖ్యమయినవి కొన్ని. * బాపు గారి దర్శకత్వం వహించిన ముత్యాల ముగ్గు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా (1975 వ సంవత్సరం) భారత ప్రభుత్వ పురస్కారం తో పాటు సినిమాటోగ్రాఫర్ ఇషాన్ అర్యాకి చాయగ్రాకుడిగా పురస్కారం. * 1986 వ సంవత్సరంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఎ.పి కళా వేదిక ద్వారా రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారం మదర్ థెరిస్సా బహుకరించగా తన స్నేహితుడు ముళ్ళపూడి వెంకట రమణ తో కలసి స్వీకారం.[2] * చెన్నై(తమిళనాడు)లో స్థాపించిన శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ వారి ప్రతిస్టాత్మకమయిన రాజ్యలక్ష్మి పురస్కారం 1982 వ సంవత్సరంలో ఇవ్వబడింది. * 1991 వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ బహుకరణ. * 1992 వ సంవత్సరంలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) వారిచే శిరోమణి పురస్కారం అమెరికాలో స్వీకరణ. * మిస్టర్ పెళ్ళాం సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ పురస్కారం.(1993 వ సంవత్సరం) * 1995 వ సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా(TANA) వారిచే తెలుగు చిత్ర కళా,సాహిత్య,సాంస్కృతిక,సినిమా రంగాలకి తన ఏభై సంవత్సరాల(గోల్డెన్ జూబ్లీ సెలేబ్రషన్) సేవకి గాను ఘన సన్మానం. * బాపు గారిమీద ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు వంశీ తీసిన డాక్యుమెంటరీ చిత్రానికి 1996 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు.[3] * 9 జూన్,2001 వ సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్టుస్ (IIC) వారిచే జీవిత సాఫల్య పురస్కారం తో సన్మానం. * 2 జూన్,2001 వ సంవత్సరంలో డిసెంబర్ న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారిచే విశిష్ట పురస్కారంతో గౌరవం. * అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్, తిరుపతి వారిచే ప్రెసిడెంట్ అఫ్ ఇండియా అవార్డు భాహుకరణ.[4] * బాలరాజు కథ (1970), అందాల రాముడు (1973), ముత్యాల ముగ్గు (1975),పెళ్లి పుస్తకం (1991), మిస్టర్ పెళ్ళాం (1993) సినిమాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది పురస్కారాలు.

పూరీ జగన్నాద్

పూరీ జగన్నాద్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. బద్రి ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. 2006వ సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన పోకిరి చిత్రం తెలుగు సినీ చరిత్రలో అతి పెద్ద హిట్ గా నిలిచింది.కాని ఆ తరువాత 2009వ సంవత్సరంలో విడుదలైన మగధీర ఆ రికార్డ్ ను అధిగమించింది.2009వ సంవత్సరంలో పూరి జగన్నాద్ కు ఉత్తమ మాటల రచయితగా( నేనింతే) నంది అవార్డ్ ప్రకటించారు. ] చిత్రాలు 1. బద్రి (2000) 2. బాచి (2001) 3. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం (2001) 4. అప్పు (2002) 5. ఇడియట్ (2002) 6. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి (2003) 7. శివమణి (2003) 8. ఆంధ్రవాలా (2004) 9. 143 (2004) 10. సూపర్ (2005) 11. పోకిరి (2006) 12. దేశముదురు (2007) 13. హలో ప్రేమిస్తారా (2007) 14. చిరుత (2007) 15. బుజ్జిగాడు (2008) 16. నేనింతే (2009) 17. ఏక్ నిరంజన్ (2009)

పి.పుల్లయ్య

పి.పుల్లయ్య (1911 - 1985) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. వీరి సినీ నిర్మాణం పద్మశ్రీ పిక్చర్స్ పతాకం పై చేపట్టారు. విషయ సూచిక దర్శకత్వం * అందరూ బాగుండాలి (1975) * కొడుకు కోడలు (1972) * అల్లుడే మేనల్లుడు (1970) * ప్రాణ మిత్రులు (1967) * Thaye Unakkaga (1966) * Asai Mukham (1965) * ప్రేమించి చూడు (1965) * మురళీకృష్ణ (1964) * సిరి సంపదలు (1962) * శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం (1960) * జయభేరి (1959) * Adisaya Thirudan (1959) * బండ రాముడు (1959) * Kalaivanan (1959) * Illarame Nallaram (1958) * Vanagamudi (1957) * Pennin Perumai (1956) * Umasundari (1956) * కన్యాశుల్కం (1955) * అర్ధాంగి (1955) * రేచుక్క (1954) * Manampole Mangalyam (1953) * ధర్మదేవత (1952/I) * Macha Rekai (1950) * తిరుగుబాటు (1950) * Veetukari (1950) * Bhakthajana (1948) * మాయా మచ్చీంద్ర (1945) * భాగ్యలక్ష్మి (1943) * ధర్మపత్ని (1941/I) * Premabandhan (1941) * Subhadra (1941) * Balaji (1939) * సారంగధర (1937/I) * హరిశ్చంద్ర (1935) నిర్మాత * కొడుకు కోడలు (1972) * అల్లుడే మేనల్లుడు (1970) * ప్రాణమిత్రులు (1967) * ప్రేమించి చూడు (1965) * సిరి సంపదలు (1962) * శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం (1960) * అర్థాంగి (1955) * ధర్మపత్ని (1941)

పి.యస్.రామకృష్ణారావు

పి.యస్.రామకృష్ణారావు (1918 - 1986) తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు దర్శకులు. వీరు భరణి పిక్చర్స్ అధిపతి. వీరు ప్రముఖ నటి భానుమతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. దర్శకునిగా * గృహలక్ష్మి (1967) * వివాహ బంధం (1964) * అనుబంధాలు (1963) * ఆత్మబంధువు (1962) * బాటసారి (1961) * Kanal Neer (1961) * శభాష్ రాజా (1961) * Manamagal Thevai (1957) * వరుడు కావాలి (1957) * చింతామణి (1956) * విప్రనారాయణ (1954) * చక్రపాణి (1954) * బ్రతుకు తెరువు (1953) * Kathal (1952) * ప్రేమ (1952) * లైలా మజ్ఞు (1949) * రత్నమాల (1947) నిర్మాతగా * గృహలక్ష్మి (1967) * వివాహబంధం (1964) * బాటసారి (1961) * వరుడు కావాలి (1957) * చింతామణి (1956) * విప్రనారాయణ (1954) * చక్రపాణి (1954) * చండీరాణి (1953) * ప్రేమ (1952) * లైలా మజ్ఞు (1949) * రత్నమాల (1947) రచయితగా * గృహలక్ష్మి (1967)

పాలడుగు దుర్గా ప్రసాద్

పాలడుగు దుర్గా ప్రసాద్ (Paladugu Durga Prasad) తెలుగు సినిమా దర్శకుడు. వీరి ప్రసిద్ధమైన సినిమాలలో వెంకటేశ్వర వైభవం, పెద్దన్నయ్య, జీవిత చదరంగం మొదలైనవి .

పరిటాల ఓంకార్

పరిటాల ఓంకార్ ప్రముఖ రచయిత, టీవీ నటుడు. రేడియోలో వార్తలు చదవడంతో మొదలుపెట్టి, తరువాత పత్రికలలో శీర్షికా రచయితగా, టీవీ సీరియళ్ళకు రచయితగా, సినిమా నటుడిగా, టీవీ సీరియళ్ళలో నటుడిగా పనిచేసాడు. ఒక సినిమాకు దర్శకత్వం కూడా చేసాడు. టీవీ సీరియళ్ళ రచయితగా, నటుడిగా ఓంకార్ విశేషమైన పేరు సంపాదించాడు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను తన సీరియళ్ళలో చొప్పించి, ప్రజాదరణ పొందాడు. నటుడిగా తన విలక్షణమైన వాచికంతో ఆకట్టుకున్నాడు. ఓంకార్ పోలీసుభార్య, పందిరిమంచం వంటి చిత్రాలలో నటించాడు. స్వాతి వారపత్రికలో ఓంకారం పేరుతో వారం వారం శీర్షిక నిర్వహిస్తూ ఉంటాడు

డా. దాసరి నారాయణరావు

డా. దాసరి నారాయణరావు 1947, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించాడు. దాసరి, రాజకీయనాయకుడు, సినిమా దర్శకుడు మరియు సినీ నిర్మాత. కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడి గా, నాటక రచయిత గా చిత్ర దర్శకుడి గా గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. దాసరి తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదానికి తెలుగుసినీరంగంలో ఉదాహరణగా ఈయన గురించి చెబుతారు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది. దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మరియు మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి తిసిన బొబ్బిలి పులి మరియు సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి. మామగారు, సూరిగాడు మరియు ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు. రాజకీయాలలో హైదరాబాదునందు కేంద్ర మంత్రిగా దాసరి తెలుగు ఫాంట్స్ రిలీజ్ ఫంక్సన్ నందు ఉపన్యసిస్తున్న దృశ్యం రాజీవ్ గాంధీ పాలనాకాలములో, దాసరి కాంగ్రేసు పార్టీ తరఫున ఉత్సాహవంతముగా ఎన్నికల ప్రచారము సాగించాడు. రాజీవ్ హత్యానంతరం పార్టీ కి కాస్త దూరంగా జరిగారు. 1990 దశకం చివరిలో ఆయన తెలుగు తల్లి అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని కాపు వర్గాల నుండి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత మాత్రం ఆయన కాంగ్రేస్ పార్టీ తరపున రాజ్య సభ కు ఎన్నిక అయ్యారు. బొగ్గు మరియు గనుల శాఖకు కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించారు. ఈయన కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కి సన్నిహితుడు. కాంగ్రేస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అవార్డులు * 1974లో తాతా మనవడు సినిమాకి నంది అవార్డు అందుకున్నారు. * స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రం గా బంగారు నంది బహుమతిని పొందారు. * 1983లో మేఘ సందేశం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందారు. * 1992లో మామగారు చిత్రానికి గాను ఉత్తమ నటుడు నంది అవార్డును పొందారు. * 1986లో తెలుగు సంస్కృతి మరియు తెలుగు చిత్ర రంగం నకు ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్రా విశ్వవిధ్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ను పొందారు. * ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి అనేక అవార్డ్ లను పొందారు. వాటిలో కొన్ని వంశీ బెర్క్లే, కళా సాగర్, శిరోమణి ఇన్స్టిట్యుట్ మొదలైనవి. ఫిల్మ్ ఫేర్ అవార్డును 6 సార్లు, మద్రాసు ఫిల్మ్ ఫాన్స్ అవార్డ్ ను 5 సార్లు, సినీ హెరాల్డ్ అవార్డ్ ను 10 సంవత్సరాలు వరసగాను గెల్చుకున్నారు. * జ్యోతి చిత్ర నుండి సూపర్ డైరెక్టర్ అవార్డ్ ను 3 సార్లు పొందారు. * పాత కాలం నాటి ఆంధ్రపత్రిక నుండి ఉత్తమ దర్శకుడిగా 6 సార్లు ఎంపిక అయ్యారు. * ఇవి కాక ఆయన నిర్మించిన చిత్రాలలో అనేకం అవార్డ్ లను గెలుచుకున్నాయి.

త్రిపురనేని గోపీచంద్

త్రిపురనేని గోపీచంద్ ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది నాస్తికుడు , సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు . గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు.అనేక వాదాలతో వివాదపడుతూ, తత్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం,ఆస్తి,శక్తి ఎందుకు? అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. ఎందుకు? అన్న ప్రశ్ననే అతన్ని ఒక జిజ్ఞాసువు గా,తత్వవేత్త గా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది. గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన రాసిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. 1963లో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. [1] విషయ సూచిక [దాచు] * 1 జీవిత క్రమం * 2 రచనలు o 2.1 నవలలు o 2.2 వాస్తవిక రచనలు * 3 తెలుగు సినిమాలు * 4 బయటి లింకులు * 5 మూలములు జీవిత క్రమం * 8-సెప్టెంబర్-1910 నాడు గోపీచంద్ జన్మించాడు. సుప్రసిద్ధ రచయిత, హేతువాది, సంస్కరణవాది అయిన త్రిపురనేని రామస్వామి చౌదరి ఆయన తండ్రి, తల్లి పున్నమాంబ. * హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో పెరిగిన గోపీచంద్ పై వాటి ప్రభావం సహజంగానే పడింది. * 1932 లో వివాహం;1933లో బి,ఏ పట్టా ఆ తర్వాత లా డిగ్రీ. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో యిమడలేక పోయాడు. ఈ దశలో ఆయన కమ్యూనిజం(మార్క్సిజం)పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అందులోని అరాచకత్వం ఆయనకు నచ్చలేదు. * ఆ తర్వాత ఎమ్.ఎన్.రాయ్ 'మానవతావాదం' వారిపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేసాడు. * 1928లోనే శంబుక వధ కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో పట్టాభి గారి సోషలిజం అన్న పుస్తకాన్ని వెలువరించాడు. * తొలుత కథా సాహిత్యంలో స్థిరపడ్డ గోపీచంద్ ఆ తర్వాత నవలా సాహిత్యరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన తొలి నవల పరివర్తనం(1943). * 1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయాడు. * 1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసాడు. * 1957-62 వరకు ఆకాశవాణిలో పనిచేసాడు. ఈ దశలో అరవిందు ని భావాల పట్ల విశ్వాసం ఏర్పడడంతో ఆధ్యాత్మికవాదం వైపుకి పయనించాడు. * 1962 నవంబర్ 2 నాడు గోపీచంద్ మరణించాడు. నవలలు * అసమర్థుని జీవయాత్ర * గడియపడని తలుపులు * చీకటి గదులు * పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా * ప్రేమోపహతుల * పరివర్తన * యమపాశం * శిధిలాలయం వాస్తవిక రచనలు * తత్వవేత్తలు * పోస్టు చేయని ఉత్తరాలు * మాకూ ఉన్నాయి సొగతాలు తెలుగు సినిమాలు * చదువుకున్న అమ్మాయిలు (1963) (మాటల రచయిత) * ధర్మదేవత (1952) (మాటల రచయిత) * ప్రియురాలు (1952) (కథ, మాటల రచయిత మరియు దర్శకుడు) * పేరంటాలు (1951) (దర్శకుడు) * లక్ష్మమ్మ (1950) (దర్శకుడు) * గృహప్రవేశం (1946) (కథా రచయిత) * రైతుబిడ్డ (1939) (మాటల రచయిత)

తాతినేని రామారావు

తాతినేని రామారావు (Tatineni Ramarao) తెలుగు, హిందీ సినిమాల దర్శకుడు. ఎన్.టి.రామారావు నటించిన యమగోల చిత్రానికి ఈయనే దర్శకుడు. రామారావు 1938లో కృష్ణా జిల్లా, కపిలేశ్వరంలో జన్మించాడు.

టి.ప్రకాశరావు

లేదా తాతినేని ప్రకాశరావు (1924-1992) సుప్రసిద్ధ తెలుగు, తమిళ మరియు హిందీ సినిమా దర్శకులు. వీరు కృష్ణా జిల్లా కపిలేశ్వరంలో జన్మించారు. సినిమా రంగంలో యల్.వి.ప్రసాద్ షావుకారు సినిమాకు మరియు కె.వి.రెడ్డి గారి వద్ద పాతాళ భైరవి సినిమాకు అసిస్టెంటుగా పనిచేశారు. తర్వాత పరివర్తన, పల్లెటూరు, జయం మనదేరా మొదలైన ఎన్నో తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, యం.జి.ఆర్. మొదలైన అగ్రనటులతో ఎన్నో తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీలో దాదాపు పెద్ద నటులందరితోనూ 25 పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. మొత్తంగా సుమారు 60 పైగా దర్శకత్వం వహించినవాటిలో కొన్ని చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. వీరు తాష్కెంట్ చలన చిత్రోత్సవంలోను, ఉజ్ బెకిస్థాన్ లోను రెండు సార్లు డెలిగేషన్ లో పాల్గొన్నారు. సినిమాలు * Kab Tak Chup Rahungi (1988) * Engalalum Mudiyum (1982) * Asha Jyoti (1981) * Ganga Bhavani (1979) * Hamara Sansar (1978) * Chiranjeevi Rambabu (1977) * పొగరుబోతు (1976) * సంసారం (1975) * Gali Patalu (1974) * మైనరు బాబు (1973) * Rivaaj (1972) * Ghar Ghar Ki Kahani (1970) * Nanha Farishta (1969) * Duniya (1968) * Izzat (1968) * Vaasna (1968) * Suraj (1966) * Bahu Beti (1965) * Padakottai (1964) * Bahurani (1963) * Hamrahi (1963) * Kaathiruntha Kangal (1962) * Anbu Magan (1961) * Sasural (1961) * College Girl (1960) * Ellorum Innattu Mannar (1960) * Maa Babu (1960) * ఇల్లరికం (1959) * Kanniraindha Kanavan (1959) * Nalla Theerpu (1959) * Amar Deep (1958) * Sitamgar (1958) * Uttama Puthiran (1958) * అమరదీపం (1956) * చరణదాసి (1956) * జయం మనదేరా (1956) * Matharkula Manikkam (1956) * పరివర్తన (1954) * నిరుపేదలు (1954) * పిచ్చి పుల్లయ్య (1953) * పల్లెటూరు (1952)

తమ్మారెడ్డి భరద్వాజ

తమ్మారెడ్డి భరద్వాజ ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకులు. దర్శకునిగా, నిర్మాతగా * పోతే పోనీ (2006) * వన్ బై టూ (2003) * సంచలనం (2000) * స్వర్ణముఖి (1998) * అత్తా నీకొడుకు జాగ్రత్త (1997) * కూతురు (1996) * వేటగాడు (1995) * రౌడీ అన్నయ్య (1993) * ఊర్మిళ (1993) * పచ్చని సంసారం (1992) * శివశక్తి (1991) * నేటి దౌర్జన్యం (1990) * అలజడి (1990) * మన్మధ సామ్రాజ్యం (1988) * స్వర్ణక్క (1998) * ఇద్దరు కిలాడీలు (1983) * మరో కురుక్షేత్రం (1981) * మొగుడు కావాలి (1980) * కోతల రాయుడు (1979)

డూండీ

డూండీ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు. ఆయన అసలు పేరు పోతిన డూండీశ్వరరావు. డూండీగా ఆయన సుప్రసిద్ధుడు. 70 కి పైగా సినిమాలు నిర్మించాడు. అభిమానవతి అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించాడు. తెలుగు తెరపై అనేక ప్రయోగాలు చేసిన నిర్మాతగా డూండీకి పేరుంది. ఈయన తండ్రి పోతిన శ్రీనివాసరావు మన రాష్ట్రంలో మొట్టమొదటి సినిమా హాల్‌ (విజయవాడ మారుతీ టాకీస్‌)ను నిర్మించాడు. 1956లో తన తొలి చిత్రంతో తెలుగు సినీ రంగంలో నిర్మాతగా అడుగిడిన డూండీ 'బందిపోటు', 'రక్తసంబంధం', 'శాంతినివాసం', 'గూఢచారి 116', 'మరపురాని కథ' లాంటి చిత్రాలు నిర్మించారు. తెలుగు సినిమాలలో కృష్ణను జేమ్స్‌ బాండ్‌ రూపంలో చూపించిన నిర్మాత డూండీనే. 2005 నంది అవార్డుల ఎంపిక కమిటీకి సారథ్యం వహించిన డూండీ 2007 జనవరి 1 న మరణించాడు.

జంపన చంద్రశేఖరరావు

జంపన చంద్రశేఖరరావు ప్రముఖ ప్రజా రచయిత, తెలుగు సినిమా రచయిత, దర్శకుడు మరియు నిర్మాత. వీరు ఏలూరులో జన్మించి, విద్యాభ్యాసం చేసి, తెలుగులో ఎం.ఎ. పట్టా పొందారు. అక్కడి సి.ఆర్.రెడ్డి కళాశాలలో కొంతకాలం తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. వీరు చెన్నైకి మకాం మార్చి నవలా రచలను చేశారు. కొవ్వలి లక్ష్మీనరసింహారావు నవలలు రైళ్ళలో విపరీతంగా ఖర్చవడం చూసి వీరి పద్ధతిలో తానూ అలాంటి నవలలను ఎక్కువగా రాశారు. ఆరోజుల్లో కొవ్వలి, జంపన నవలలను చదవని వారు అరుదు. వీరు రాసిన నవలలలో ఎవరి పెళ్లాం? (1940), నల్లకళ్ల అమ్మాయి (1947), వెంకటేశ్వర మహాత్మ్యం, ఊర్వశి అనే నాటకం (1948), ఆకలి అనే ఖండకావ్య సంపుటి ముఖ్యమైనవి. వీరు అపరాధ పరిశోధన నవలలు అనేకం రాశారు. స్త్రీ పురుష సంబంధాలు, వివాహ సమస్యలు వీరి రచనలలో ప్రాధాన్యం వహించిన అంశాలు. సరళమైన భాష, ఉత్కంఠభరితమైన కథాకథన విధానం వీరి రచనలకు ప్రజాదరణ చేకూర్చాయి. వీరు 1953లో చెన్నైలో హృద్రోగంతో పరమపదించారు. చిత్రాలు * భట్టి విక్రమార్క (1960) (దర్శకుడు) * హరిశ్చంద్ర (1960) (దర్శకుడు) * కృష్ణలీల (1959) (దర్శకుడు) * మేనరికం (1954) (నిర్మాత మరియు దర్శకుడు) * వాలి సుగ్రీవ (1950) (దర్శకుడు)

జంధ్యాల

జంధ్యాల తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. జంధ్యాల అని ఇంటిపేరుతోటే సుప్రసిద్ధుడైన ఇతని అసలుపేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో ఇతనిది అందె వేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం - నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం విషయ సూచిక * 1 జీవిత విశేషాలు * 2 సినిమా ప్రస్థానం * 3 జంధ్యాల చెణుకులు * 4 అవార్డులు * 5 జంధ్యాల పరిచయం చేసిన నటీనటులు * 6 జంధ్యాల వ్రాసిన కొన్ని సినీ సంభాషణలు * 7 జంధ్యాల సినిమాలు * 8 బయటి లింకులు జీవిత విశేషాలు జంధ్యాల 1951 జనవరి 14 న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. బి.కామ్ వరకు చదువుకున్నారు. చిన్నతనం నుండీ నాటకాల పట్ల ఆసక్తిగా ఉండేవారు. స్వయంగా నాటకాలు రచించారు కూడాను. ఆయన రాసిన నాటకాల్లో ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును ప్రముఖమైనవి. ఆయన నాటకాలు అనేక బహుమతులు అందుకున్నాయి. 1974 లో జంధ్యాల సినిమా రంగ ప్రవేశం చేసాడు. శంకరాభరణం, సాగరసంగమం, అడవిరాముడు, వేటగాడు వంటి అనేక విజయవంతమైన సినిమాలకు మాటలు రాసారు. ముద్దమందారం సినిమాతో దర్శకుడిగా మారి, శ్రీవారికి ప్రేమలేఖ వంటి చిరస్మరణీయ చిత్రాన్ని సృజించారు. జంధ్యాల 2001 జూన్ 19 న హైదరాబాదులో గుండె పోటుతో మరణించారు. ] సినిమా ప్రస్థానం మాటల రచయితగా తన సినిమా జీవితం మొదలుపెట్టిన జంధ్యాల, మంచి రచయితగా పేరు తెచ్చుకున్నాడు. తరువాతి కాలంలో దర్శకుడిగా అవతారమెత్తి, అనేక హాస్యచిత్రాలను రూపొందించాడు. ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల పేరుగాంచాడు. హాస్యబ్రహ్మ అని పేరుపొందాడు. జంధ్యాల చెణుకులు * ఇంటిపేరుతోటే ప్రసిద్ధుడైన జంధ్యాలను మీ అసలు పేరు ఏమిటి అని అడిగితే ఆయన ఇలా అనేవాడు: "నేను రామానాయుడి గారి సినిమాకు పనిచేసేటపుడు నాపేరు జంధ్యాల రామానాయుడు, విశ్వనాథ్ గారి సినిమాకు పనిచేసేటపుడు నా పేరు జంధ్యాల విశ్వనాథ్..." అలా అనేవాడు తప్ప, తన అసలుపేరు ఎక్కడా చెప్పుకోలేదు. * హాస్యం గురించి ఆయన ఇలా అనేవాడు: "నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం" అవార్డులు జంధ్యాలకు లభించిన కొన్ని అవార్డులు: - 1983, "ఆనంద భైరవి" చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం దర్శకుడు జాతీయ అవార్డు - 1983, "ఆనంద భైరవి" చిత్రానికి ఉత్తమ దర్శకుడు నంది అవార్డు - 1987, "పడమటి సంధ్యారాగం" చిత్రానికి ఉత్తమ కధారచయిత అవార్డు - 1992, "ఆపద్బాంధవుడు" చిత్రానికి ఉత్తమ మాటల రచయిత అవార్డు జంధ్యాల పరిచయం చేసిన నటీనటులు జంధ్యాల తన సినిమాల ద్వారా అనేకమంది నటులను సినిమా రంగానికి పరిచయం చేసాడు. వారిలో కొందరు: * బ్రహ్మానందం * నరేష్ * ప్రదీప్ * సుత్తి వీరభద్రరావు * సుత్తి వేలు జంధ్యాల వ్రాసిన కొన్ని సినీ సంభాషణలు వివాహ భోజనంబు చిత్రం నుంచి మట్టి పూసుకొని ఉన్నపుడు బ్రహ్మానందం సంభాషణ--(ఏడుపు గొంతుతో) ఈ చెమ్మంతా ఇగిరేలోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాఏమో మహాప్రభో. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే . జూవాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళి పోతారు. జనమెవరయినా చూస్తే ఇతర గ్రహాలనుండి వచ్చారనుకొని రాళ్ళుచ్చుక్కొడతారు... (ఆశగా ) ఇంక ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభో. కధ చెప్పమని--ఈ కథ సినెమాగా తీస్తే నేను అడుక్కుతినాల, ఓ వూరు వూరంతా పస్తుండి నాకు ముష్టెయ్యాల్సొస్తుంది. అరే ఇన్నాళ్ళనుండి సూత్తన్నాను. సినిమాకు పనికొచ్చే ఒక కథ కూడా సెప్పలేనోడివి నువ్వేం కవివయ్యా అసలు. నేనొక గొప్ప కథ సెప్తాను ఇనుకో మధ్య తరగతి ఎదవనాయాలా. మహాప్రభో తమరు నన్ను తిట్టారా? లేదు సినిమా పేరు చెప్పా--ఆ పేరు తిట్టులా ఉంది మహాప్రభో --పేరులో తిట్టుంటేనే సినిమా హిట్టవుద్దయ్యా తెర లెగవంగానే ఈరో ఒక కాఫీ ఓటల్కు ఎల్తాడు. సర్వర్ రాగానే ఈరో ఏమున్నాయి అని అడిగాడు. అప్పుడు సర్వరు "ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మషాలా గారె, ఉప్మా, కిచిడీ, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మషాలా అట్టు, బాత్తు, టమేటా బాత్తు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరిటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిథాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా,హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా" ఉన్నాయంటాడు. అప్పుడు ఈరో "అట్టు తే" అన్నాడు అప్పుడు సర్వరు " యే అట్టు? పెసరట్టా, మినపట్టా, రవ్వట్టా, మషాలా అట్టా, 70mm అట్టా, MLA అట్టా, నూనేసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా, నీళ్ళోసి కాల్చాలా, పెట్రోలు పోసి కాల్చాలా, కిరసనాలు పోసి కాల్చాలా, డీజిలేసి కాల్చాలా, అసలు కాల్చాలా వద్దా " అని అడిగాడు అప్పుడు ఈరో పెసరట్టు నెయ్యేసి కాల్చమన్నాడు, కాఫీ కూడా తెమ్మన్నాడు అప్పుడు సర్వరు "యే కాపీ మామూలు కాపీయా,స్పెసలు కాపీయా, బుర్రూ కాపీయా, నెస్కాఫీయా, బ్లాక్ కాఫీయా, వైటు కాఫీయా హాటు కాఫీయా, కోల్డు కాఫీయా , నురుగు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు " అని అడిగాడు అప్పుడు ఈరో మామూలు కాపీ తెమ్మన్నాడు అప్పుడు సర్వరు "నీలగిరి కాపీయా, హిమగిరి కాపీయా, సిమలా కాపీయా' ఆపండి మహాప్రభో, తమలో ఇంత వూహాశక్తి ఉందని వూహించలేకపోయాను. ఈ కథనే సినిమాగా తీసుకోండి. పది వేల రోజులు ఆడుతుంది జనం వ్రుద్దులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనం అయిపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభో నన్ను వదిలెయ్యండి మహాప్రభో నన్ను వదిలెయ్యండి మహాప్రభో అద్దె బాకీ మాఫీ చేస్తానని తమరు నన్నిలా శంకుస్థాపన టైపులో పాతిపెట్టి తమరలా విష్ణుమూర్థిలా పడుకోవడం ఏమీ బాగలేదు మహాప్రభో నిన్ను నేను పాతిపెట్టాను కదా, నన్ను పాతి పెట్టే మడిసి కోసం సూత్తన్నానయ్యా నన్ను తొరగా బయటకి లాగండి మహాప్రభో. ఏ ఊరకుక్కాన్నా దగ్గరికొచ్చి కాలెత్తిందంటే పావనమైపోతాను. లేదా యే అల్సేషనో ఇసుకలో బంతి పడిందని నా తల నొట కరుచుకొని వెళ్ళిపోతే కీర్తిశేషుడిని అయిపోతాను. చీ ముక్కు మీద దురద పుట్టినా గోక్కోలేని వెధవ బ్రతుకు అయిపోయింది నాది స్షో ఆట్టే వాగావంటే... .... నువ్వు సెప్తున్న కథలో ఏదో లోపముందయ్యా కవీ. నేను ఆలోసించి పెట్టుకున్న సిన్న లైను ఇనిపిస్తాను ఇనుకో వో ప్యామిలీ మంగలగిరి తిరణాలకెల్తారు. ఆళ్ళ కొడుకు ఆరేళ్ళ గుంటడు ఆ జనంలో తప్పోతాడు. ఆడి తల్లిదండ్రులు ఆడికోసం బావురుమంటారు ఆహా సెంటిమెంటు బాగుందండయ్యా. మొదటి సారిగా తమరు మెదడు వాడుతున్నారు, వాడండి ఆడి తండ్రి ఆడికోసం వూళ్ళన్నీ గాలించడం మొదలుపెట్టాడు. యే యే వూళ్ళు తిరిగాడో తెలుసా? ఐదరాబాదు, అదిలాబాదు, సికిందరాబాదు, అహమ్మాదాబాదు, ఫకీరాబాదు,అలహాబాదు, ఫరీదాబాదు. ఔరంగాబాదు, తనబాదు (??), సింధుబాదు,ముస్తాబాదు, ఫైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జపారాబాదు, వుస్సేనుబాదు. (బ్రహ్మం ఏడుస్తూ) నా బొందబాదు, నా శ్రాద్దంబాదు, నా పిండాకూడు బాదు ఆ ఆ ఆటన్నిటితో కలిపి మొత్తం ఇరవయ్యొక్క బాదులు ఎతికాడు. సివరాఖరికి యెవుడో ఆ గుంటడు బెజవాడలో ఉన్నాడని సెప్తే ఆ వూరెళ్ళాడు. బెజవాడలో గవర్నరుపేట, లబ్బీ పేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్యా నగరం, ముత్యాలపాడు, గుణదల, గాంధీ నగరం, చిట్టి నగరం, మాచవరం, రోకళ్ళపాలెం, మారుతీ నగరం, మొగల్రాజపురం, భవానీపురం, సత్యన్నారాయనపురం, సీతారామపురం... వద్దు బాబోఇ, చాలు మహాప్రభో చాలు, బెజవాడంతా వెతికేసాడనుకుందాం ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభో. అన్నీ పేట్లెతికినా ఆ గుంటడు దొరకలేదయా, అప్పుడు... పారిపోవడానికి కూడా వీలులేని పరిస్థిథిలో పడిపోయాను మహాప్రభో ఇను ఇక్కడే ఇక్కడే తమాషగుంటంది అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. యే యే రోడ్ల మీద పడ్డాడో తెలుసా? బీసెంటు రోడ్డు, బందరు రోడ్డు, యేలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టిక్కల రోడ్డు, కారల్ మార్క్సు రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టవును రోడ్డు, అద్దంకివారి వీధి, తాళంకివారి వీధి, దాసరివారి వీధి, మల్లెలవారి వీధి, పుల్లెలవారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోడా టాకీసు వీధి, అచ్చమామబ ఆస్పత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి... మహాప్రభో ఆపండి, ఇది సినిమా కథా? ఈ లెక్కన పోస్ట్ మ్యాన్లు అత్యద్భుతమయిన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తినా పందొచ్చి తల కొరికినా ఇంతకంటే సుఖంగా ఉంటుంది మహాప్రభో వేటగాడు చిత్రం నుంచి రావుగోపాలరావు, సత్యనారాయణతో -రాజా ప్రియురాలు రోజా మేజా బల్ల మీదికెక్కి కాజాలు తింటూ నీ వీపు మీద బాజాలు బాదుతోంటే నువ్వేంచేస్తున్నావురా కూజా" అన్నప్పుడు సత్యనారాయణ చిన్నబుచ్చుకున్న కోపంతో రావుగోపాలరావు ప్రాసల బలం ఎంతుందో చూపమంటాడు. అప్పుడు రావుగోపాలరావు - " రాజుగారి పెద్ద కొడుకు బెస్టుగా పస్టు క్లాసులో పాసయ్యాడని, బావుండదని గెస్టుగా పీస్టుకి పిలిచి, హోస్టుగా నేనుండి సపర్యలు చేస్తోంటే, సుస్టుగా భోంచేసి, పొద్దున్నే లేచి మన పేస్టుతోనే పళ్లు తోంకుని, ఉడాయించాడు భ్రస్టు వెధవ" అన్నప్పుడు ఇదంతా విని రొప్పుతున్న సత్యనారాయణని చూసి - " ఇంకా విసరమంటావా నా మాటల తూటాలు" అంటాడు. జంధ్యాల సినిమాలు దర్శకునిగా సినిమా తారాగణం విడుదల తేది ముద్ద మందారం ప్రదీప్, పూర్ణిమ 1981 మల్లె పందిరి విజ్జి బాబు, జ్యోతి, యస్.పి.బాల నుబ్రమణ్యం 1982 నాలుగు స్తంభాలాట నరేష్, ప్రదీప్, పూర్ణిమ, తులసి 15-5-1982 నెలవంక రాజేష్, గుమ్మడి, జే.వి.సోమయాజులు 25-1-1983 రెండుజెళ్ళ సీత నరేష్, ప్రదీప్, రాజేష్, సుభాకర్, మహాలక్ష్మి 30-3-1983 అమరజీవి అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద 19-8-1983 మూడు ముళ్ళు చంద్రమోహన్, రాధిక, గీత -9-1983 శ్రీవారికి ప్రేమలేఖ నరెష్, పూర్ణిమ 2-3-1984 ఆనంద భైరవి (తెలుగు & కన్నడం) గిరీష్ కర్ణాడ్, మాళవిక -4-1984 రావు - గోపాలరావు రావు గోపాలరావు, చంద్రమోహన్, ముఛ్ఛర్ల అరుణ 1984 పుత్తడి బొమ్మ నరేష్, పూర్ణిమ, ముఛ్ఛర్ల అరుణ 1985 బాబాయ్ అబ్బాయ్ బాలకృష్ణ, అనితా రెడ్డి, సుత్తి వీరభద్ర రావు 8-2-1985 శ్రీవారి శోభనం నరేష్, అనితా రెడ్డి 1985 మొగుడు పెళ్ళాలు నరేష్, భానుప్రియ 5-8-1985 ముద్దుల మనవరాలు భానుమతి, సుహాసిని, జయసుధ, చంద్రమోహన్, శరత్ బాబు 1985 రెండు రెళ్ళు ఆరు రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, రజని, ప్రీతి 11-1-1986 సీతారామ కళ్యాణం బాలకృష్ణ, రజిని 18-4-1986 చంటబ్బాయి చిరంజీవి, సుహాసిని 22-8-1986 పడమటి సంధ్యారాగం విజయశాంతి, టామ్, గుమ్మలూరి శాస్త్రి 11-4-1987 రాగలీల రఘు, సుమలత, తులసి, సంధ్య 4-6-1987 సత్యాగ్రహం చల్లా రామకృష్ణా రెడ్డి, సరిత, గుంటూరు శాస్త్రి 1987 అహ నా పెళ్ళంట రాజేంద్ర ప్రసాద్, రజని 27-11-1987 చిన్ని కృష్ణుడు రమేష్, కుషుబూ, శరత్ బాబు -4-1988 వివాహ భోజనంబు రాజేంద్ర ప్రసాద్, అశ్విని -4-1988 నీకు నాకు పెళ్ళంట డా.రాజశేఖర్, అశ్వని 8-1988 చూపులు కలసిన శుభవేళ నరేష్, మోహన్, అశ్వని, సుధ 7-10-1988 హై హై నాయకా నరేష్, శ్రీ భారతి 23-2-1989 జయమ్ము నిశ్చయమ్మురా రాజేంద్ర ప్రసాద్, సుమలత, చంద్రమోహన్, అవంతి 6-7-1989 లేడీస్ స్పెషల్ సురేష్, వాణీ విశ్వనాథ్, రశ్మి, సుత్తివేలు 1991 బావా బావా పన్నీరు నరేష్, రూపకళ 9-8-1991 ప్రేమ ఎంత మధురం నరేష్, మయూరి 6-9-1991 విచిత్రప్రేమ రాజేంద్ర ప్రసాద్, అమృత 1991 బాబాయి హోటల్ బ్రహ్మానందం, కిన్నెర 5-6-1992 ప్రేమా జిందాబాద్ రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్య, సుభలేఖ సుధాకర్ - అ ఆ ఇ ఈ వరుణ్ రాజ్, అచ్యుత్, విజయ్ కుమార్ - ష్ గప్‌చుప్ వరుణ్ రాజ్, భానుప్రియ 12-5-1994 ఓహో నా పెళ్ళంట హరీష్, సంఘవి 20-3-1996 విచిత్రం గజల్ శ్రీనివాస్, చంద్రశ్రీ, శ్రీ హర్ష, చార్మి 6-11-1999 రచయితగా * నారీ నారీ నడుమ మురారి * అడవి రాముడు * వేటగాడు * రహస్య గూఢచారి * సీతాకోక చిలుక

చిత్తూరు నాగయ్య

చిత్తూరు నాగయ్య ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు ధరించి చిరస్మరణీయుడయ్యాడు. దక్షిణభారత దేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలినటుడు. తెలుగు సినిమా నే కాకుండా, తమిళ సినిమాకి కూడా ఒక గౌరవాన్నీ, ప్రతిష్ఠనీ కల్పించిన నటుడు నాగయ్య. కేవలం తన నటనతోనూ, వ్యక్తిత్వంతోను ఆ గౌరవం తీసుకురాగలిగారాయన. సభ్యసమాజంలో సినిమానటులంటే చిన్నచూపు వుండేది - తొలిరోజుల్లో నాటకాల వాళ్లకి వున్నట్టు. ఆ చూపును పెద్ద చూపు చేసి సమదృష్టితో చూడగలిగేలా చేసిన మహనీయుడు చిత్తూరు వి.నాగయ్య. మహారాజుల దగ్గరా, విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గరా నాగయ్యకు విశేష గౌరవాలు లభించాయి. ఈ గౌరవ ప్రతిష్ఠలు ఆయనతోనే ఆరంభమయాయని చెప్పడం అతిశయోక్తి అనిపించుకోదు. చిత్తూరు నాగయ్య 1904 మార్చి 28న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. ఆయన అసలు పేరు "ఉప్పల దడియం నాగయ్య". కొంతకాలం పాత్రికేయునిగా పనిచేశారు. చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా ప్రసిద్ధులయ్యారు. విషయ సూచిక * 1 సినీరంగ ప్రవేశం * 2 వ్యక్తిత్వం * 3 దర్శకత్వం * 4 చివరి దశ * 5 ప్రశంసలు * 6 నటించిన చిత్రాలు * 7 ఇతర వనరులు * 8 చూడండి సినీరంగ ప్రవేశం 1938లో హెచ్.ఎమ్.రెడ్డి చిత్రం గృహలక్ష్మితో నాగయ్య సినీ ప్రస్థానం ప్రారంభమైంది. చిత్తూర్లో పత్రికా విలేకరిగా వుంటూ, నాటకాల్లో నటిస్తూ గ్రామఫోన్ రికార్డులు ఇస్తూ కాలక్షేపం చేస్తున్న నాగయ్యను సినిమారంగం ఆహ్వానించింది. ఆ రోజుల్లో పర్సనాలిటీ ఎలావుందని ఎవరూ చూసేవారు కాదు. 'పాటా పద్యం వచ్చునా - ఓకే!' అన్న రోజులు. రంగస్థలం మీద సంభాషణ చెప్పడంలో కూడా కొత్త విధానాన్ని చూపించారనీ, ఉచ్చారణ స్పష్టంగా వున్నదనీ నాగయ్యను హెచ్.ఎం.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, గృహలక్ష్మి (1938) చిత్రములో నటించడానికి పిలిచారు. అందులో ఈయన ఒక దేశభక్తుడి పాత్ర పోషించాడు. గృహలక్షిలో నాగయ్య పాడిన పాటలు అందర్నీ ఆకట్టుకొని ప్రాచుర్యం పొందాయి. తొలిచిత్రంతోనే చిత్తూరు వి.నాగయ్య మంచి నటుడు అనిపించుకున్నాడు. 1939లో బి.యన్.రెడ్డి వందేమాతరం చిత్రంలో నాగయ్యకు కధానాయకుని పాత్ర లభించింది. అదే చిత్రంలో నాగయ్య సంగీతాన్ని కూడా కూర్చారు. అప్పుడు 'హీరో ఇమేజ్' వుంటుందీ, పోతుందీ అన్న భావన లేనేలేదు. వెంటనే 'సుమంగళి (1940) లో వృద్ధపాత్ర ధరించారాయన. తర్వాతి చిత్రం దేవత (1941) లో హీరోయే. ఈ సినిమాలన్నీ తమిళనాడులో కూడా బాగా నడవడంతో, నాగయ్యకు తమిళ చిత్రాల్లో కుడా మంచి అవకాశాలొచ్చాయి. తమిళభాషను ఆయన క్షుణ్ణంగా నేర్చుకున్నారు. గ్రాంథికభాష కూడా అలవరుచున్నారు. తన పాటలు తానే పాడుతూ 'సిసలైన తెలుగు సినిమా హీరోగా' గొప్ప వెలుగు వెలిగారు నాగయ్య. స్వర్గసీమ (1945) ఒక ఉదాహరణ. భక్త పోతన (1942), త్యాగయ్య (1946), యోగి వేమన (1947) చిత్రాలు నాగయ్య జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఆ పాత్రల ప్రభావం ఆయన మీద బాగా పడింది. 1938-1973 మధ్య నాగయ్య 200పైగా తెలుగు, తమిళ సినిమాలలో నటించారు. సుమంగళి, భక్త పోతన, రామదాసు, యోగివేమన, త్యాగయ్య ఆయన నటించిన కొన్ని విశేష చిత్రాలు. అప్పటిలో నాగయ్య అత్యధిక పారితోషికం తీసుకొనే నటుడు. 1948లో తమిళ సినిమా "భక్యదలి (?)" కి నాగయ్యకు లక్ష రూపాయలు పారితోషికం. నాగయ్య మంచి గాయకుడు, సంగీత దర్శకుడు కూడాను. స్వర్గసీమ సినిమాకు నేపధ్యగాయకునిగా ఘంటసాలను పరిచయం చేశారు. త్యాగయ్య సినిమా చూసి మైసూరు మహారాజా నాగయ్యను 101 బంగారు నాణేలు, ఒక కంఠాభరణంతో సత్కరించారు. తెలుగు సినీరంగంలో మొట్టమొదటి పద్మశ్రీ సత్కారం గ్రహించింది నాగయ్యే. మాన్యులు, సామాన్యులు కూడా నాగయ్యను విపరీతంగా అభిమానించే వారు. తరువాత భాగ్యలక్ష్మి సినిమాతో చిత్రనిర్మాణంలోకి దిగారు. రామదాసు సినిమాలో ఆయన బాగా నష్టపోయారు. సినిమా నిర్మాణంలోను, దాన ధర్మాల వలన ఆయన ఆస్తి బాగా కరిగిపోయింది. సినిమా ప్రభావం మంచైనా, చెడైనా ప్రజల మీద వుంటుందంటారు. అది చూస్తూనే వున్నాం, వింటూనే వున్నాం. పోతన, వేమన పాత్రల ప్రభావంతోనే ముమ్మడివరం బాలుడు బాలయోగిగా మారాడన్నది తెలిసిన విషయమే. అప్పుడే బాబూరావు పటేల్ తన 'ఫిల్మిండియా' పత్రికలో 'మనదేశంలోనూ ఒక పాల్ ముని వున్నాడు' అని నాగయ్యను ప్రస్తుతించాడు. తెలుగునటుల్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న తొలినటుడు నాగయ్య. ఆ చిత్రం పక్షిరాజా వారి 'బీదలపాట్లు (50). దక్షిణభారతంలో 'పద్మశ్రీ' పురస్కారం పొందిన తొలినటుడూ నాగయ్యే. 'అదేదో నా ఘనత కాదు. నాకే వచ్చిన ప్రశంస కాదు. ఇదినటులందరిదీ!' అని చెప్పేవారు నాగయ్య ఎవరు కనిపించినా. వ్యక్తిత్వం ఆయన మాటతీరూ, చిరునవ్వూ అన్నీ శాంతం ఉట్టిపడుతూ వుండేవి. ఎవరి మీదా ఈర్ష్యాద్వేషాలూ, కోపతాపాలూ వుండేవి కావు. పోతన - తన దగ్గర లేకపోయినా, ఉన్నదేదో దానం చేసినట్టు, - నాగయ్య కూడా దానాలు చేసి చేసి, ఆస్తులన్నీ హరింప జేశారు. కొందర్ని నమ్మి కొంత డబ్బు మోసపోయారు. 'త్యాగయ్య తీస్తున్నప్పుడు వారి రేణుకా ఆఫీసు ధర్మసత్రంలా వుండేదని చెప్పుకుంటారు. చిన్న చిన్న వేషాలు వేసేవాళ్లూ, చిన్న టెక్నీషియన్లూ, అక్కడే బసా, భోజనాలూ! 'పొట్టిప్లీడరు (1966) సినిమా తీస్తున్నప్పుడు పద్మనాభం ఆయనతో మాటల సందర్భంగా చెప్పారు తను కూడా 'రేణుక' ఆఫీసులో కొంతకాలం వున్నానని. దానికాయన ఎంతో స్పందించి, 'అలాగా నాయనా! నీకు అప్పుడు ఏ లోపం జరగలేదు గదా, నువ్వెవరో నాకు తెలియకపోయెనే!' అని బాధపడ్డారు. అవుట్ డోర్ షూటింగులకి వెళ్తే, మధ్యాహ్నం భోజనసమయంలో షూటింగు చూడవచ్చిన జనానికి భోజనం పెట్టమనేవారు నాగయ్య. 'వాళ్లు కూడా పొద్దున నుంచి మనతోపాటే ఇక్కడ వున్నారుగదా!' అన్నది ఆయన సమాధానం. మద్రాసులో స్కూళ్లూ, కాలేజీలూ తెరిచే రోజుల్లో ఆయన ఇంటిముందు విపరీతంగా జనం గుమిగూడేవారు - ఆయన లేఖలురాసి ఇస్తే కాలేజీ, హైస్కూళ్లలో సీట్లు దొరకడం సులభయయేది. దర్శకత్వం దర్శకుడుగా త్యాగయ్య ఆయన తొలిచిత్రం. త్యాగయ్య సినిమాను ఆయనే నిర్మించి, దర్శకత్వము చేశారు. నాయిల్లు (1953), భక్త రామదాసు (1964) చిత్రాలూ డైరెక్టు చేశారు - నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ. కొంతకాలం క్రితం మద్రాసులో నాగయ్య స్మారకదినోత్సవం జరిగితే, 'త్యాగయ్య' ప్రదర్శించారు. ఆ చిత్రం చూసిన ప్రసిద్ధదర్శకుడు కె.విశ్వనాథ్ 'ఈ చిత్రంలోని ప్రతి అంశం ఎంతో కళాత్మకంగానూ, ఉన్నతంగానూ ఉన్నాయి. ఆయన తీసిన కొన్ని షాట్స్ నాలాంటి దర్శకుల ఊహకు అందనివీ అని కీర్తించారు. 'త్యాగయ్య సినిమాలోని 'ఎందరో మహానుభావులూ' పాట విన్న ప్రసిద్ధ గాయకుడు జేసుదాసు త్యాగరాజు ఎలా పాడివుంటారో, నాగయ్యపాట విన్నాక, ఊహించుకోవచ్చును. త్యాగరాజ సంప్రదాయాన్ని పాటిస్తూ, ఆకౄతిని అతిభక్తిశ్రద్ధలతో ఇంకొకరు పాడగలరా - అనిపిస్తుందీ అని చెప్పారు. ఆ చిత్రంలోని ఆయన గానామృతానికి పరవశించి, మైసూరుమహారాజా, తిరువాస్కూర్ మహారాజా, నాగయ్యను అతిఘనంగా సత్కరించారు. తిరువాస్కూరు రాజావారు, ఏకంగా తన సింహాసనం మీదనే కూర్చోబెట్టారుట. 'రామదాసు' చిత్రం వేళకే ఆయన ఆస్తులు కొండెక్కిపోయాయి. ఆయనకు నాలుగైదు తోటలు వుండేవి. రామదాసు సినిమా తీస్తున్నప్పుడు, రామదాసు పడిన కష్టాలన్నీ నాగయ్య అనుభవించారు. చిత్రం పూర్తి కావడానికి చాలాకాలం పట్టింది. చివరి దశ చివరి రోజులలో పేదరికాన్ని అనుభవించారు. కేవలం వందల రూపాయలకు చిన్న చిన్న వేషాలు వేశారు. తెలుగు సినీరంగములో ఒకదశలో అత్యధిక పారితోషికం తీసుకున్న నాగయ్య, ఆ తరువాత దశలో ఉదరపోషణకు చిన్న వేషాలు వేస్తూ అల్ప పారితోషికాలూ అందుకున్నారు. నా జీవితం అందరికీ ఒక పాఠం. తనకు మాలిన ధర్మం చెయ్యకండి. అపాత్రదానాలు చెయ్యకండి. ఎందరో గోముఖవ్యాఘ్రాలు వుంటారు. అందర్నీ నమ్మకండి! అని చెప్పేవారు - ఇళ్లు అన్నీ పోయి అద్దె ఇంట్లో వున్నప్పుడు! మద్రాసు పానగల్ పార్కులోని ఆయన విగ్రహం, వాణీ మహాల్ ఆడిటోరియం, ఆయన చలనచిత్ర ఉదాత్తపాత్రలూ ఆయన ఘనతను మనకు అనునిత్యం గుర్తుకు తెస్తూవుంటాయి. 1973లో నాగయ్య మరణించారు. ] ప్రశంసలు ] నటించిన చిత్రాలు 30వ దశకం 1. గృహలక్ష్మి(1938) 2. వందేమాతరం (1939) 40వ దశకం 1940 1. సుమంగళి 2. మహాత్మాగాంధీ (డాక్యుమెంటరీ) 3. విశ్వమోహిని 1941 1. దేవత 1943 1. భాగ్యలక్ష్మి 2. చెంచులక్ష్మి 3. భక్తపోతన 1945 1. స్వర్గసీమ 1946 1. త్యాగయ్య 2. యోగి వేమన 1949 1. మనదేశం 50వ దశకం 1950 1. బీదలపాట్లు 1953 1. నా ఇల్లు 2. ఇన్స్‌పెక్టర్ 3. ప్రపంచం 4. గుమస్తా 1954 1. మా గోపి 2. సంఘం 3. జాతకఫలం 1955 1. అనార్కలి 1956 1. భక్త మార్కండేయ 2. ముద్దు బిడ్డ 3. తెనాలి రామకృష్ణ 4. నాగపంచమి 1957 1. సతీ సావిత్రి 2. పాండురంగ మహత్యం 3. నలదమయంతి 1958 1. బొమ్మల పెళ్ళి 2. ఎత్తుకు పైఎత్తు 3. గంగా గౌరి సంవాదం 4. శ్రీ రామాంజనేయ యుద్దం 5. సంపూర్ణ రామాయణం 6. పార్వతీ కళ్యాణం 1959 1. బండరాముడు 2. జయభేరి 3. సిపాయి కూతురు 60వ దశకం 1960 1. అభిమానం 2. భక్త రఘునాథ్ 3. భక్త శబరి 4. మా బాబు(అతిధి) 5. సమాజం 6. శాంతినివాసం 7. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం 1961 1. భక్త జయదేవ 2. ఇంటికి దీపం ఇల్లాలే 3. సీతారామ కళ్యాణం 4. వాగ్దానం(అతిధి) 5. పెళ్ళిపిలుపు(అతిధి) 6. సతీ సులోచన(అతిధి) 7. ఋష్యశృంగ 1962 1. నాగార్జున 2. దక్షయజ్ఞం(అతిధి) 3. ఆరాధన(అతిధి) 4. స్వర్ణమంజరి 5. పెళ్ళి తాంబూలం 6. పదండి ముందుకు(అతిధి) 7. గాలి మేడలు 8. సిరిసంపదలు 9. మమకారం 1963 1. బందిపోటు 2. కానిస్టేబుల్ కూతురు 3. లవకుశ 4. అనురాగం(అతిధి) 5. శ్రీకృష్ణార్జున యుద్ధం 6. తల్లీ బిడ్డలు 7. లక్షాధికారి 8. ఇరుగు పొరుగు 1964 1. అగ్గిపిడుగు 2. ఆత్మబలం 3. అమరశిల్పి జక్కన 4. రామదాసు 5. వివాహ బంధం 6. గుడిగంటలు 7. దాగుడుమూతలు(అతిధి) 8. నవగ్రహ పూజా మహిమ 9. బొబ్బిలి యుద్ధం(అతిధి)

సి.ఎస్.రావు

సి.ఎస్.రావుగా ప్రసిద్ధిచెందిన చిత్తజల్లు శ్రీనివాసరావు సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు మరియు నటుడు. ఇతడు సుప్రసిద్ధ దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య మరియు నటీమణి శాంత కుమారి దంపతుల పుత్రుడు. ఇతని భార్య ప్రముఖ నాట్యకళాకారిణి మరియు నటీమణి రాజసులోచన. విషయ సూచిక * 1 చిత్ర సమాహారం o 1.1 దర్శకుడిగా o 1.2 నటుడిగా o 1.3 రచయితగా * 2 బయటి లింకులు చిత్ర సమాహారం దర్శకుడిగా * యోగి వేమన (1988) * గృహలక్ష్మి (1985) * రాజా హరిశ్చంద్ర (1984) * సత్య హరిశ్చంద్ర (1984) * Bhayankara Bhasmasura (1983) * మరో మాయాబజార్ (1983) * రాధమ్మ మొగుడు (1982) * అల్లరి పిల్లలు (1978) * Parasuraman (1978) * Shri Renukadevi Mahatme (1977) * మహాకవి క్షేత్రయ్య (1976) * మంచికి మరోపేరు (1976) * Punardatta (1976) * దేవుడులాంటి మనిషి (1975) * Swandam Kariyum Zindabad (1975) * యశోదా కృష్ణ (1975) * ఆడంబరాలు అనుబంధాలు (1974) * అనగనగా ఒక తండ్రి (1974) * బంధాలు అనుబంధాలు (1974) * దేశోద్ధారకులు (1973) * ధనమా? దైవమా? (1973) * శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం (1972) * భాగ్యవంతుడు (1971) * జీవిత చక్రం (1971) * రంగేళీ రాజా (1971) * దేశమంటే మనుషులోయ్ (1970) * మళ్ళీ పెళ్ళి (1970) * మారిన మనిషి (1970) * పెత్తందార్లు (1970) * రెండు కుటుంబాల కథ (1970) * ఏకవీర (1969) * మామకు తగ్గ కోడలు (1969) * బంగారు గాజులు (1968) * గోవుల గోపన్న (1968) * గ్రామదేవతలు (1968) * మన సంసారం (1968) * నిలువు దోపిడి (1968) * నిండు సంసారం (1968) * కంచుకోట (1967) * Pallava Sevengal (1967) * కీలు బొమ్మలు (1965) * Prachanda Bhairavi (1965) * ప్రతిజ్ఞా పాలన (1965) * లవకుశ (1963) * వాల్మీకి (1963/I) * టైగర్ రాముడు (1962) * Santhi Nivas (1962) * Pellikani Pillalu (1961) * Abhimanam (1960) * Shantinivasam (1960) * Naradhar Kalyanam (1959) * Sabhash Ramudu (1959) * Shabash Ramu (1959) * Anna Thamudu (1958) * Manchi Manasuku Manchi Rojulu (1958) * Shri Krishna Maya (1958) * Shri Krishna Tulabharam (1955/II) * Pona Machan Thirumbi Vandhan (1954) * Ponni (1953) నటుడిగా * కోకిల (1989) * జేబు దొంగ (1987) * Intlo Ramayya Veedilo Krishnayya (1982) * పెళ్ళి సందడి (1959) * Pakka Inti Ammayi (1953) * Anasuya (1936) (as Master Srinivasa Rao) * Dhruva (1936) (as Master Srinivasa Rao) రచయితగా * Pakka Inti Ammayi (1953) (screen adaptation)

లూరు వెంకట సుబ్బారావు (కలంపేరు చక్రపాణి)

ఆలూరు వెంకట సుబ్బారావు (కలంపేరు చక్రపాణి) ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత మరియు దర్శకులు. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకరు. చక్రపాణి గుంటూరు జిల్లా తెనాలిలో 1908, ఆగష్టు 5న ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో గురవయ్య, వెంకమ్మ దంపతులకు జన్మించారు. జాతీయోద్యమ ప్రభావానికి లోనై హైస్కూలు విద్యకు స్వస్తిచెప్పి యలమంచిలి వెంకటప్పయ్య వద్ద హిందీ భాషను అభ్యసించారు. ఆ సమయంలో హిందీ భాషా వ్యాప్తికి గాఢ కృషిసాగిస్తున్న వ్రజనందన వర్మ దగ్గర హిందీ భాషలో చక్కని పాండిత్యాన్ని గడించారు. 'చక్రపాణి' అనే కలం పేరును వీరికి అతనే ప్రసాదించారు. తరువాత స్వయంకృషితో సంస్కృతం, ఇంగ్లీషు భాషలలో గాఢ పరిచయాన్ని పొందారు. క్షయ వ్యాధిగ్రస్తుడై 1932లో మదనపల్లి లోని శానిటోరియంలో వైద్యం కోసం వెళ్ళారు. అక్కడే కొన్ని నెలలు ఉండి, ఒక సాటి రోగి అయిన ఒక పండితుని సాయంతో బెంగాలీ భాష కూడా నేర్చుకొన్నారు. నేర్చుకొన్న తరువాత బెంగాలీ నవలలను తెలుగులోకి అనువదించడం మొదలు పెట్టారు. ముఖ్యంగా శరత్‌బాబు నవలలకు ఆయన అనువాదం ఎంతటి నిర్దిష్టం అంటే - శరత్‌బాబు తెలుగువాడు కాడన్నా, ఆ పుస్తకాల మూలం బెంగాళీ అన్నా చాలా మంది నమ్మేవారు కాదు. తరువాత తెలుగులో చిన్న చిన్న కథలు, నవలలు వ్రాయటం మొదలుపెట్టారు. 1940లో ముంబైలోని ఫేమస్ ఫిలింస్ వారి ధర్మపత్ని కోసం వీరు మాటలు రాసారు. బి.ఎన్.రెడ్డి గారు రూపొందిస్తున్న స్వర్గసీమకు మాటలు రాయడానికి చెన్నై వెళ్ళారు. 1949-1950లో నాగిరెడ్డి, చక్రపాణి కలవడం, కలసి విజయా ప్రొడక్షన్స్ ను స్థాపించి, సినిమాలు తీయాలని నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి వాహినీ స్టుడియోలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 35 చలనచిత్రాలను రూపొందించారు. ఇద్దరూ కలసి షావుకారు, పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు లాంటి అజరామరమైన సినిమాలు తీశారు. సినిమాలే కాక చక్రపాణి గారు నాగిరెడ్డిగారితో కలసి పిల్లల కోసం చందమామ కథల పుస్తకం ప్రారంభించారు. 1934-1935లో కొడవటిగంటి కుటుంబరావుతో కలసి తెనాలిలో యువ మాసపత్రికను మంచి అభిరుచిగల తెలుగు పాఠకుల కోసం ప్రారంభించారు. 1960లో దీనిని హైదరాబాదుకు తరలించారు. వీరు సెప్టెంబరు 24, 1975 సంవత్సరంలో పరమపదించారు. విషయ సూచిక * 1 చిత్ర సమాహారం o 1.1 రచయితగా o 1.2 నిర్మాతగా o 1.3 దర్శకుడిగా చిత్ర సమాహారం రచయితగా * స్వయంవర్ (1980) (story) * శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976) (writer) * జూలీ (1975) (screen adaptation) * Gundamma Katha (1962) (story) * Manithan Maravillai (1962) (screen adaptation) * Rechukka Pragatichukka (1959) (screen adaptation) * Appu Chesi Pappu Koodu (1958) (adaptation) * Maya Bazaar (1957/II) (screen adaptation) * Missamma (1955) (writer) * Missiamma (1955) (writer) * Chandraharam (1954) (writer) * Pelli Chesi Choodu (1952) (writer) * Shavukaru (1950) (writer) * Swargaseema (1945) (dialogue) (story) * Dharmapatni (1941/I) (dialogue) * Dharmapatni (1941/II) (dialogue) [మార్చు] నిర్మాతగా * శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976) (producer) * జూలీ (1975) (producer) (as B. Nagi Reddi-Chakrapani) * గంగ మంగ (1973) (producer) * రామ్ ఔర్ ష్యామ్ (1967) (producer) * గుండమ్మ కథ (1962) (producer) * మనిదన్ మారవిల్లై (1962) (producer) * రేచుక్క పగటిచుక్క (1959) (producer) * అప్పుచేసి పప్పుకూడు (1958) (producer) * మాయా బజార్ (1957/I) (producer) * మిస్సమ్మ (1955) (producer) * చంద్రహారం (1954) (producer) * పెళ్ళి చేసి చూడు (1952) (producer) * పాతాళ భైరవి (1951) (producer) * షావుకారు (1950) (producer) [మార్చు] దర్శకుడిగా * శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ (1976) * అరస కత్తలి (1967) * మనిదన్ మారవిల్లై (1962)

ఘంటసాల బలరామయ్య

ఘంటసాల బలరామయ్య సుప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకులు. నాటకరంగంలో ప్రసిద్ధులైన వీరి సోదరులు రాధాకృష్ణయ్య గారి ప్రోత్సాహంతో వీరికి రంగస్థల అనుభవం కలిగింది. అన్నదమ్ములిద్దరూ 1933లో కలకత్తా వెళ్ళి చిత్రరంగంలొ అడుగుపెట్టారు. వీరు శ్రీరామా ఫిల్మ్స్, కుబేరా పిక్చర్స్ అనే కంపెనీలు పెట్టి 1936లో సతీ తులసి, 1938లో మార్కండేయ మరియు 1940లో మైరావణ చిత్రాల్ని నిర్మించారు. 1940లో ప్రతిభా పిక్చర్స్ సంస్థను నెలకొల్పి పార్వతీ కళ్యాణం సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. తరువాత కాలంలో చిత్ర నిర్మాణం మరియు దర్శకత్వం రెండు నిర్వహిస్తూ గరుడ గర్వభంగం (1943), సీతారామ జననం (1944), ముగ్గురు మరాఠీలు (1946), బాలరాజు (1948), శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి మరియు చిన్న కోడలు (1952) మొదలైనవి తయారుచేశారు. 1944లో నిర్మించిన సీతారామ జననం చిత్రం ద్వారా వీరు అక్కినేని నాగేశ్వరరావు మరియు అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు లను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. 1048లో నిర్మించిన బాలరాజు సినిమా సాటిలేని విజయాన్ని వీరికి అందించింది. తోటివారిలో పోటీపడి శ్రీ లక్ష్మమ్మ కథ చిత్రాన్ని కేవలం 19 రోజులలో నిర్మించి విడుదల చేశారు. వీరు అందరూ అభివృద్ధి చెందాలని, సుఖంగా జీవించాలని కోరుకొనేవారు. ఎన్నో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో వీరు పాల్గొన్నారు. తెలుగు సినీ రంగానికి వెలలేని సేవలందించిన వీరు 1954 లో గుండెపోటుతో పరమపదించారు.